ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితి క్రమంగా కుదుట పడుతోందని, వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోజాను పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
- రోజమ్మ పరిస్థితి మీద డాక్టర్లతో విచారించాం
- ఇక్కడకు వచ్చినప్పుడు బీపీ 180/100గా ఉందని చెప్పారు
- హైబీపీతో ఉన్న రోజమ్మకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు
- ఆమె పరిస్థితి కుదుట పడుతోందని చెప్పారు
- ఇంతకుముందు కూడా తిరుపతి స్విమ్స్లో 9 రోజులు అడ్మిట్ అయ్యారు
- ఆ కేసు హిస్టరీ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు
- కానీ ఈవాళ ఒక మహిళా ఎమ్మెల్యే శాసనసభకు వస్తే వైఎస్ఆర్సీఎల్పీ కార్యాలయానికి వస్తే, ఆమె స్పీకర్ ఛాంబర్ వద్దకు వచ్చి ఒక నోట్ కూడా ఇవ్వగలిగే పరిస్థితి లేదు
- శాసన సభలోకి రాకూడదు గానీ, కనీసం నోట్ కూడా ఇవ్వనివ్వలేదు
- స్పీకర్కు ఇదే విషయాలు చెబుతూ రూల్ 340 ప్రకారం ఎమ్మెల్యేను ఏడాదిపాటు ఇష్టం వచ్చినట్లు సస్పెండ్ చేసే అధికారం లేదని చెప్పాము
- అసెంబ్లీ ఆ సమావేశాలు కొనసాగినంత కాలం మాత్రమే సస్పెండ్ చేయాలని ఉంది
- అదే రూల్స్ వినిపించినా, మాది అరణ్య రోదనే అయింది
- అధికారపక్షం ఏం చెబితే అదే చేస్తాం అన్నట్లు తయారైంది
- అధికారపక్షం రోజుకో కాంట్రవర్సీ తెచ్చి ప్రజాసమస్యల మీద చర్చ జరగకూడదన్నట్లు వ్యవహరిస్తోంది
- తొలుత అంబేద్కర్ను తీసుకొచ్చారు.
- ముందు మేం సెక్స్ రాకెట్ మీద వాయిదా తీర్మానం ఇస్తే.. పట్టించుకోలేదు
- ఎలాంటి సందర్భం లేకపోయినా రెండోసారి సభ వాయిదా పడిన తర్వాత అంబేద్కర్ అంశాన్ని తీసుకొచ్చారు.
- కావాలనే వివాదం సృష్టించారు..
- అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చనివాళ్లను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం మొదలుపెడితే శాసనసభమీద ప్రజలకున్న విశ్వాసం పోతుంది.
- అసెంబ్లీలో ఇప్పుడున్నది రెండే పార్టీలు
- బీజేపీవాళ్లు సగం టీడీపీ కండువాలు కప్పుకొన్నారు
- ప్రతిపక్షం అంటే ప్రజల గొంతు.. దీన్ని నొక్కేస్తున్నారు
- ఇలా చేస్తే ప్రజలు నష్టపోతారన్నది వీళ్లకు అర్థం కావట్లేదు
- దేవుడు, ప్రజలు మొట్టికాయలు వేస్తారు
- నా దగ్గర బలం ఉంటే స్పీకర్ మీద అవిశ్వాసం మూవ్ చేసేవాళ్లం
- మా ఖర్మ ఏమిటంటే.. మేం ఏదైనా అవిశ్వాసం మూవ్ చేసినా అది నిలబడదు కాబట్టి ఊరుకుంటున్నాం
- కచ్చితంగా దీనిమీద పోరాడతాం, రూలింగ్ మీద కోర్టుకు కూడా పోతాం
0 comments:
Post a Comment