పార్టీ బలోపేతంపై వైఎస్సార్‌సీపీ దృష్టి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ బలోపేతంపై వైఎస్సార్‌సీపీ దృష్టి

పార్టీ బలోపేతంపై వైఎస్సార్‌సీపీ దృష్టి

Written By news on Tuesday, December 1, 2015 | 12/01/2015


పార్టీ బలోపేతంపై వైఎస్సార్‌సీపీ దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై వైఎస్సార్‌సీపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీలను బలోపేతం చేసి పార్టీ విస్తరణ కార్యక్రమాలను చేపట్టనుంది. ఇప్పటికీ తెలంగాణలో దివంగత నేత వైఎస్సార్‌ని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజల్లో ఆదరాభిమానాలు, ప్రేమ ఉన్నాయని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు భరోసా కల్పించాలనే ఉద్దేశ ంతోనే వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేసిందన్నారు. వైఎస్సార్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు, జగన్‌పై అభిమానానికి ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేతకు ప్రజలు పలికిన నీరాజనాలే నిదర్శనమన్నారు.

గ్రామస్థాయిలో పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో వేయించగలిగేలా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాల్సి ఉందన్నారు. సోమవారమిక్కడ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొంగులేటి అధ్యక్షతన సమావేశం జరిగింది. వరంగల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై ఇందులో చర్చించారు. రాష్ర్టంలో పార్టీని మరింత పటిష్టం చేసి, విస్తరించేందుకు వరంగల్ ఎన్నికల్లో పోటీచేశామన్నారు. గెలుపోటములు సహజమని ఆయా పరిణామాలతో కుంగిపోవాల్సిన అవసరం లేదని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

 క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు
 వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని ఉపేక్షించే ప్రసక్తి ఉండదని పొంగులేటి స్పష్టంచేశారు. పార్టీ నియమావళికి కట్టుబడి, అందరూ క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. పార్టీపరంగా చేపట్టే ఏ కార్యక్రమం అయినా ఆషామాషీగా తీసుకోకుండా అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయాలని పార్టీ నాయకులకు సూచించా రు. స్థానిక సంస్థల కోటాలో శాసన మండ లికి జరగనున్న ఎన్నికల్లో వైస్సార్‌సీపీ పోటీ, అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. పార్టీ విధివిధానాలకు అనుగుణంగా నడుచుకోవాలని నాయకులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సం బంధించి పార్టీ అధినేత జగన్‌తో సుదీర్ఘంగా చర్చించానని, పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నాయకత్వం నిర్ణయం తీసుకుంటుం దన్నారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతమైతే ఏ ఎన్నికల్లోనైనా విజయం తథ్యమన్నారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా వాటిలో పాల్గొనాలని, పార్టీ ని మరింత బలోపేతం  చేసుకోవాలన్నారు.

 త్వరలో పార్టీలోకి దొమ్మాటి సాంబయ్య
 వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు దొమ్మాటి సాంబయ్య త్వరలోనే వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాష్, కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, సాయిచరణ్, మతీన్ ముజాహిద్, నిరంజన్‌రెడ్డి, ముజ్తాఫా, మట్టా దయానంద్, కొండారాఘవరెడ్డి, సురేష్‌రెడ్డి, రాజ్‌కుమార్‌గౌడ్, సింగిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: