పులివెందుల రైతు కాబట్టి పట్టించుకోవడం లేదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పులివెందుల రైతు కాబట్టి పట్టించుకోవడం లేదా?

పులివెందుల రైతు కాబట్టి పట్టించుకోవడం లేదా?

Written By news on Wednesday, November 4, 2015 | 11/04/2015


'పులివెందుల రైతు కాబట్టి పట్టించుకోవడం లేదా?'
కడప: పులివెందుల మండలం మోపట్నూతలపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు రాజశేఖర్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. రాజశేఖర్ చనిపోయి 18 రోజులైనా ఒక్క అధికారి కూడా వాళ్లింటికి రాలేదని వైఎస్ జగన్ విమర్శించారు. పులివెందుల రైతు కాబట్టి పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు.

పబ్లిసిటీ వస్తుందనుకుంటే ప్రభుత్వం ఎంత ఖర్చయినా చేస్తుందని, ఇలాంటి పేద రైతును మాత్రం పట్టించుకోదని వైఎస్ జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లాలో తాను 46 రైతు కుటుంబాలను పరామర్శిస్తే.. వాటిలో 20 కుటుంబాలకు సాయం అందలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిచేలా మీడియా కూడా రైతుల దీనగాథలను ఆవిష్కరించాలని వైఎస్ జగన్ అన్నారు.
Share this article :

0 comments: