ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం .... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం ....

ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం ....

Written By news on Saturday, October 10, 2015 | 10/10/2015

గుంటూరు: 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టినపుడు నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నాని చెప్పాను. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నాడు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ దగ్గరకు వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలని, ప్రజలందరికీ మేలు జరగాలని నిరవధిక దీక్ష చేస్తున్నాడు. మీరు నా బిడ్డను ఆశీర్వదించండి' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలను కోరారు. శనివారం గుంటూరు జిల్లా నల్లపాడు రోడ్డులో దీక్ష శిబిరాన్ని సందర్శించి వైఎస్ జగన్ ను పరామర్శించారు. అనంతరం వేదికపై నుంచి వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. వైఎస్ విజయమ్మ ఇంకా ఏమన్నారంటే..
 
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు
  • ప్రత్యేక హోదా 10 ఏళ్లు కావాలని వెంకయ్యనాయుడు కోరారు
  • పార్లమెంట్ లో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండాపోయింది
  • కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు
  • ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి.. ఉద్యోగాలు వస్తాయి.. అందరికీ మేలు జరుగుతుంది
  • ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు
  • ఇప్పుడేమో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అంటున్నారు
  • వచ్చే ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఉంటుందో తెలియదు
  • దీనికి ఎవరు గ్యారెంటీ?
  • దివంగత నేత వైఎస్ఆర్ మరణం తర్వాత ప్రాజెక్టులను పూర్తి చేయలేదు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం గట్టిగా ఎందుకు పోరాడటం లేదు?
  • చంద్రబాబు పరిశ్రమలు తెస్తానంటూ విదేశాలు తిరుగుతున్నారు
  • విమానాశ్రయాలతో పేరుతో పేదల భూములు లాక్కొంటున్నారు
  • చంద్రబాబు ఎన్నికల హామీలను విస్మరించారు
Share this article :

0 comments: