చంద్రబాబు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడే స్థితికి పవన్ కల్యాణ్ ఎందుకు దిగజారారని, పవన్ ప్రశ్నించే ధైర్యం ఎందుకు కోల్పోయారని, ఆయన వెళ్లిన ప్రత్యేక విమానం ఖర్చు ఎవరిదో బయటపెట్టాలన్నారు. టీడీపీ అనుబంధ సంస్థగా జనసేను మార్చబోతున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు 'రాష్ట్రానికి మోసగాడు' పుస్తకాన్ని పవన్కు పంపుతామని, ఆ పుస్తకాన్ని చదివైనా అవగాహన చేసుకుని చంద్రబాబును ప్రశ్నించాలని అంబటి రాంబాబు సూచించారు.
పవన్ కల్యాణ్తో మాట్లాడేందుకు గన్నవరం విమానాశ్రయానికి రైతులు వచ్చారని, అయితే పవన్ మాత్రం ఫ్లైట్ దిగి నేరుగా కారులో చంద్రబాబు దగ్గరకు వెళ్లిపోయారన్నారు. రైతుల గోడు వినడానికి కూడా పవన్ ప్రయత్నించలేదని అంబటి దుయ్యబట్టారు. భేటీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజధాని ప్రాంత రైతులకు పవన్ నిరాశే మిగిల్చారన్నారు. రైతుల సమస్యలను చంద్రబాబుకు పవన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
ఇక బాక్సైట్ తవ్వకాలపై పవన్ కల్యాణ్కు అవగాహన లేదని, బాక్సైట్ తవ్వకాలకు తెర తీసిందే చంద్రబాబు అని అంబటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కావాలని ఆరోపణలు చేస్తున్నారా? అవగాహన లేక చేస్తున్నారా? అని అంబటి ప్రశ్నించారు. ప్రశ్నించడానికే ఉన్నామన్న పవన్ కిందస్థాయికి దిగజారిపోయారని, జనసేన ఎందుకు మారిపోయిందో దాన్ని నమ్ముకున్న అభిమానులకు అర్థం కాని స్థితిలో ఉన్నారన్నారు.
0 comments:
Post a Comment