ప్రకటన రాకుంటే నిరవధిక నిరాహార దీక్ష: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రకటన రాకుంటే నిరవధిక నిరాహార దీక్ష: వైఎస్ జగన్

ప్రకటన రాకుంటే నిరవధిక నిరాహార దీక్ష: వైఎస్ జగన్

Written By news on Tuesday, September 1, 2015 | 9/01/2015

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15లోపు ప్రత్యేక హోదాపై ప్రకటన  రాకుంటే నివరధిక నిరాహార దీక్ష చేపడతామని ఆయన వెల్లడించారు.  వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రంపై అందరూ కలిసికట్టుగా ఒత్తిడి తేవాలన్నారు.
అప్పటికీ కేంద్రం నుంచి ప్రకటన రాకుంటే ...సెప్టెంబర్ 15వ తేదీన గుంటూరులో నివరధిక నిరాహార దీక్ష చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు.  ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి తన మంత్రులను చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకుంటానంటే కేంద్రంలో కదలిక వస్తుందని వైఎస్ జగన్ అన్నారు. కేంద్రంపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తామన్నారు.


వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే....
  • ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాం
  • ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాడుతోంది
  • దీనికి కోసం కేంద్రంపై పోరాడాలి
  • చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
  • కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావాలి
  • చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నాం
  • అసెంబ్లీలో టీడీపీ తీరును ఎండగట్టాం
  • 15వ తేదీలోపు ప్రత్యేక హోదాపై ప్రకటన రాకుంటే గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తాం
  • బీజేపీ సభ్యులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు
  • ఓటుకు కోట్లు కేసులో బయటపడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు
  • హోదా కోసం చంద్రబాబు గట్టిగా అడగలేకపోవటం వల్లే కేంద్రం తేలిగ్గా తీసుకుంటోంది
Share this article :

0 comments: