ఆయనొచ్చాక విజయవాడలో పెరిగిన క్రైమ్ రేటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆయనొచ్చాక విజయవాడలో పెరిగిన క్రైమ్ రేటు

ఆయనొచ్చాక విజయవాడలో పెరిగిన క్రైమ్ రేటు

Written By news on Saturday, December 12, 2015 | 12/12/2015


'ఆయనొచ్చాక విజయవాడలో పెరిగిన క్రైమ్ రేటు'
హైదరాబాద్: తెలుగు తమ్ముళ్ల కాల్ మనీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో ఉన్నవారిని తప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన కాపాడతారనే నమ్మకంతోనే తెలుగు తమ్ముళ్లు పేట్రేగి పోతున్నారని ధ్వజమెత్తారు.

విజయవాడకు చంద్రబాబు మకాం మార్చిన తర్వాత నేరాలు పెరిగాయని తెలిపారు. విజయవాడను నేర రాజధానిగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.
Share this article :

0 comments: