రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉన్నా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉన్నా...

రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉన్నా...

Written By news on Wednesday, December 23, 2015 | 12/23/2015


రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉన్నా...
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు కేవలం 5 రోజుల పాటు జరిపి టీడీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మెహన్ రెడ్డి  విమర్శించారు. ప్రజాసమస్యలను చర్చించేందుకు కనీసం 15 రోజులు సమావేశాలు జరపాలన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని వాపోయారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై ప్రధానంగా తాము పట్టుబట్టామని తెలిపారు. అన్యాయంగా తమ ఎమ్మెల్యే ఆర్ కే రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.


'మేం ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం అసెంబ్లీలో జరిగిన తీరు, ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసిన తర్వాత ప్రతిపక్షం సభలో లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఆ రెండురోజులు సభను ఎలా నడిపారన్నదాన్ని గమనిస్తే...ప్రధానంగా పట్టుబట్టింది కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశం. విజయవాడలో ముఖ్యమంత్రి ఆశీస్సులతో సాక్షాత్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసులు భాగస్వామ్యులై వడ్డీలు కట్టకపోతే వ్యభిచారం చేయమని, గట్టిగా ఆడవాళ్ల, పేదవాళ్ల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడారు. దాదాపు వందల వీడియో టేపులు పట్టుబడ్డాయి.

అన్ని టీవీ చానల్స్, పేపర్లు కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై రకరకల కథనాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ప్రారంభం కావడం కూడా ఎంత అన్యాయం అంటే... అక్కడ పార్లమెంట్ 30 రోజులు జరుపుతున్నారు. ఇక్కడ చూస్తే అసెంబ్లీ జరిపేది కేవలం అయిదే అయిదు రోజులు. అది కూడా ఉదయం 9 గంటలకు అట...మధ్యాహ్నం 2 గంటలకే ఆపేసేయాలట. చేతులు దులుపుకునేందుకు చూస్తుంటే ...అయిదు రోజులు జరపడం ఏంటని బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులు చూస్తుంటే అసెంబ్లీ సమావేశాలుకు విలువ ఉందా అనిపిస్తోంది' వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
 
వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే....

* అసెంబ్లీలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ పై చర్చకు పట్టుబట్టాం
* ఏ ప్రజా సమస్య చర్చకు రాకుండా అసెంబ్లీ సాగింది
* కీచకుల సామ్రాజ్యంగా కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశం
* చంద్రబాబు ఆశీస్సులతో కాల్ మనీ ఆగడాలు
* ఈ కేసును సాదాసీదా చూపి, తీవ్రతను నీరుగార్చేందుకు కుట్ర

* అంబేడ్కర్ అంశం అజెండాలో లేదు
* అంబేడ్కర్ ను రాజకీయాల కోసం వాడుకున్నారు
* చంద్రబాబు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే రోజాను రూల్ 340 ప్రకారం సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ చెప్పారు
* కేవలం రోజాను మాత్రమే టార్గెట్ చేసి సంవత్సరం పాటు సస్పెన్షన్ వేటు వేశారు
* నిబంధనలకు విరుద్ధంగా రోజాను సస్పెండ్ చేశారు
* చర్చను దారి మళ్లించేందుకే రోజాపై సస్పెన్షన్
* ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదు

* ఆధారాలు లేవని చంద్రబాబు అన్నారు
* నిందితులతో ఉన్న ఫోటోలు ఆధారాలు కావా?
*  ఈ కేసులో నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ సోదరుడికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారు?
* చంద్రబాబు సభలో స్టేట్ మెంట్ ఇచ్చారు, చర్చిద్దామని మొత్తకున్నా మాది సభలో అరణ్య రోదనే
* కామ (కా అంటే కాల్, మ అంటే మనీ) సీఎం అని అందరూ అన్నారు. అయితే కేవలం రోజాను మాత్రమే సస్పెండ్ చేశారు

* ఇక చర్చ లేకుండానే సభలో బిల్లు పెట్టడం... ఆమోదించడం
* బిల్లులపై చర్చలు జరిగితే ప్రజా ఆమోదం తెలుస్తుంది
* ప్రతిపక్షం లేకుండానే 8 బిల్లులను ఆమోదించేశారు
* ప్రయివేట్ వర్సిటీల బిల్లును కూడా ఆమోదించారు
* ప్రయివేట్ వర్సిటీలు వస్తే ఫీజులు పెరుగుతాయి
* ఇష్టమొచ్చినట్లు బిల్లులు ఆమోదించారు

* రోజా సస్పెండ్ అయినా, వైఎస్ఆర్ సీపీ సభనుంచి బాయ్ కాట్ చేసినా, మా మీదే ఆరోపణలు
* సస్పెండ్ అయిన మూడో రోజుల తర్వాత కూడా రోజాపై విమర్శలు
* ప్రజలు సభను చూస్తున్నారనే ధ్యాస లేకుండా తిట్ల పురాణం
* టైమ్ పాస్ కోసం సభను నడిపారు
* చివరి రోజు రోజమ్మ ఎందుకు గుర్తొచ్చింది
* నిజంగా అసెంబ్లీ సమావేశాలు దారుణంగా జరిగాయి

* జీవో 97ను చంద్రబాబు ఎందుకు రద్దు చేయలేదు
* ఈ ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పగలరా?
* జీవో 97 ను రద్దు చేయకుండా బాక్సైట్ సరఫరా జీవోను రద్దు చేయడంలో ఆంతర్యం ఏమిటో?
*  2011లో గవర్నర్ కు ఇదే విషయంపై చంద్రబాబు లేఖ రాయలేదా?
* మరి ఇప్పుడు అదే జీవోను ఎందుకు రద్దు చేయడం లేదు
* గిరిజన చట్టాలను మార్చడానికి చంద్రబాబు ఏకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు
Share this article :

0 comments: