అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్ సీపీ పాలాభిషేకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్ సీపీ పాలాభిషేకం

అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్ సీపీ పాలాభిషేకం

Written By news on Thursday, December 17, 2015 | 12/17/2015

టీడీపీ నేతలు అంబేద్కర్ ను, రాజ్యాంగాన్ని అవమానపరిచారని.. అందువల్ల శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఉప్పులేటి కల్పన పిలుపునిచ్చారు.

శుక్రవారం ఉదయం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయనున్నట్లు ఆమె తెలిపారు. అసెంబ్లీకి వెళ్లే ముందుగా.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు.. ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. అంబేద్కర్, రాజ్యాంగంపై చర్చకు అసెంబ్లీ సమావేశాలను మరో అయిదు రోజుల పాటు పొడిగించాలని ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: