వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23వ తేదీ నుంచి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చిత్తూరు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో బాధితులను జగన్ పరామర్శిస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ తెలిపారు. 23వ తేదీ తొలి రోజునశ్రీకాళహస్తి నియోజకవర్గంలో, వైఎస్సార్ జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అదే రోజు సాయంత్రం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో కూడా పర్యటన ఉంటుందని, 24వ తేదీన కూడా నెల్లూరు జిల్లాలో జగన్ విసృ్తతంగా పర్యటిస్తారని వివ రించారు.
Home »
» వరద ప్రాంతాల్లో రేపటి నుంచి జగన్ పర్యటన
వరద ప్రాంతాల్లో రేపటి నుంచి జగన్ పర్యటన
Written By news on Sunday, November 22, 2015 | 11/22/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment