11 January 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

లీటరు పెట్రోలు ధర రు 45లు, రు 50ల మధ్య....

Written By news on Saturday, January 17, 2015 | 1/17/2015


క్రూడ్ ఆయిల్‌కు అనుగుణంగా పెట్రోలు ధరలు తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్ :  అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. పార్టీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి తగ్గినా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ రేట్లను ఆ మేరకు తగ్గించడం లేదని తప్పు పట్టారు.

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడ్డం లేదని వారన్నారు. గత జూన్‌లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 115 డాలర్లుగా ఉంటే అది సగానికంటే తక్కువగా ప్రస్తుతం 47.5 డాలర్లకు పడిపోయిందనీ కానీ భారత దేశంలో ఆ మేరకు ధరలు తగ్గలేదని అన్నారు. ఒక బ్యారెల్ 115 డాలర్లుగా ఉన్నపుడు ఇక్కడ లీటరు పెట్రోలు ధర రు 80లుగా ఉండేదన్నారు. 47.5 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో ఒక లీటరు పెట్రోలు ధర రు 45లు, రు 50ల మధ్య ఉండాలనీ అయితే అదింకా రు67- 68 మధ్యే ఉందన్నారు.
 
 సార్క్ దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్‌లో కూడా భారత్ కంటే పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని వారు ప్రస్తావించారు. కేంద్రం మొక్కుబడిగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిందే తప్ప నిష్పత్తి ప్రకారం ధరలను తగ్గించలేదన్నారు.  కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై పన్నులు వేసి వాళ్ల ఆదాయాన్ని పెంచుకుంటోందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పన్నులు వసూలు చేస్తున్నారని వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు  డిమాండ్ చేసిన చంద్రబాబు ఇపుడు భారత్‌లో పెట్రోలు, డీజిల్‌పై ఎక్కువగా వసూలు చేస్తున్న పన్నులను తగ్గించాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎందుకు కోరడం లేదని వారు ప్రశ్నించారు. గతంలో ఇవే ధరలకు ముడిపెట్టి, ఆర్టీసీ, రైల్వే చార్జీలను అమాంతం పెంచేశారని, ఇపుడు తగ్గుతున్న ధరలను బట్టి వాటిని కూడా ఎందుకు తగ్గించడం లేదని వారు ప్రశ్నించారు. పెట్రో ధరల పేరు చెప్పి నిత్యావసర సరుకులు, ఎరువుల ధరలు కూడా ఆకాశానికి అంటాయని ఇపుడు వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా విఫలమయ్యాయని వారు దుయ్యబట్టారు

జనవరి 31, ఫిబ్రవరి 1 తణుకులో వై.ఎస్.జగన్ దీక్ష


చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం
టీడీపీ విధానాలకు నిరసనగా జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 8 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో ప్రభుత్వం దద్దమ్మలా వ్యవహరిస్తోందని, ఈ ప్రభుత్వ వ్యవహార శైలితో విసిగిపోయిన ప్రజలు ఎప్పడు పోతుందా అని ఎదురుచూస్తున్నారని విజయసాయిరెడ్డి ఘాటుగా విమర్శించారు

నేడు వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సమావేశం


నేడు వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సమావేశం
  • కృష్ణా,గుంటూరు జిల్లాల నేతలు హాజరు
  •  వేదిక విజయవాడలోని నాడార్‌‌స కల్యాణ మండపం
  •  విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి, ప్రసాదరాజు రాక
  •  జగన్ దీక్ష నేపథ్యంలో...
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుల సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది. పార్టీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, పార్టీ పార్లమెంట్ నియోజక    వర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలు హజరుకానున్నారు.   31వ తేదీ , ఫిబ్రవరి 1వ తేదీల్లో పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తలపెట్టిన దీక్షను విజయవంతం చేయడానికి త్రిసభ్య కమిటీ వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది.  

శనివారం ఉదయం 11 గంటలకు సత్యనారాయణపురంలోని నాడర్ కళ్యాణ మండపంలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు, త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రసాదరాజు  హజరు కానున్నారు.  ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరు సాగించడానికి పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేయడానికి ముందస్తుగా సమావేశం నిర్వహిస్తున్నారు.   ప్రభుత్వం రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హమీల తీరుపై ప్రసంగించనున్నారు.
 
విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం

సమావేశానికి  ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సమావేశం జరుగనుంది. సమావేశంలో పార్టీ త్రిసభ్య కమిటీ నేతలు, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పాల్గొంటారు. సమావేశంలో యూనియన్ నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక జరుగనుంది.

21 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 21వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర తొలివిడతలో భాగంగా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడు రోజుల పాటు పర్యటించి 30 కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.

తొలుత దేవరకొండ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే ఈ పరామర్శ యాత్ర... మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో సాగనుంది. రెండో విడతలో జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో షర్మిల పరామర్శ యాత్ర వాల్‌పోస్టర్‌ను పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను ఓదార్చుతానని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటకు కట్టుబడి ఈ యాత్ర సాగుతోందని చెప్పారు. నల్లగొండ జిల్లాలో షర్మిల తొలిసారిగా పర్యటిస్తున్నారని, దీనిని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎర్నేని బాబు, నల్లా సూర్యప్రకాష్, అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, సత్యం శ్రీరంగం, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త పి.సిద్ధార్థరెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముజ్తాఫా, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బి.రవీందర్, డాక్టర్స్ సెల్ అధ్యక్షురాలు డా.ప్రఫుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా.. పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన వైఎస్సార్ సీపీ డైరీ-2015ను, ఆండ్రాయిడ్ యాప్‌ను ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని, ఈ విషయంలో కార్యకర్తలు, వైఎస్ సానుభూతిపరులు, జగన్ అభిమానులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కాగా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ల (జేపీ) దర్గాను సందర్శించారు. చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తెలుగు రాష్ట్రాలు శాంతిసౌభాగ్యాలతో వర్థిల్లాలి: వైఎస్ జగన్

Written By news on Wednesday, January 14, 2015 | 1/14/2015


తెలుగు రాష్ట్రాలు శాంతిసౌభాగ్యాలతో వర్థిల్లాలి: వైఎస్ జగన్
హైదరాబాద్ : తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలన్నారు.
 
అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల పాడి పంటలకు నెలవు కావాలని వైఎస్ జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలని, ఇరు ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆయన కోరారు.

ప్రజల గుండెల్లో వైఎస్


ప్రజల గుండెల్లో వైఎస్
దేవరకొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రజలకున్న అభిమానం శాశ్వతమైనదని, అది ఎప్పటికీ చెరిగిపోనిదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన హయాంలో ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి.. నిరాటంకంగా సేవలందించిన మహానేత వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్ తనయుడు, తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పుయాత్రలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఆయన సోదరి షర్మిల పరామర్శ యాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

 ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే యాత్ర మొద ట నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందని స్పష్టంచేశారు. వైఎస్ మృతితో దిగ్భ్రాంతికి గురై జిల్లా వ్యాప్తంగా మృతి చెందిన 32 మందికి చెందిన బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నట్లు చెప్పారు. పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎం పీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆమె యాత్రలో పాల్గొంటారని తెలిపారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇరుగు సునీ ల్‌కుమార్, పార్టీ నాగార్జునసాగర్ ఇన్‌చార్జ్ మల్లు రవీం దర్‌రెడ్డి, దేవరకొండ నియోజకవర్గ నాయకులు బెదరకోట భాస్కర్, డిండి మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, సిరాజ్, రాయపరెడ్డి, యూసూఫ్, లోహిత్‌రెడ్డి, లక్ష్మీపతి, కాసర్ల వెంకట య్య, పుప్పాల పాండు, పచ్చిపాల వెంకటయ్య ఉన్నారు.

ఆ ఊరికి.. తొలిసారి ఓ ఎమ్మెల్యే!

Written By news on Tuesday, January 13, 2015 | 1/13/2015


ఆ ఊరికి.. తొలిసారి ఓ ఎమ్మెల్యే!
శ్రీకాకుళం: అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామాన్ని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి  ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధీ సందర్శించిన పాపాన పోలేదు. అలాంటి గ్రామానికి ఇన్నాళ్లకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెళ్లారు.
శ్రీకాకుళం జిల్లాలోని మిలియాకుట్టి మండలం నవరజెర్రు భద్ర గ్రామాన్ని వైఎస్సార్సీపీకి చెందిన పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే కలమల వెంకటరమణ సందర్శించారు. ఇప్పటివరకు తమ గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే అంటూ ఎవరూ లేకపోవడంతో తొలుత గ్రామస్థులు ఇది నిజమేనా అని అనుమానపడ్డారు. అనంతరం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

సమావేశాల్లోనే దాడులా


కరణం వర్గీయుల బరితెగింపు
* ప్రకాశం భవనం సాక్షిగా వెఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై దాడి
* నన్ను అంతం చేయాలని చూస్తున్నారు: గొట్టిపాటి రవి
* నిరసనగా భైఠాయింపు
* న్యాయం జరగకపోతే మళ్లీ ఆందోళన

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రకాశం భవనం సాక్షిగా జిల్లాలో ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయింది. తెలుగు దేశం పార్టీ అధికారం చేజిక్కించుకున్న అనంతరం దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. గత రెండు, మూడు నెలలుగా అధికార సమావేశాల్లోనే భౌతిక దాడులతో బరితెగించడం అధికార కండకావరాన్ని తెలియజేస్తోంది. పంచాయతీ సమావేశాల నుంచి మండల సమావేశాలు దాటి నేడు నేరుగా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశ ఆవరణల్లోనే బస్తీమే సవాల్ అంటూ వీధి రౌడీల్లా దాడులకు దిగడం ప్రజాస్వామ్యవాదులను  ఆందోళనకు గురిచేస్తోంది.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  గొట్టిపాటి రవికుమార్‌పై దాడికి తెలుగుతమ్ముళ్లు దిగారు.  మాజీ ఎంపీ కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ తమ అనుచరులతో ఈ దాడికి ఒడిగట్టారు. దీంతో కలెక్టరేట్ ఆవరణలో భయానక వాతావరణం ఏర్పడింది. గొట్టిపాటి రవికుమార్ కారును రాళ్లతో ధ్వంసం చేశారు. వారు స్వయంగా రెచ్చగొట్టడంతో అనుచరులు మరింత రెచ్చిపోయారు.

రవికుమార్‌తోపాటు సమావేశానికి వచ్చిన రైతులు, అనుచరులపై  కూడా దాడికి దిగారు. ఈ దాడిలో గొట్టిపాటి అనుచరుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్, గన్‌మెన్, పీఏ తదితరులను కూడా వదలకుండా పిడిగుద్దులకు దిగారు. ఎమ్మెల్యే రవికుమార్ చొక్కా పట్టుకొని లాగే ప్రయత్నం మరి కొందరు చేశారు. దీంతో ఆయన చొక్కా గుండీలు తెగిపోయాయి. వెంటనే గన్‌మెన్‌లు ఆయనను అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లారు.

ఈ దాడిని నిరసిస్తూ  దుండగులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట రవికుమార్ నిరసనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకుంది. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అడిషనల్ ఎస్పీ రామానాయక్, డీఎస్‌పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, పలువురు సీఐలు అక్కడికి చేరుకున్నారు. ఒంగోలు ఆర్డీవో శ్రీనివాసరావు కూడా చేరుకుని ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. మంగళవారం మధ్యాహ్నంలోగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో పది గంటల ప్రాంతంలో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. న్యాయం జరగకపోతే మంగళవారం సాయంత్రం ఇదే కలెక్టరేట్ ముందు మళ్లీ ఆందోళనకు దిగుతామని రవికుమార్ హెచ్చరించారు.

నన్ను అంతం చేయాలని చూస్తున్నారు
అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనను అంతం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గతంలో తన అన్న కిశోర్‌ను చంపారని, ఇప్పుడు మూడుసార్లు వరుసగా ఓడిపోతూ తమకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోవడంతో తనను చంపడానికి కత్తులు నూరుతున్నారని విమర్శించారు. వారికి ప్రజలు మరోసారి గుణపాఠం నేర్పుతారని అన్నారు.

అధికారిక సమావేశాలకు గూండాలు, రౌడీలు ఎలా వస్తారని, అధికారులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా సంయమనం పాటించామని, బయటకు వచ్చే సమయంలో దాడికి దిగారని, ఈ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని అన్నారు.

ఈ ధర్నాలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొట్టిపాటి భరత్, పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, వై. వెంకటేశ్వరరావు, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేపై దాడిని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఖండించారు.
 
గత మూడు నెలలుగా కవ్వింపు చర్యలు...
జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక నుంచి ఇప్పటి వరకూ మూడుసార్లు గొట్టిపాటి రవిపై దాడికి కరణం వర్గీయులు ప్రయత్నించారు. జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక  గొట్టిపాటి రవికుమార్  సమావేశంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌పై దాడి చేశారంటూ తప్పుడు ప్రచారం చేసి దాడికి ప్రయత్నించారు.

నాగార్జునసాగర్ కాల్వలపై జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్ వెళ్లినపుడు మార్టూరు వద్ద తెలుగుదేశం కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. తాజాగా సోమవారం కలెక్టరేట్ వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వాసితుల అంశంపై జరిగిన సమావేశం తర్వాత దాడికి తెగబడ్డారు.
 
హేయమైన చర్య
గొట్టిపాటికి భద్రత పెంచాలంటూ కలెక్టర్, అదనపు ఎస్పీలకు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫోన్
ఒంగోలు:  సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం ముందే ప్రజాప్రతినిధి మీద దాడి జరగడం తీవ్రమైన, హేయమైన చర్యగా  ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందువల్ల తక్షణమే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు భద్రత పెంచాలని పేర్కొంటూ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

భద్రత పెంపుపై తాము వెంటనే ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా అదనపు ఎస్పీతో కూడా ఒంగోలు ఎంపీ ఫోన్‌లో మాట్లాడారు. ప్రజా ప్రతినిధిపైనే దాడి జరిగితే ఇక సామాన్యుడికి రక్షణ ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.  మానవతా వాధులంతా ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.
 
ఓడినవారి అక్కసు ఇది: ముత్తుముల
గిద్దలూరు రూరల్:  గొట్టిపాటి రవికుమార్ పై దౌర్జన్యంకు పాల్పడి దాడికి దిగడం ప్రజాస్వామ్య విరుద్ధమంటూ  వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు స్ధానిక ఎమ్మేల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాల్సి సంఘటన అని అన్నారు. ఓటమి పాలైన టి.డి.పి. నాయకులు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారన్నారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం చూస్తు ఊరుకోవడం మంచి పద్దతి కాదన్నారు.
 
దాడి శోచనీయం... సమావేశాల్లోనే దాడులా  : ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి
మార్కాపురం :  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై సోమవారం రాత్రి ఒంగోలు కలెక్టరేట్ వద్ద బలరాం వర్గీయులు దాడి చేసిన సంఘటనపై మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఖండించారు. ఒంగోలు కలెక్టరేట్‌లో జరిగిన సమావేశానికి హాజరై బయటకు వచ్చిన ఎమ్మెల్యే రవికుమార్‌పై బలరాం వర్గీయులు దాడి చేయడం మంచిదికాదన్నారు. అభివృద్ధి విషయంలో ఒకరినొకరు సహకరించుకుని ప్రజలకు మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు.


రెండు నెలల కాలంలోనే మూడుసార్లు దాడికి...


వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటిపై దాడిప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న గొట్టిపాటి రవి, తదితరులు
రాళ్ల దాడిలో రవికుమార్ కారు పూర్తిగా ధ్వంసం
రవి అనుచరుడికి తీవ్రగాయాలు
కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు
పరామర్శించిన వైఎస్ జగన్


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కలెక్టరేట్ సాక్షిగా అద్దంకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్, వారి అనుచరులు దాడికి దిగారు. ఈ దాడిలో రవి అనుచరుడు ఒకరు తీవ్రంగా గాయపడగా, డ్రైవర్, గన్‌మెన్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కారును టీడీపీ వర్గీయులు పూర్తిగా ధ్వంసం చేశారు. వారి దౌర్జన్యాలను, దాడులను నిరసిస్తూ గొట్టిపాటి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. వివరాల్లోకి వెళ్తే..    

గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు సంబంధిత సమస్యపై ఇటీవలి జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నిలదీశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విజయకుమార్ నిర్వాసితుల అంశంపై చర్చించేందుకు కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. రవాణా శాఖా మంత్రి శిద్ధా రాఘవరావు అధ్యక్షత వహించారు. మాజీ ఎంపీ కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ కూడా తమ అనుచరులతో సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం పూర్తయి బయటకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటిని వెళ్లనీయకుండా కరణం వర్గీయులు అడ్డుగా నిలబడ్డారు.

గన్‌మెన్ వారిని తప్పుకోమని కోరగా అతనిపై దాడికి ప్రయత్నించారు. ఈలోగా అక్కడికి వచ్చిన కరణం బలరామ్, ఆయన కుమారుడు వెంకటేష్‌లు అనుచరులను రెచ్చగొట్టడంతో వారు రాళ్లతో దాడికి దిగారు. ఎమ్మెల్యే కారుకు తమ వాహనాలను అడ్డంపెట్టి దాన్ని ధ్వంసం చేశారు. డ్రైవర్, గన్‌మెన్, పీఏలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఎమ్మెల్యేపై దాడిని అక్కడున్న రైతులు అడ్డుకున్నారు. దాడి తర్వాత కరణం వర్గీయులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే గొట్టిపాటి కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. రవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించి, దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్‌లో రవిని పరామర్శించారు.

నన్ను చంపడమే లక్ష్యంగా దాడి...
తనను అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా తనపై దాడికి దిగారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రెండు నెలల కాలంలోనే తనపై మూడుసార్లు దాడికి ప్రయత్నించినట్లు తెలిపారు.గతంలో తన అన్న గొట్టిపాటి కిశోర్‌ను హత్య చేశారని, ఇప్పుడు వరుసగా మూడుసార్లు తాను గెలవడంతో తనను అంతం చేసేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని విర్రవీగుతున్నారని అన్నారు.  ఏఎస్‌పీ రామానాయక్, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. ‘మీరే దగ్గరుండి చంపిస్తారా..?’ అంటూ ఈ సందర్భంగా రవికుమార్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ పర్చూరు ఇన్‌చార్జి గొట్టిపాటి భరత్ సహా పలువురు నేతలు బైఠాయింపులో పాల్గొన్నారు.

కరణం బలరామ్, వెంకటేష్‌లపై కేసు నమోదు
గొట్టిపాటి రవికుమార్‌పై దాడికి పాల్పడిన మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లతో పాటు మరో 23 మందిపై ఒంగోలు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో గాయపడిన మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన మందపాటి సురేష్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 147, 324, 427, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

‘చంద్రన్న’ స్కాంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలి


‘చంద్రన్న’ స్కాంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలి
* కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్
సింగపూర్‌కు వందెకరాలివ్వడం దారుణం

సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిస్తున్న నిత్యావసర సరుకుల కొనుగోలులో జరిగిన కుంభకోణంపై విజిలెన్స్ శాఖతో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని కర్నూలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘చంద్రన్న కానుక’కు టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన రూ.280 కోట్లలో 60 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ధ్వజమెత్తారు.

ఈ పథకం కింద  ప్రజలకు సరఫరా చేస్తున్న మొత్తం ఆరు రకాల సరుకుల మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. కందిపప్పు, బెల్లం, నెయ్యి మార్కెట్ ధరలకు, టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలకు బాగా వ్యత్యాసం ఉందని చెప్పారు. సరుకులన్నీ పెట్టి ఇచ్చే గిఫ్ట్ సంచుల్లో కూడా భారీ కుంభకోణం జరిగిందన్నారు.

ఒక గిఫ్ట్ సంచి ధర మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.6 ఉంటే ప్రభుత్వం దాన్ని రూ.11.60 పైసలకు కొనుగోలు చేసిందని చెప్పారు. సంచుల కొనుగోలులో రూ.8 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందన్నారు. చౌక డిపోల నుంచి సరుకులు తెచ్చుకోవడానికి ప్రజలు సొంత సంచులను తీసుకెళుతుంటారని, అలాంటప్పుడు ప్రభుత్వం గిఫ్ట్ సంచులను ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ఓ మంత్రి అనుచరుడికి దోచి పెట్టడానికే ఈ సంచులను కొనుగోలు చేశారన్నారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఈ సంచుల కొనుగోలుకు ఎందుకు తగలేశారని ప్రశ్నించారు.

కందిపప్పులో రూ.12 కోట్లు, నెయ్యి కొనుగోలులో రూ.26 కోట్లు, సంచుల్లో రూ.8 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇవిగాక బెల్లాన్ని కూడా మార్కెట్ ధరకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని చెప్పారు. చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థకు, తెలుగు తమ్ముళ్లకు, ఎన్నికల్లో తనకు నిధులు సమకూర్చినవారికి ఆర్థికలబ్ధి చేకూర్చేందుకే ఈ పథకం ఉపయోగపడిందని పేర్కొన్నారు. దీన్ని ప్రజలకిచ్చిన చంద్రన్న కానుక అనాలా లేక చంద్రబాబు హెరిటేజ్‌కు, తెలుగు తమ్ముళ్లకు ఇచ్చిన పండుగ కానుక అనాలా.. అని ఎద్దేవా చేశారు.

చంద్రన్న కానుక వ్యవహారం చూస్తే పోకిరి సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందం బిచ్చగాడికి అర్ధరూపాయి వేసి పండుగ చేస్కో.. అన్నట్లుగా ఉందన్నారు. సంక్రాంతికి రైతుల ఇళ్లకు అల్లుళ్లు, కు మార్తెలు, బంధువులంతా వస్తారని, ఏ ఇంట్లో నూ పదిమందికి తక్కువుండరని.. వారు వంటలు వండుకోవడానికి ప్రభుత్వమిచ్చే కొద్దిపాటి సరుకులు ఏంసరిపోతాయని ప్రశ్నించారు. సింగపూర్ కంపెనీకి వందెకరాల భూమి ఇవ్వడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి ఉచిత సేవలందించడానికి సింగపూర్ కంపెనీలేమైనా మనకు బంధువులా అని తొలుత కూడా తాము ప్రశ్నించామని, ఈ వందెకరాలు ఇస్తుంటే అసలు విషయం బయటపడుతోందని ఆయన చెప్పారు.

ఎమ్మెల్యే గొట్టిపాటితో మాట్లాడిన వైఎస్ జగన్

Written By news on Monday, January 12, 2015 | 1/12/2015


ఎమ్మెల్యే గొట్టిపాటితో మాట్లాడిన వైఎస్ జగన్
ఒంగోలు: టీడీపీ నేత కరణం బలరాం వర్గీయుల దాడికి గురైన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాత్రి ఫోన్ లో మాట్లాడారు. దాడి జరిగిన తీరును ఎమ్మెల్యేను అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా ఢిల్లీ నుంచి రవికుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. టీడీపీ వర్గీయుల దాడిని ఖండించారు.

ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోనే ఎమ్మెల్యే రవికుమార్ పై కరణం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే కారు అద్దాలను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ రవికుమార్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.

ఎమ్మెల్యేపై కరణం బలరాం వర్గీయుల దాడి

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులో అద్దంకి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు గొట్టిపాటి రవికుమార్ పై టీడీపీ నేత కరణం బలరాం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే రవికుమార్ కు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. కలెక్టరేట్ ఆవరణలోనే బలరాం వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు.

దాంతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గురించిన సమీక్ష సమావేశంలో ఇరు వర్గాలు పాల్గొన్నాయి. సమీక్ష ముగిసిన అనంతరం బయటకు వస్తున్న ఎమ్మెల్యే రవికుమార్ పై కరణం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

సుధీర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ


వరంగల్ : వైఎస్ఆర్ సీపీ యువజ విభాగం నేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. గత నెల 23న సుధీర్ రెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు

పరామర్శ కోసం..


పరామర్శ కోసం..
నేడు జిల్లాకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ రాక
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లాకు రానున్నారు.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
 
* సుధీర్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
* వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి

వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లాకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. హన్మకొండలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ సిద్ధార్థరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో సోమవారం జగన్‌మోహన్‌రెడ్డి వరంగల్‌కు చేరుకుంటారని తెలిపారు. ఉద యం 11.30 గంటలకు జిల్లా ప్రవేశద్వారం పెంబర్తి వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతారని పేర్కొన్నారు. అక్కడి నుంచి హన్మకొండకు వచ్చి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు.

తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర నాయకులు కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వై. వెంకటరత్నం బాబు, నల్ల సూర్యప్రకాష్, హెచ్‌ఏ.రహ్మన్, ఎం.దయానందం, జి.నాగిరెడ్డి, మునిగాల విలియం, సుజాత మం గీలాల్, శివ వస్తారని వివరించారు.

జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు నాడెం శాంతికుమార్, అప్పం కిషన్, మునిగాల కల్యాణ్‌రాజ్, మహిపాల్‌రెడ్డి, శంకరాచారి, కాయిత రాజ్‌కుమార్, జలంధర్ పాల్గొన్నారు.

సింగపూర్ సంస్థతో మాస్టర్ ప్లాన్ ఒప్పందం వెనుక భారీ డీల్!


100 ఎకరాలు నజరానా!
  • సింగపూర్ సంస్థతో మాస్టర్ ప్లాన్ ఒప్పందం వెనుక భారీ డీల్
సాక్షి, హైదరాబాద్: రాజధాని మాస్టర్ ప్లాన్ వెనుక భారీ డీల్ ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చసాగుతోంది. సింగపూర్‌కు చెందిన కంపెనీ ఉచితంగానే మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇస్తోందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అసలు దీని వెనుక ఏముందా అనే అంశంపై ఆరా తీయగా కళ్లు చెదిరే విషయాలు బయటపడ్డాయి. రాజధాని నిర్మాణానికి సేకరిస్తున్న భూమిలో 2,000 ఎకరాల వరకు భూమిని రాజధాని నగరం కోసం ప్రభుత్వ అధీనంలోనే ఉంటుందని.. అయితే వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించే భూమి మొత్తాన్ని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి.

వాణిజ్య కార్యకలాపాలకు అనుగుణంగా ఆ భూమిని అభివృద్ధి చేసే బాధ్యతలను పూర్తి స్థాయిలో సింగపూర్ కంపెనీకి అప్పగించనున్నారు. అంతేకాకుండా వాణిజ్య భూమిలో ఏకంగా 100 ఎకరాలను సింగపూర్ కంపెనీకి మాస్టర్ ప్లాన్ తయారు చేసినందుకు నజరానాగా ఇవ్వనున్నట్లు తేలింది. ఇటీవల సింగపూర్ నుంచి రాష్ట్రానికి వచ్చిన కొంత మంది ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార యంత్రాంగానికి తెలియజేశారు. దీంతో అధికార యంత్రాంగం విస్తుపోయింది.

ఇప్పుడు రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఎకరం పది కోట్ల రూపాయల ఖరీదు పలుకుతోందని, వాణిజ్య అవసరాలకు తగినట్లు అభివృద్ధి చేస్తే ఎకరం 15 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అంటే 1,000 కోట్ల రూపాయల నుంచి 1,500 కోట్ల రూపాయల విలువగల 100 ఎకరాలను సింగపూర్ కంపెనీకి కేటాయించనున్నట్లు తేలింది. ఈ విధంగా కేటాయింపులు చేయడం ద్వారా కొంత మంది పెద్దలకు తెరవెనుక భారీ ఎత్తున ప్రయోజనాలు కలగనున్నట్లు అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మాస్టర్ ప్లాన్ సింగపూర్ కంపెనీ రూపొందించినందున ఆ భూమి అభివృద్ధిని కూడా ఆ కంపెనీయే చేపడితే వ్యత్యాసాలు లేకుండా ఉంటుందనే సాకుతో ఆ కంపెనీకి అప్పగించడానికి ప్రభుత్వం ఎత్తు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూ సమీకరణ కూడా అభివృద్ధి చేసే కంపెనీ చేపడుతుందని కూడా రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా కంపెనీలకు లెసైన్స్‌లను కూడా మంజూరు చేసే అవకాశాన్ని చట్టంలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో సింగపూర్ కంపెనీలకు భూ సమీకరణతో పాటు ఆ భూములను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే పనులను అప్పగించనున్నట్లు స్పష్టం అవుతోంది.
 

నేడు వరంగల్‌కు వైఎస్ జగన్


నేడు వరంగల్‌కు వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గత నెల 23న మరణించిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేత భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పరామర్శించనున్నారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి వరంగల్ జిల్లాలోని హన్మకొండకు జగన్ చేరుకుంటారు. సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతారని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధానకార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు.

మీకు చిన్న విషయమే కావచ్చు..

Written By news on Sunday, January 11, 2015 | 1/11/2015


‘రాజధాని’ రైతులను మోసగిస్తోంది: ఆళ్ల రామకృష్ణారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వంపై మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆగ్రహం 
సాక్షి, హైదరాబాద్, మంగళగిరి: రాజధాని ప్రాంత రైతుల స్థలాలు, భూములను మోసపూరితంగా కాజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. సహాయ, పునరావాస చట్టం - 2013 ప్రకారం ప్యాకేజీ పొందే హక్కు, అర్హత లేదని రైతుల నుంచి సంతకాలు తీసుకోవటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
రామకృష్ణారెడ్డి శనివారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధపడుతున్న కొద్ది మంది రైతులకు కూడా ఎలాంటి అవగాహన కలిగించకుండా పొలాలు సేకరిస్తున్నారని విమర్శించారు.  రాజధానికి భూములు కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని, రైతులకు కోర్టులకు వెళ్లే హక్కు కూడా లేదనే ప్రచారాన్ని ఖండించారు. న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు రైతులకుందని, త్వరలోనే తాము కోర్టుకు వెళ్లేందుకు సిద్దపడుతున్నా మన్నారు.
 
మీకు చిన్న విషయమే కావచ్చు..
రాజధాని గ్రామాల్లో పొలాలు దగ్ధమైన ఘటన చాలా చిన్నదని డీజీపీ రాముడు వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు.

న్యాయవిచారణ జరపాలి


న్యాయవిచారణ జరపాలి: వాసిరెడ్డి పద్మ
* రాజధాని వ్యవహారాలపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్
*  ‘మెకెన్సీ’ రూపొందించిన చట్టాలను ఆమోదించినందుకు బాబు సర్కారు సిగ్గుపడాలి

 
 సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాలపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. శనివారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని స్వరూపం, నిర్మాణం విషయాన్ని అంతర్జాతీయ ప్రైవేట్ కంపెనీ ‘మెకెన్సీ’ చేతిలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం దారుణమన్నారు.
 
 బ్రిటన్, ఆమెరికాతో ఆత్మీయంగా మెలిగే ‘మెకెన్సీ’ రూపొందించిన సీఆర్‌డీఏ ఏర్పాటు బిల్లును శాసనసభలో నెగ్గించుకోవటంపై చంద్రబాబు సర్కారు సిగ్గుపడాలన్నారు. నాసా, మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ సంస్థలు భారతీయ మేధావులను అగ్రస్థానాల్లో కూర్చోబెడుతుంటే రాజధాని నిర్మాణం అంశాన్ని చంద్రబాబు ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని తప్పుబట్టారు.  సింగపూర్ సంస్థలకు చెందిన వారిని రాజధాని గ్రామాల్లో  రహస్యంగా ఎందుకు  తిప్పుతున్నారని మండిపడ్డారు. టీడీపీకి బీజేపీ భయం పట్టుకుందన్నారు. అమిత్‌షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా చంద్రబాబును కనీసం కలవడానికి కూడా ఆసక్తి చూపలేదన్నారు.

రాజకీయాల్లో ఉన్నంత వరకూ జగనన్న వెంటే: వైఎస్సార్ సీపీ

ఎమ్మెల్యేలు కాకాణి, పాశం, రామిరెడ్డి, కిలివేటి
 పొదలకూరు/గూడూరు/కావలి: రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటామని, పార్టీని వీడే ప్రసక్తే లేదని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్పష్టంచేశారు. శనివారం పొదలకూరు మండల కార్యాలయ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే కాకాణి విలేకరులతో మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికల సమయం నుంచి కొందరు పనిగట్టుకుని తాను టీడీపీలో చేరతానని దుష్ర్పచారం సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

 ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వార్తలు రాసే ముందు సంబంధిత ఎమ్మెల్యేల వివరణ సేకరించాల్సిన బాధ్యత పత్రికలు, టీవీ ఛానళ్లపై ఉందన్నారు. ఆలాగే ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ గూడూరులో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల్లో విలువలు కోల్పోతున్న పార్టీలో తాను చేరుతున్నట్లు ఎల్లో మీడియా పత్రిక అసత్య కథనాన్ని ప్రచురించిందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను వైఎస్సార్‌సీపీని వీడేది లేదన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి మారే ప్రసక్తే లేదని, రాజకీయాల్లో ఉన్నంత కాలం పార్టీ అధినేత జగనన్న వెంటే ఉంటానని ఎమ్మెల్యే సంజీవయ్య తెలిపారు.

వడ్డీ కూడా మాఫీ కాలేదు!


* పార్టీ కర్నూలు జిల్లా సమీక్షా సమావేశంలో వైఎస్ జగన్
* అబద్ధం చెప్పకపోతే ప్రజలు రాళ్లతో కొడతారని బాబుకు తెలుసు
* అందుకే రోజుకో అబద్ధం చెబుతున్నారు
* రాష్ర్టంలో దిక్కుమాలిన, దుర్మార్గపు పాలన సాగుతోంది
* రుణమాఫీ చేస్తానన్నారు.. కనీసం వడ్డీ కూడా పూర్తిగా మాఫీ కాలేదు
* కొత్త రుణాలు లేవు... కరువొచ్చినా బీమా తీసుకోలేని పరిస్థితి
* ప్రజలు విసుగెత్తిపోయారు.. వారి సమస్యలపై పోరాడదాం

 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కళ్లార్పకుండా అబద్ధం చెప్పే ఏకైక వ్యక్తి చంద్రబాబేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అవ్వాతాతల పింఛన్లలో కోత విధిస్తూ, రోజుకొక అబద్ధం చెబుతూ పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ర్టంలో దిక్కుమాలిన, దుర్మార్గపు పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కర్నూలులో రెండురోజుల పాటు జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు శనివారంతో ముగిశాయి. శనివారం కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.
 
 ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా రోజుకో అబద్ధం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన మనస్సాక్షిని తనే ప్రశ్నించుకుంటే... ప్రతిరోజూ అబద్ధం చెబుతున్న విషయం అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. అబద్ధం చెప్పకపోతే ప్రజలు రాళ్లు తీసుకుని కొడతారనే విషయం బాబుకు తెలుసని, అందుకే రోజుకో అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలన మాకొద్దు బాబోయ్ అంటూ ప్రజలు విసుగెత్తిపోయారని, వారి సమస్యలపై పోరాటం చేద్దామని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
 
 వడ్డీ కూడా మాఫీ కాలేదు!
 చంద్రబాబు ఇచ్చిన హామీల్లో రుణమాఫీ ఒకటని, అయితే ఏ ఒక్క రైతుకీ కనీసం వడ్డీ కూడా పూర్తిగా మాఫీ కాలేదని జగన్ స్పష్టం చేశారు. పైగా చంద్రబాబును నమ్మి రుణాలు కట్టనందుకు రైతులు అపరాధ రుసుంతో కలిపి ఏకంగా 14 శాతం వడ్డీ కట్టాల్సి వచ్చిందని తెలిపారు. ‘ఈసారి ఖరీఫ్, రబీ సీజన్‌లో రైతులకు రూ.56 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ఇచ్చింది కేవలం రూ.13 వేల కోట్లే. అంటే మిగిలిన రూ.43 వేల కోట్ల మేర రుణాల కోసం రైతులు రూ.2 లేదా రూ.3 వడ్డీకి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు తీసుకోవాల్సి వచ్చిందన్నమాట.
 
  సకాలంలో రుణాలు చెల్లించి ఉంటే వడ్డీ లేని రుణాలు అందుకోవాల్సిన రైతులు కాస్తా ప్రైవేటు వ్యక్తులకు వడ్డీలు కట్టాల్సి వచ్చింది. రుణాలు మాఫీ చేసేందుకు రూ.87 వేల కోట్లు కావాలి. మరోవైపు వీటి మీద వడ్డీ భారం రూ.12 వేల కోట్లు అవుతుంది. కానీ రుణమాఫీ కోసం చంద్రబాబు కేటాయించింది కేవలం రూ.4,600 కోట్లు మాత్రమే. అంటే ఆయన కేటాయించిన మొత్తం సగం వడ్డీకి కూడా సరిపోదని అర్థమవుతోంది. రుణం మాఫీ కాకపోవడంతో కొత్త రుణాలు రాలేదు. కొత్త రుణాలు తీసుకోనందుకు పంటల బీమాను కూడా కోల్పోయే దుస్థితి ఏర్పడింది. కరువు వచ్చినా బీమాను తీసుకోలేని పరిస్థితి ఉంది’ అని జగన్ వివరించారు. ‘రుణమాఫీ అంటే చంద్రబాబు అర్థం ఏమిటంటే.. రాష్ర్టంలో మొత్తం 1.05 కోట్ల రైతుల బ్యాంకు ఖాతాలు ఉంటే 20 లక్షల ఖాతాలకు తగ్గించడం.
 
 రూ.87 వేల కోట్ల రుణాలు ఉంటే కేవలం రూ.4,600 కోట్లు కేటాయించడం..’ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాదిరిగా రూ.87 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తామనే అబద్ధపు వాగ్దానాలు, హామీలు ఇవ్వనందుకే పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గాలి కూడా చంద్రబాబుకు కాస్తో కూస్తో కలిసి వచ్చిందని అభిప్రాయపడ్డారు.
 
బాబు సీఎం అయినా బంగారం రాలేదు
 ఎన్నికల ముందు రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకులోని బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు సీఎం కావాలంటూ ఊదరగొట్టారని.. తీరా చంద్రబాబు సీఎం అయితే అయ్యాడు కానీ.. బ్యాంకుల్లోని బంగారం వేలానికి పెడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన భార్య మెడలోని నగలు మాత్రం అట్లానే భద్రంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. చివరకు అవ్వాతాతల పింఛన్లకు కూడా కోత పెడుతున్నారన్నారు. ఇందుకోసం సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ మంత్రులు చూపిన వ్యక్తులను నియమిస్తున్నారని మండిపడ్డారు. వీరి పనేమిటయ్యా అంటే... అవ్వాతాతల పింఛన్లను తగ్గించడమేనన్నారు.
 
 ఇంత దుర్మార్గపు, దిక్కుమాలిన పాలన రాష్ర్టంలో సాగుతోందని జగన్ విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, సీజీసీ సభ్యుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరిత, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ, గుమ్మనూరు జయరాం, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, సీఈసీ సభ్యులు కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, హఫీజ్ ఖాన్, సీనియర్ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Popular Posts

Topics :