పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్

పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్

Written By news on Sunday, November 22, 2015 | 11/22/2015


పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఆదివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలతో చర్చిస్తున్నారు.

ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలు లేవనెత్తాలని పార్టీ భావిస్తోందని, ఈ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.  
Share this article :

0 comments: