ప్రత్యేక హోదా కోసం మేం పోరాడితే అడ్వాంటేజ్ మీకే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదా కోసం మేం పోరాడితే అడ్వాంటేజ్ మీకే

ప్రత్యేక హోదా కోసం మేం పోరాడితే అడ్వాంటేజ్ మీకే

Written By news on Tuesday, September 1, 2015 | 9/01/2015

సభలో మిగిలిన అంశాలన్నింటినీ వెంటనే సస్పెండ్ చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించాలని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ రెండోరోజు సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రత్యేక హోదాపై చర్చ కోసం విపక్షం పట్టుబట్టడం, ప్రశ్నోత్తరాలను కొనసాగించేందుకే అధికార పక్షం మొగ్గు చూపడంతో.. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయనేమన్నారంటే..
  • ప్రత్యేక హోదా కోసం మేం పోరాడితే అడ్వాంటేజ్ మీకే
  • అయినా కూడా రాజకీయాలకు అతీతంగా మేం సహకరిస్తున్నాం
  • ముందువరుసలో ఉండిపోరాటం చేస్తున్నాం
  • నిన్న అసెంబ్లీ మొదలైంది. ప్రత్యేక హోదా మీద కేవలం అర్ధగంట చర్చ జరిగింది
  • 1.30కి చర్చ మొదలైంది, 2 గంటలకు మూసేశారు
  • చంద్రబాబు మాట్లాడిన మాటకు, ఇచ్చిన నోట్ కు సంబంధం లేదు
  • ఉన్నది ఐదు రోజులే, అందులో ఒక రోజు అయిపోయింది
  • ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్టు కాబట్టి, మిగిలినవన్నీ రద్దుచేసి, దీనిపై చర్చ మొదలుపెట్టండి
  • ముందు ఆయన ప్రకటన చేయమనండి. అది పూర్తయిన తర్వాత దానిపై చర్చ జరుపుదాం
  • ఇక్కడ ఆ విషయం మీద చర్చ జరగనివ్వకుండా చివరి అర్ధగంటకు పోస్ట్ చేస్తున్నారు.
  • అక్కడ కూడా అవాకులు, చవాకులు మాట్లాడుతూ చర్చకు అవకాశం లేకుండా చేస్తున్నారు
  • సభా సమయాన్ని ఐదు రోజుల నుంచి 15 రోజులకైనా పెంచండి, లేదా ప్రత్యేక హోదాపై చర్చను చేపట్టండి
  • మిగిలినవన్నీ సస్పెండ్ చేసి చర్చను వెంటనే చేపట్టండి
Share this article :

0 comments: