
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో పలువురికి చోటు దక్కింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జె.మహేందర్రెడ్డి(వరంగల్), మెదక్ జిల్లా అధ్యక్షుడిగా జి.శ్రీధర్రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా డి.సాంబయ్య, ప్రధానకార్యదర్శిగా వి.రాజ్కుమార్గౌడ్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా బండారు వెంకట రమణ(రంగారెడ్డి), విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యద ర్శిగా డి.రాహుల్గౌడ్(రంగారెడ్డి జిల్లా), కార్యదర్శిగా బత్తుల సంతోష్ కుమార్(వరంగల్)లను వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నియమించారు. ఆ మేరకు సోమవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
0 comments:
Post a Comment