18 January 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

నాలుగోరోజు ఐదు కుటుంబాలకు పరామర్శ

Written By news on Saturday, January 24, 2015 | 1/24/2015


రైతును రాజును చేసిన ఘనత వైఎస్  దే: వైఎస్ షర్మిల
నల్లగొండ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదవాడిని తన భుజాన మోసి, రైతును రాజును చేశాడు కాబట్టే ఆయన కోట్లాది మంది తెలుగు గుండెల్లో రాజన్నగా కొలువుదీరాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదర షర్మిల అన్నారు. నల్లగొండ జిల్లాలో నాలుగోరోజు శనివారం పరామర్శయాత్రలో భాగంగా షర్మిల హుజూర్‌నగర్ నియోజక వర్గంలో  పర్యటించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓ నాయకుడి గురించి వందలాది గుండెలు ఆగిపోయిన చరిత్ర ఎప్పుడూ లేదని, అది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి విషయంలోనే జరిగిందని అన్నారు.
రైతులు, రైతు కూలీలకు అండగా నిలబడ్డ వైఎస్ వారి కోసం ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారని చెప్పారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుని లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని, లక్షలాది మంది పేదలు తలెత్తుకుని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నారని, కుయ్...కుయ్...కుయ్ అంటూ వచ్చిన 108 వాహనం లక్షలాది మందికి ప్రాణం పోసిందని చెప్పారు.

ఏ పన్ను, చార్జీలు పెంచకుండానే అన్ని పథకాలను అద్భుతంగా అమలుచేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ నిలిచిపోయారని ఆమె అన్నారు. వైఎస్ ఆశయాలను మనమే ముందుకు తీసుకెళ్లాలని, ఆయన పథకాలను మనమే కొనసాగించుకోవాలని, అందుకే రాజన్న రాజ్యం కోసం అందరం చేయి చేయి కలపాలని షర్మిల ప్రజలను కోరారు. షర్మిల వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి తదితరులున్నారు.

నాలుగోరోజు ఐదు కుటుంబాలకు పరామర్శ

పరామర్శయాత్రలో భాగంగా షర్మిల నాలుగోరోజు ఐదు కుటుంబాలను పరామర్శించారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను కలుసుకున్నారు. అందరినీ పలకరించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్లలో తురక లింగయ్య కుటుంబాన్ని, ఆ తర్వాత గరిడేపల్లి మండలం కాల్వపల్లిలో వెంకటగిరి జయమ్మ, హుజూర్‌నగర్ పట్టణంలోని సుందరయ్య నగర్‌లో లింగంపాండు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం భోజన విరామం తర్వాత మేళ్లచెర్వు మండల కేంద్రంలోని చల్లాపూర్ణయ్య కుటుంబం వద్దకు వెళ్లారు. అక్కడ పూర్ణయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి అదే మండలంలోని కందిబండ గ్రామంలో పేరుపంగు లింగయ్య కుటుంబాన్ని పరామర్శించడంతో నాలుగోరోజు యాత్ర ముగిసింది.

వైఎస్ విగ్రహావిష్కరణ

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం బస్టాండ్ సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల గ్రామస్తులనుద్దేశించి మాట్లాడుతూ..ఇన్నేళ్లయినా నాన్నను గుర్తుపెట్టుకుని విగ్రహాన్ని ఏర్పాటుచేసిన ప్రజలకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.

రేపు రేణిగుంటకు వైఎస్ జగన్


రేపు రేణిగుంటకు  వైఎస్ జగన్
చిత్తూరు :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రేణిగుంటకు రానున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బబ్బల రాజారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరుకావడానికి జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట మీదుగా వెళ్లనున్నారు.

ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సూళ్లూరుపేటకు వెళతారని పార్టీ జిల్లా నాయకులకు సమాచారం అందింది.

అడుగడుగునా వైఎస్ జగన్ సోదరికి ఆత్మీయ ఆదరణ


మీ ప్రేమను ఎన్నటికీ మర్చిపోలేం..సల్కునూరులో ఇద్దమ్మ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న షర్మిల
 షర్మిల పరామర్శయాత్రలో వెల్లువెత్తిన అభిమానం
 వైఎస్ కుటుంబంపై ప్రేమను చాటుకుంటున్న మృతుల కుటుంబాలు
 తమ ఇంటికి స్వయంగా వచ్చి పరామర్శించడంతో ఉద్వేగం
 వారి ఆవేదన విని షర్మిల కంటతడి
 అడుగడుగునా వైఎస్ జగన్ సోదరికి ఆత్మీయ ఆదరణ
 నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పరామర్శ యాత్ర

 
 ‘ఇన్నాళ్ల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని వచ్చావా తల్లీ.. మా గుండెల్లో మీ నాన్న (వైఎస్) ఉన్నాడు. మీరు మా కుటుంబంపై చూపిస్తున్న ప్రేమను మేమెన్నటికీ  మర్చిపోలేం..’.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శయాత్రలో అడుగడుగునా వెల్లువెత్తుతున్న అభిమానమిది. తమ బాధలు పంచుకుని, కష్టాల్లో ఓదార్చడానికి వచ్చిన షర్మిలను చూసిన ఉద్వేగమిది.
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు నల్లగొండ జిల్లాలో షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర మూడోరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగింది. ఈ నియోజకవర్గ పరిధిలో నాలుగు కుటుంబాలను ఆమె శుక్రవారం పరామర్శిం చారు. కుటుంబంలో ఒక్కొక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ.. కష్టసుఖాలను తెలుసుకున్నారు. షర్మిల తమ ఇంటికి రావడంతో వారంతా ఉద్వేగానికి లోనయ్యారు. షర్మిల ఒక్కో కుటుంబంతో అరగంటకు పైగా గడిపి, వారి బాగోగులను, సమస్యలను తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల ఆవేదనను విని చలించి కంటతడి పెట్టారు. వారందరికీ తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
 
 మూడో రోజు నాలుగు కుటుంబాలు
 
 మూడో రోజు యాత్రలో తొలుత నందిపాడు క్యాంపులోని పేరం దుర్గమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అక్కడ దుర్గమ్మ కోడలు జ్యోతి షర్మిలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. దుర్గమ్మ కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న షర్మిల.. వారికి ధైర్యాన్ని చెప్పి వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామానికి వెళ్లారు. అక్కడ రేఖ ఇద్దమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. సల్కునూరులో స్థానికులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం షర్మిల శెట్టిపాలెం గ్రామంలో భోజనం చేసి.. అక్కడే ఉన్న వైఎస్ విగ్రహానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి మిర్యాలగూడ వెళ్లి సీతారాంపురంలో అక్కిమళ్ల సుందర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. సుందర్ భార్య కృష్ణవేణి కన్నీటి మధ్య తన కుటుంబ స్థితిగతులను షర్మిలకు వివరించారు. ఆమె ఆవేదనను చూసిన షర్మిల కూడా చలించిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చేరుకుని కొప్పోజు సావిత్రమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఇక్కడ ఆమెకు జనం పెద్దఎత్తున స్వాగతం పలికారు. సావిత్రమ్మ కుటుంబానికి ధైర్యం చెప్పిన షర్మిల మూడోరోజు యాత్రను ముగించారు. షర్మిల వెంట వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా అహ్మద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, రాష్ట్ర నాయకులు షర్మిలా సంపత్, గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్ కుమార్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఎండీ సలీం, మల్లు రవీందర్‌రెడ్డి, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి తదితరులున్నారు.
 
 ఒడిలో చేరిన చిన్నారులు..
 
 నందిపాడు క్యాంపులో పేరం దుర్గమ్మ కుటుంబాన్ని సందర్శించినపుడు దుర్గమ్మ మనువరాళ్లు, మనవడిని కాసేపు షర్మిల ప్రేమతో లాలించారు. వారిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడుతూ ముచ్చట్లు చెప్పించారు. దుర్గమ్మ మనుమరాలు లక్ష్మీ దుర్గాభవాని అయితే షర్మిల చేతిలో చేతులేసి ఊగుతూ చిటిపొట్టి పలుకులతో ముచ్చటించింది. ఆ తర్వాత ఇంట్లో తయారుచేసిన పాయసాన్ని షర్మిలకు తినిపించాలని తీసుకువచ్చింది. వెంటనే షర్మిల ఆ చిన్నారికి తొలుత పాయసం తినిపించి, ఆ తర్వాత తాను కూడా తిన్నారు. దుర్గమ్మ మనవడు విశ్వనాథ్ అయితే ఎగిరి గంతేసి షర్మిల ఒడిలోకి వచ్చాడు. ఒడిలో కూర్చునే మా అమ్మమ్మ చనిపోయిందంటూ ఏడ్చాడు.
 
 ఇన్నాళ్లూ పలకరించిన వాళ్లే లేరమ్మా..
 
 మిర్యాలగూడలోని సీతారాంపురం లో అక్కిమళ్ల సుందర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించినప్పుడు సుందర్ భార్య కృష్ణవేణి కన్నీటి పర్యంతమయ్యారు. భర్త మరణించిన తర్వాత కనీసం తనను పలకరించేవారు లేరని, ఇన్నాళ్లకు కూడా గుర్తుపెట్టుకుని తన వద్దకు వచ్చినందుకు సంతోషంగా ఉందని షర్మిలతో చెప్పారు. తన ఇల్లు, కుమార్తె ఆరోగ్య పరిస్థితి, తన కష్టాల గురించి చెప్పుకొంటూ కన్నీటి పర్యంతమైన కృష్ణవేణిని, ఆమె కుమార్తె పద్మ ఆవేదనను చూసి చలించిపోయిన షర్మిల కూడా కంటతడి పెట్టారు

ఖజానాలో డబ్బుల్లేవంటూ పథకం ప్రకారం చంద్రబాబు ప్రచారం


ఈ పేద గీతం.. పెను మోసం!వీడియోకి క్లిక్ చేయండి
 ఖజానాలో డబ్బుల్లేవంటూ పథకం ప్రకారం చంద్రబాబు ప్రచారం
 ఉద్యోగుల పీఆర్సీలో కోతలు, ప్రజలపై పన్ను వాతలకు వ్యూహం

     
 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు పదో వేతన కమిషన్(పీఆర్‌సీ) చేసిన సిఫారసుల్లో కోతలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల కుదింపు, రుణ మాఫీ లబ్ధిదారులను భారీగా తగ్గించే దిశగా రాష్ర్ట ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అలాగే ప్రజలపై పన్నులు, చార్జీల భారం వేసేందుకూ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిరోజులుగా ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఖజానాలో డబ్బుల్లేవంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. నిజంగా ఖజానా ఖాళీ అయిందా అన్న విషయాన్ని లోతుగా పరిశీలిస్తే అలాంటి పరిస్థితేమీ లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టి ప్రజలపై పన్నుల భారం మోపడమే ఈ ప్రచారం వెనుకనున్న అసలు వ్యూహమని తెలుస్తోంది. నిజానికి ఈ నెల 7న విజయవాడలో జీరో స్థాయి బడ్జెట్ సమావేశం నిర్వహించే వరకు ఖజానాకు నిధులు బాగానే వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర సొంత పన్నులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు అన్నీ కలిపి ఆదాయం బాగానే సమకూరుతున్నట్లు చెప్పుకొచ్చాయి. తీరా ఉద్యోగుల పీఆర్సీపై చర్చల సమయానికి హఠాత్తుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైనట్లు స్వయంగా ముఖ్యమంత్రే పేర్కొనడం గమనార్హం. జీతాలకు కూడా డబ్బుల్లేవని ఆయన ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉద్యోగవర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
 
 గతంలోనూ ఇదే తీరు!: చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ డీఏను సకాలంలో ఇవ్వలేదని, పెన్షనర్లకూ ఎగనామం పెట్టారని ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన హయాంలో శ్వేతపత్రాలు ప్రకటించిన తర్వాత జీతాలకు డబ్బుల్లేవంటూ ప్రజలపై విపరీతంగా పన్నుల భారాన్ని మోపారని, ప్రతీ ఏటా క్రమం తప్పకుండా విద్యుత్ చార్జీలు పెంచారని, ఇప్పుడు కూడా సరిగ్గా అదే బాటలో చంద్రబాబు పయనిస్తున్నట్లు స్పష్టమవుతోందని ఉద్యోగవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 29 శాతమే పీఆర్సీ ఉంటుందంటూ ప్రభుత్వ గెజిట్ పత్రిక రాసిందని, అది కూడా ప్రభుత్వ ఎత్తుగడలో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు. పీఆర్సీ పెద్దగా రాదంటూ ఉద్యోగులను మానసికంగా సిద్ధం చేయడంలో భాగంగానే అలా రాసినట్లు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క పన్నుల భారం మోపడానికి ప్రజలను కూడా మానసికంగా తయారు చేయడంలో భాగంగానే ప్రభుత్వం బీద అరుపులు అరుస్తోందని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కూడా భారీగా కోతలు పెట్టేందుకే ఇలాంటి ప్రచారం చేస్తోందని విద్యార్ధివర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక పక్క ముఖ్యమంత్రి, మంత్రులు తమ విలాసాలకు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ.. మరోపక్క డబ్బుల్లేవంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో విద్యుత్ చార్జీలను పెంచే ముందు.. విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయంటూ ప్రచారం చేసేవారని, ఇప్పుడు కూడా చంద్రబాబు అదే బాటలో నడుస్తున్నారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. బడ్జెట్‌లో పేర్కొన్న మేరకే కేంద్ర నిధులు, గ్రాంట్లు వస్తున్నాయని, రాష్ట్ర ఆదాయం కూడా బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు. జీతాలకూ డబ్బుల్లేవని ముఖ్యమంత్రి ప్రకటించిన మరుసటి రోజే ప్రభుత్వం కావాలనే రూ. 470 కోట్ల మేర నిధుల సేకరణ(వేస్ అండ్ మీన్స్)కు వెళ్లిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతకుముందే మార్చిలోగా రూ. 3 వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.
 
 బడ్జెట్‌లోనూ కాకి లెక్కలు..!
 
 రాష్ర్ట విభజన నేపథ్యంలో కేంద్రం నుంచి అదనంగా రూ. 14,500 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఈ నిధులు కచ్చితంగా వస్తాయన్న నమ్మకం లేదు. మిగతా కేంద్ర నిధులన్నీ సక్రమంగానే వస్తున్నాయి. పైగా ప్రణాళికేతర వ్యయాన్ని రాష్ర్ట ప్రభుత్వం భారీగా చూపెట్టింది. ఇది కూడా వాస్తవ దూరంగా ఉంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ర్ట ప్రణాళికేతర వ్యయాన్ని బడ్జెట్‌లో రూ. 94,380 కోట్లుగా పేర్కొనగా ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏకంగా రూ. 85,151 కోట్లను కేటాయించింది. దీంతో బడ్జెట్ లెక్కలకు వాస్తవికతకు పొంతన లేదని అవగతమవుతోంది.


 
 - అటవీ, గనులు, పబ్లిక్ సర్వీసు కమిషన్, పోలీసు చలానాలు, వడ్డీలు తదితర రంగాల ద్వారా పన్నేతర ఆదాయం వస్తుంది.
 - కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను, సంపద పన్ను, కస్టమ్స్ పన్ను, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్‌లో కేంద్రం నుంచి వాటా వస్తుంది.
 - కేంద్ర ప్రయోజిత పథకాలు, 13వ ఆర్థిక  సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రాంట్లు వస్తాయి.
 

వర్ల రామయ్యకు మతి భ్రమించింది: కల్పన

Written By news on Friday, January 23, 2015 | 1/23/2015


వర్ల రామయ్యకు మతి భ్రమించింది: కల్పన
విజయవాడ : నామినేటెడ్ పదవి రాలేదనే నిరాశతో టీడీపీ నేత వర్ల రామయ్యకు మతి భ్రమించిందని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. ప్రచారంలో తన భర్త పాల్గొనలేదని, తన కుటుంబంపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలు ఛీత్కరించినా వేదికలు ఎక్కి మాట్లాడటం వర్ల రామయ్యకు సరికాదని ఆమె విమర్శించారు. పోలీసు ఉద్యోగం నుంచి ఆయన ఎందుకు వీఆర్ఎస్ తీసుకున్నారో సమాధానం చెప్పాలని కల్పన డిమాండ్ చేశారు.

తన అవినీతిని కప్పిపుచ్చుకోడానికే ఆయనిలా చేయలేదా అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను కబ్జా చేసి లక్షల రూపాయలు దండుకున్న ఘనత రామయ్యదని ఆమె అన్నారు. దళిత ఎమ్మెల్యేనైన తనను ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి వేధిస్తున్నారని వాపోయారు. వర్ల రామయ్యపై తాను మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని, ఆయన అవినీతి బాగోతంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని హెచ్చరించారు.

రెండోరోజు.. మూడు కుటుంబాలు


హృదయం ద్రవించిన వేళ..
‘పరామర్శ యాత్ర’లో కుటుంబాల ఆవేదన చూసి షర్మిల కంటతడి తమ తండ్రిని, వైఎస్సార్‌ను గుర్తుచేసుకుంటూ రోదించిన వెంకట నర్సయ్య కుమార్తెలు ఉద్వేగాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమైన షర్మిల కుటుంబానికి అండగా ఉంటామన్న వైఎస్ జగన్ సోదరి త్రిపురారంలో మైల రాములు కుటుంబానికి భరోసా ఆయన భార్య హ–ద్రోగానికి చికిత్స చేయిస్తామని హామీ నల్లగొండ జిల్లాలో రెండో రోజు మూడు కుటుంబాలకు పరామర్శ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.. ప్రజలకు పెద్ద దిక్కయిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆ ఇంటిపెద్ద ప్రాణాలు విడిచారు.. అటు ప్రాణప్రదమైన కుటుంబ సభ్యుడిని కోల్పోయి, ఇటు వైఎస్సార్ లాంటి ప్రజా నాయకుడిని కోల్పోయిన బాధతో ఆ ఇల్లు తల్లడిల్లింది.. ఐదేళ్ల తర్వాత మహానేత కుమార్తె షర్మిలను చూడగానే ఆ ఆవేదన అంతా మళ్లీ పెల్లుబికింది.

నాడు మరణించిన వైఎస్సార్‌ను, ఆ బాధతో ప్రాణాలు విడిచిన తమ తండ్రిని గుర్తుచేసుకుంటూ... ఆయన ఐదుగురు కుమార్తెలు గుండెలవిసేలా రోదించారు. ‘మమ్మల్ని గుర్తుపెట్టుకుని వచ్చావా తల్లీ.. మాకిది చాలు’ అంటూ తమ ప్రేమను పంచారు. తమ కష్టాలు చెప్పుకొన్నారు. ఈ ఆవేదనను పంచుకున్న షర్మిల కూడా కన్నీటి పర్యంతమయ్యారు. వారికి తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.. గురువారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని హిల్ కాలనీలో కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల పరామర్శించిన సందర్భంగా కనిపించిన దృశ్యమిది... నల్లగొండ జిల్లాలో షర్మిల రెండో రోజు పరామర్శ యాత్ర గురువారం నాగార్జునసాగర్ నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక తాను పనిచేస్తున్న కార్యాలయం భవనంపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన కామిశెట్టి వెంకట నర్సయ్య కుటుంబాన్ని తొలుత షర్మిల పరామర్శించారు. నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీలో ఉన్న వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో అరగంటకుపైగా మాట్లాడారు.

షర్మిలతో మాట్లాడుతున్న సమయంలో వెంకట నర్సయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ‘‘మా నాన్న మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయాడు. ఇంటి పెద్దదిక్కును కొల్పోయాం అక్కా. మేం ఐదుగురం ఆడపిల్ల లం. ఆయనకు ఉన్న దాంట్లోనే మమ్మల్ని చది వించాడు. వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజలకు చాలా మేలు చేశాడని ఎప్పుడూ అంటుండేవాడు. వైఎస్ మీద మా నాన్నకు ఉన్న అభిమానం ముందు మేమెవ్వరమూ గుర్తు రాలేదక్కా.. ఆయన మీద అభిమానంతో ప్రాణాలు వది లాడు. ఇది జరిగి ఐదేళ్లయినా గుర్తు పెట్టుకుని మమ్మల్ని ఓదార్చడానికి ఇంతదూరం వచ్చా రు. అది చాలు మాకు..’’ అంటూ వెంకటనర్స య్య కుమార్తెలు నోమిని, పార్వతి తమ బాధను షర్మిలతో పంచుకున్నారు. వెక్కివెక్కి ఏడుస్తున్న నోమిని చేతులు పట్టుకుని షర్మిల కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు. ‘నేనేమో చదువుకోలేదు.. ఏం చేయాలో ఎలా బతకాలో నాకేమీ తెలియడం లేదమ్మా..’ అంటూ రోదిం చిన వెంకట నర్సయ్య భార్య రంగమ్మకు షర్మిల ధైర్యం చెప్పారు. ‘‘దేవుడు అందరికీ మంచే చేస్తాడమ్మా.. మీ కుటుంబానికి మేం అండగా ఉంటాం. అందరూ ధైర్యంగా ఉం డండి..’’ అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నోమిని, పార్వతి తయారు చేసిన గులాబ్‌జామ్‌ను షర్మిలకు తినిపించారు.

రెండోరోజు.. మూడు కుటుంబాలు 
గురువారం నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని మూడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. తొలుత కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబాన్ని సందర్శించిన షర్మిల... అనంతరం అనుముల మండలం గరికేనాటి తండాకు వెళ్లి బానావత్ బోడియానాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ గ్రామస్తులు షర్మిలకు ఎదురేగి ఊరిలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత భోజనం పూర్తి చేసుకున్న షర్మిల... త్రిపురారం పట్టణంలోని మైల రాములు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు తమ కష్టాలను షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. రాములు భార్య ధనమ్మ హ–ద్రోగి అని, ఆమెకు ఆపరేషన్ అవసరమని కుటుంబ సభ్యులు తెలపడంతో చలించిపోయారు. చికిత్స చేయించుకుంటున్నారా? అని అడిగినప్పుడు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని వారు చెప్పడంతో... అవసరమైన చికిత్స అందిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. వెంటనే హైదరాబాద్‌కు ఆమెను తీసుకువెళ్లాలని ధనమ్మ కుమారులకు చెప్పారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులను షర్మిల ఆదేశించారు. కాగా.. రెండోరోజు పరామర్శ యాత్రలో షర్మిల వెంట వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, అమృతాసాగర్, పార్టీ అనుబంధ యువజన సంఘం అధ్యక్షుడు బీష్వ రవీందర్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా అహ్మద్, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త పెదపటోళ్ల సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్ కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్ సగం... నాన్న సగం 
‘‘అమ్మా.. ఇది మా నాన్న వెంకట నర్సయ్య ఫొటో. ఇందులో ముఖం మాత్రమే నాన్నది. మిగతా అంతా వైఎస్ ఫొటోనే... వైఎస్సార్ మీద అభిమానంతో మా నాన్న ఇలా ఫొటో చేయించుకున్నారు.. అందులోనే మా నాన్నను, వైఎస్సార్‌ను ఇద్దరినీ చూసుకుంటున్నాం..’’ అని కామిశెట్టి వెంకట నర్సయ్య కూతుళ్లు నోమిని, పార్వతి.. షర్మిలకు చెప్పుకుని మురిసిపోయారు. వెంకట నర్సయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న సందర్భంగా ఇంటిగోడకు తగిలించి ఉన్న ఆ ఫొటోను వారు షర్మిలకు చూపించారు. షర్మిల ఆ ఫొటో వైపు చూస్తుండగా ఎంపీ పొంగులేటి దానిని తీసి ఆమె చేతికి ఇచ్చారు. ఆ ఫొటోను తదేకంగా చూసిన షర్మిల... తన తండ్రి ఉన్న ఆ ఫొటోను ఆత్మీయంగా చేతులతో తడిమి చూసుకున్నారు.

Popular Posts

Topics :