'హంగామా, భూదందాకు వ్యతిరేకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'హంగామా, భూదందాకు వ్యతిరేకం

'హంగామా, భూదందాకు వ్యతిరేకం

Written By news on Monday, October 19, 2015 | 10/19/2015


'హంగామా, భూదందాకు వ్యతిరేకం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీని తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనవసరపు ఆడంబరాలు చేస్తున్నారని విమర్శించారు.  వైఎస్సార్ సీపీ నేతలు పార్థసారధి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
 
  • ఆహ్వానపత్రికలు పంపొద్దని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 8 అంశాలతో బహిరంగ లేఖ రాశారు
  • వీటిలో ఒక్కదానికి కూడా ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేదు
  • ప్రశ్నించిన మమ్మల్ని మంత్రులు నోటికి వచ్చినట్టు తిట్టారు
  • రాష్ట్రానికి రాజధాని అవసరం, దానికి మేము వ్యతిరేకం కాదు
  • శంకుస్థాపన పేరుతో చేస్తున్న దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నాం
  • మీరు చేస్తున్న హంగామా, భూదందాకు వ్యతిరేకం
  • రాష్ట్రాన్ని సింగపూర్ కు తాకట్టు పెడుతున్న కార్యక్రమానికి వచ్చి సాక్షి సంతకాలు పెట్టాలా?
  • ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనవసరపు ఆడంబరాలు చేస్తున్నారు
  • మాతో పాటు సీపీఎం, లోక్ సత్తా పార్టీలు కూడా ఇదే మాట చెబుతున్నాయి
  • ఇప్పుడే ప్రతిపక్ష పార్టీలు గుర్తుకు వచ్చాయా?
  • భూమి పూజ చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిని ఎందుకు పిలవలేదు
  • బలవంతపు భూసేకరణ వద్దని చెప్పినా పట్టించుకోలేదు
  • కేసీఆర్ తో చంద్రబాబు ఏం చర్చించారో చెప్పాలి
Share this article :

0 comments: