
ఈ రోజు ఉదయం అసెంబ్లీకి వెళ్లిన రోజా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో రోజా కిందపడిపోయారు. గాయపడిన రోజా స్పృహ కోల్పోయారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రోజాను నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో రోజాకు వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. ఆమె శరీరంపై గోళ్ల గాట్లు పడ్డాయని, వాంతులు చేసుకున్నారని తెలుస్తోంది. హై బీపీతో ఉన్న రోజాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
0 comments:
Post a Comment