జగన్ దృష్టికి కార్మికుల సమస్యలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ దృష్టికి కార్మికుల సమస్యలు

జగన్ దృష్టికి కార్మికుల సమస్యలు

Written By news on Thursday, October 29, 2015 | 10/29/2015


జగన్ దృష్టికి కార్మికుల సమస్యలు
విజయవాడ :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి. గౌతంరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిసిన ట్రేడ్ యూనియన్‌కు సంబంధించి పలు విషయాలపై చర్చించారు.

ఆర్టీసీ ఇటీవల పెంచిన బస్ చార్జీల పెంపు వల్ల ఇబ్బందులు, వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. గౌతంరెడ్డి సాక్షితో మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్‌కు సంబంధించి పలు అంశాలపై జగన్‌తో చర్చించానని, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆయనతో చర్చించినట్లు వెల్లడించారు.
Share this article :

0 comments: