పార్టీ ఎంపీలతో భేటీ కానున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ ఎంపీలతో భేటీ కానున్న వైఎస్ జగన్

పార్టీ ఎంపీలతో భేటీ కానున్న వైఎస్ జగన్

Written By news on Saturday, November 21, 2015 | 11/21/2015


పార్టీ ఎంపీలతో భేటీ కానున్న వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన లోటస్ పాండ్‌ లో పార్టీ ఎంపీలతో సమావేశం అవుతారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఎంపీలతో చర్చిస్తారు.
 
కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 26 నుంచి డిసెంబర్‌ 23 వరకు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ లో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ సమీక్ష జరుపుతారు. కాగా  ప్రత్యేక హోదాతో పాటు పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హమీలు, కరువు, అకాల వర్షాలు, కేంద్రసాయం, రాజధాని అంశంతో పాటు కీలక ప్రజాసమస్యలు పార్లమెంట్‌లో లేవనెత్తనున్నట్లు వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు తెలిపారు.
Share this article :

0 comments: