Home »
» ఎపిలో మరో కంపెనీ మూసివేత
ఎపిలో మరో కంపెనీ మూసివేత
|
ఎపిలో కొత్త ఉద్యోగాలు వస్తాయని నేతలు ప్రచారం చేస్తుంటే అక్కడ కొన్ని కంపెనీలు మూత పడడం ఆందోళన కలిగిస్తోంది.విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద ఉన్న జిందాల్ ఫెర్రో అల్లాయిస్ కంపెనీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.కొద్ది కాలం క్రితం విజయనగరం జిల్లాలోనే బొబ్బిలి వద్ద ఉన్న ఒక జ్యూట్ మిల్లును యాజమాన్యం మూసివేయగా,రోడ్డున పడ్డ కార్మికులు ఆందోళన చేశారు. అలాగే గుంటూరులో భజరంగ్ జ్యూట్ మిల్లును కూడా మూసివేయడం తో వేలాది మంది కార్మికులు వీధిపాలయ్యారు.కాగా కొత్తవలస జిందాల్ ఫ్యాక్టరీ అంతర్జాతీయ పరిణామాల రీత్యా మూత వేస్తున్నట్లు ప్రకటించింది.వీటిని ప్రభుత్వం గమనంలోకి తీసుకుని పునరుద్దరణకు అవకాశం ఉంటే చర్యలు చేపట్టాలి..
http://kommineni.info/articles/dailyarticles/content_20150913_13.php?p=1442127369382
|
|
0 comments:
Post a Comment