
న్యూఢిల్లీ: విభజనతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్రం మాట నిలబెట్టుకోవాలని గతంలో కేంద్రం చేసిన వాగ్దానం గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి సోమవారం ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవులను కాపాడుకునేందుకే టీడీపీ నేతలు నోరు విప్పడం లేదని చెప్పారు. మోడ్రన్ కేటగిరి అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని చెప్పారు.
0 comments:
Post a Comment