సింగపూర్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో లొసుగులు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం ఏవిధంగా దుర్వినియోగం అవుతుందో ప్రజలంతా తెలుసుకోవాలని కోరారు. సామాన్యుల నుంచి సేకరించిన వేలాది ఎకరాలను సింగపూర్ లోని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడం వాస్తవం కాదా అని ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు సర్కారుతో ఒప్పందాలు చేసుకున్న సింగపూర్ ప్రతినిధులు ఇప్పుడు రాజీనామా చేసి ప్రైవేటు కంపెనీలక సీఈవోలుగా వెళ్తున్నారని చెప్పారు. ధనదాహంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని చంద్రబాబుకు హితవు పలికారు.
నారా లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందేనని అన్నారు. చంద్రబాబు ఓఎస్డీ సీతేపల్లి అభీష్ట రాజీనామాతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రవర్తన మార్చుకోవాలని ముందు లోకేశ్ కు చెప్పాలని చంద్రబాబుకు సూచించారు. అవినీతికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని, నిజాయితీ గల పోలీసు అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
0 comments:
Post a Comment