రోజాకు వైఎస్ జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోజాకు వైఎస్ జగన్ పరామర్శ

రోజాకు వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Saturday, December 19, 2015 | 12/19/2015


రోజాకు వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రోజాను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. శనివారం పార్టీ ఎమ్మెల్యేలతో కలసి వైఎస్ జగన్ నిమ్స్ కు వెళ్లారు. రోజాను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ రోజు ఉదయం అసెంబ్లీకి వెళ్లిన రోజా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో రోజా కిందపడిపోయారు. గాయపడిన రోజా స్పృహ కోల్పోయారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రోజాను నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో రోజాకు వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. ఆమె శరీరంపై గోళ్ల గాట్లు పడ్డాయని, వాంతులు చేసుకున్నారని తెలుస్తోంది. హై బీపీతో ఉన్న రోజాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Share this article :

0 comments: