రాజమండ్రి : వీఆర్ ఏ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం రాజమండ్రిలోని ఎయిర్ పోర్ట్ కు వైఎస్ జగన్ విమానంలో చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద వైఎస్ జగన్ ను వీఆర్ ఏలు కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మీ సమస్యలను ప్రస్తావిస్తామని వీఆర్ఏలకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం విదితమే. దీంతో ఇరు జిల్లాల్లో దెబ్బతిన్న పొలాలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.
0 comments:
Post a Comment