08 March 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయండి

Written By news on Saturday, March 14, 2015 | 3/14/2015


పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయండి
 సాక్షి, హైదరాబాద్:  పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లుపై వెంటనే అనర్హత వేటువేయాలని స్పీకర్ మధుసూదనాచారికి వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ మరోసారి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి స్పీకర్‌ను ఆయన నివాసంలో తెలంగాణ వైఎస్సార్‌సీపీ పక్షనేత పాయం వెంకటేశ్వర్లు, తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ కలుసుకుని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు నోటీసు ఇచ్చినందున, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు ఇప్పటివరకు నోటీసే ఇవ్వలేదన్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ ఎన్నికల గుర్తుపై గెలుపొం దిన తాటి వెంకటేశ్వర్లు, జనవరి 9న కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విదితమే. గతంలో మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు సమర్పించిన తాటి వెంకటేశ్వర్లు ఆ తర్వాత తానూ టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారని, ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దుచేయాలని మరోలేఖలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు అనుగుణంగా పరిశీలిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.

‘సుప్రీం’ ఆదేశాల అమలుపై పార్లమెంటులో ఎంపీ ప్రస్తావన


‘సుప్రీం’ ఆదేశాల అమలుపై పార్లమెంటులో ఎంపీ ప్రస్తావన
సాక్షి, ఖమ్మం: పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో శాశ్వత ఉద్యోగాలను క్యాంపస్ సెలక్షన్లు, ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎంతవరకు అమలు చేస్తున్నారని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పార్లమెంటులోప్రశ్నించారు. పోస్టులను భర్తీ చేస్తున్నట్టయితే ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరారు. దీనికి ఆర్ధిక శాఖామంత్రి జయంత్‌సిన్హా సమాధానమిస్తూ..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరించినందు వల్ల స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సెంట్రల్ బ్యాంక్‌ను

సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందని చెప్పారు. శాశ్వత భర్తీకి వ్యతిరేకంగా ఉద్యోగాలను ఇంటర్వ్యూల ద్వారాగానీ, క్యాంపస్ సెలక్షన్స్ ద్వారాగానీ చేసినట్టయితే ఆయా తేదీల్లో సెలక్షన్ల ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులను పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోకి అనుమతించరని వివరించారు.

ప్రత్యేక హోదా అడిగితే జైలుకు పంపుతారా


ప్రత్యేక హోదా అడిగితే జైలుకు పంపుతారా
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ఆందోళన చేపట్టిన సీపీఐ నేత రామకృష్ణను అరెస్టు చేయడాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అందుకు నిరసనగా శాసనసభ నుంచి శుక్రవారం ఆ పార్టీ వాకౌట్ చేసింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీరో అవర్‌లో ప్రత్యేకంగా ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అన్ని పక్షాలతోపాటు ప్రభుత్వమే కోరుతోందని, ఇదే అంశంపై సీపీఐ ప్రత్యక్ష ఆందోళన చేపడితే అరెస్టు చేసి, జైలుకు పంపడం దారుణమన్నారు. సీపీఐ నేత రామకృష్ణను ఈ నెల 11వ తేదీన అనంతపురంలో పోలీసులు అరెస్టు చేశారని, ఆయనపై పలు నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, న్యాయస్థానం ఆయనకు 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిందని జగన్‌మోహన్ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఈ తరహా దౌర్జన్యమేమిటని ప్రశ్నించారు.
ఈ ఘటనపై హోం మంత్రి తక్షణమే సభలో ప్రకటన చేయాలని పట్టుబట్టారు. రామకృష్ణతో పాటు సీపీఐ నేతల అరెస్టులన్నీ దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆయన గుర్తుచేశారు. దీనిని అణిచివేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. సీపీఐ నేతల ఆందోళనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలుపుతోందని, వారికి మద్దతుగా నిలుస్తామని విపక్ష నేత ప్రకటించారు. జీరో అవర్‌లో వాకౌట్ చేసే సంప్రదాయం ఉందో, లేదో తెలియదుగానీ, సమస్య తీవ్రతను తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కమ్యూనిస్టు నేతల అరెస్టులను నిరసిస్తూ జీరో అవర్ ముగిసే వరకూ పార్టీ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

జగన్‌కు సీపీఐ నేతల కృతజ్ఞతలు


రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ఆందోళన చేస్తూ అరెస్టయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విడుదలకు డిమాండ్ చేసినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి ఆ పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. జైల్లో ఉన్న రామకృష్ణను విడుదల చేయాలని జగన్ శుక్రవారం రాష్ట్ర శాసన సభలో డిమాండ్ చేయడంపట్ల ధన్యవాదాలు తెలిపారు.

నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వరా?

Written By news on Friday, March 13, 2015 | 3/13/2015


నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వరా?
హైదరాబాద్: కరువు సమస్యపై మాట్లాడేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకపోడంతో గందరగోళం రేగింది. ఈ సమస్యపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సభాపతి కోడెల శివప్రసాదరావు అనుమతివ్వలేదు. ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని జగన్ కోరినా స్పీకర్ పట్టించుకోలేదు.

దీంతో నిరసన తెలపడానికి కూడా సమయం ఇవ్వరా అంటూ జగన్ ప్రశ్నించారు. ప్రజల ప్రభుత్వం స్పందించకపోతే ఎవరు స్పందిస్తారంటూ నిలదీశారు. తమ నాయకుడిని మాట్లాడే అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా స్పీకర్ మైక్ కట్ చేసి, సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

కేసీఆర్ పెంచినప్పుడు....బాబు ఎందుకు పెంచడు?


కేసీఆర్ పెంచినప్పుడు....బాబు ఎందుకు పెంచడు?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్ వాడీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను అవమాన పరిచే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ... అసెంబ్లీలో మహిళల సమస్యలపై మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించక పోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఈ ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యమిస్తుందో దీనిని బట్టే అర్థమవుతుందని రోజా అన్నారు.  అంగన్ వాడీ ఉద్యోగులతో తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటుందని ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలు పెరిగాయని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు. కానీ గత తొమ్మిదేళ్ల సీఎంగా ఉండి... ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న చంద్రబాబు హయంలో మాత్రం అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలు కొంచెం కూడా పెంచలేదని విమర్శించారు. సదరు ఉద్యోగుల జీతాలు పెంచాలు పెంచాలి.... ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలి...ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత పొందే అన్ని వసతులు అంగన్ వాడీ ఉద్యోగులకు కల్పించాలని ఈ సందర్బంగా రోజా... చంద్రబాబు సర్కార్ ను డిమాండ్ చేశారు. 
పొరుగున్న ఉన్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలు పెంచిన సంగతిని రోజా ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పెంచినప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు పెంచదని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఏపీ మంత్రి అటవీశాఖ మంత్రిగారి సొంత నియోజకవర్గంలో వేధింపులు తాళలేక ఓ అంగన్ వాడీ టీచర్ మరణించిన సంగతిని ఈ సందర్భంగా రోజా గుర్తు చేశారు. 

చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, సభ వాయిదా

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే పది నిమిషాలు పాటు వాయిదా పడింది.  ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో శుక్రవారం  సమావేశాలు మొదలయ్యాయి.  అసెంబ్లీ ప్రారంభం కాగానే  అంగన్ వాడీ వర్కర్ల సమస్యలపై చర్చించాలంటూ వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు.

దాంతో చర్చకు అనుమతించాలంటూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే సమస్యను చర్చించేందుకు ముందుగా నోటీసు ఇవ్వాలని, ముందుగా సమావేశాలను సజావుగా కొనసాగేందుకు సహకరించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయితే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పట్టవీడకపోవటంతో స్పీకర్ పదినిమిషాల పాటు సభను వాయిదా వేశారు.

ఇళ్లు మేం కడితే కిటికీలు పెట్టి షోకులా?


టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం
  • శాసనసభలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుల ధ్వజం
  • నికర జలాలు రాకుండా పోయింది మీ హయాంలోనే
  • హంద్రీ నీవా మెయిన్ కెనాల్ తక్షణమే పూర్తిచేయండి
  • మండిపడ్డ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట
  • 2016కల్లా హంద్రీ నీవా పూర్తిచేస్తామన్న మంత్రి దేవినేని
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని కరువు కాటకాల్లోకి నెట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో సాగునీటి ప్రాజెక్టులపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. తొలుత రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజక వర్గం సాగు, తాగునీటికి కటకటలాడుతోందని, హంద్రీ నీవా మెయిన్ కెనాల్ పనుల ను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కెనాల్‌కి సంబంధించి ఇప్పటివరకూ ఏఏ పనులు కొనసాగించారో చెప్పాలని ప్రశ్నించారు. మదనపల్లి, పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌లు పూర్తిచేయడంపై తమకేమీ అభ్యంతరం లేదని, కానీ ముందుగా మెయిన్ కెనాల్ పనులు పూర్తిచేయాలన్నారు. పుంగనూరు, మదనపల్లి బ్రాంచ్ కెనాల్‌లు తక్షణమే పూర్తిచేయాలని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిలు డిమాండ్ చేశారు. 1,500 అడుగులు బోర్లు వేసినా నీళ్లు లేవని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ఈ కెనాల్‌లు పూర్తిచేయడం వల్ల లక్షలాది ఎకరాలు సాగు అవుతుందని పేర్కొన్నారు. దీనికి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా బదులిస్తూ, అప్పటి వైఎస్ ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించలేకపోవడం వల్లే నికర జలాలు కోల్పోయామని చెప్పారు. పులివెందుల రైతులు తమ ప్రాంతానికి నీళ్లివ్వాలని కోరడంతో కుప్పం నియోజకవర్గానికి ఆపైనా సరే పులివెందులకు నీళ్లు ఇవ్వాలని సీఎం చెప్పారని పేర్కొన్నారు. హంద్రీ నీవా సుజల ప్రాజెక్టు రెండో దశకు ఇప్పటివరకూ రూ. 2,893 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ. 1,216 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండో దశకు ఇంకా 5,481 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని దేవినేని ఉమా సమాధానమిచ్చారు. 2015-16 నాటికి హంద్రీ నీవా మెయిన్ కెనాల్ పనులు పూర్తిచేస్తామన్నారు.
 
ఇళ్లు మేం కడితే కిటికీలు పెట్టి షోకులా?

నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించారు. 1994 నుంచి 2004 వరకూ అస్యూర్డ్ వాటర్(నికరజలాలు) రాకపోవడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని గడికోట శ్రీకాంతరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నీ 70 శాతానికి పైగా మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయన్నారు. ఇళ్లు మేము పూర్తిచేస్తే, కిటికీలు మీరు పెట్టుకుని షో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాకముందే ఆలమట్టి ఎత్తు పెంచారని, అప్పట్లో కర్ణాటకకు సరైన కౌంటర్ ఇవ్వలేక ఇప్పుడు బురదజల్లే కార్యక్రమం చేపట్టారని దుయ్యబట్టారు.

కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడిందెవరు? మీరు కాదా?


  • ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
  •  కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడిందెవరు? మీరు కాదా?
  •  అది మరిచి మాపై అభాండాలా?
  •  ఒక్కటంటే ఒక్కటైనా ఇల్లు కట్టారా?
  •  ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
  •  మేము వైఎస్ వారసులమేగానీ కాంగ్రెస్ వారసులం కాదు..
  •  ఇందిరా ఆవాస్ యోజన ఇళ్లపై సభలో దుమారం
  •  విపక్షం ప్రశ్నకు బదులివ్వకుండా అధికారపక్షం ఎదురుదాడి
  •  గృహనిర్మాణశాఖ మంత్రికి వత్తాసుగా రంగంలోకి ఇతరులు..
  •  హౌస్ కమిటీ వేద్దామంటూ మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదన
  •  కాలయాపన కోసమే ఈ ఎత్తుగడన్న విపక్షం
  •  ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై అభాండాలు వేయడం తగదని హితవు పలికారు. మహానాయకుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు, టీడీపీ ప్రభుత్వానికి పోలికా? అని ఎద్దేవా చేశారు. తమ పార్టీపై అవాకులు చవాకులు పేలడం మానాలన్నారు. తాము దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులమే తప్ప కాంగ్రెస్‌కు కాదని తేల్చిచెప్పారు. టీడీపీయే అసలు సిసలైన ‘తెలుగు కాంగ్రెస్’ అని అభివర్ణించారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఇందిరా ఆవాస్ యోజన ఇళ్ల మంజూరుపై చర్చలో తీవ్ర గందరగోళం జరిగింది. వాగ్వాదాలతో మొదలైన చర్చ సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసి.. చివరకు వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్‌తో ముగిసింది. అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పడానికి బదులు మంత్రులు ఎదురుదాడికి దిగి.. ప్రశ్నతో సంబంధం లేని అంశాల్ని ప్రస్తావించి చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు.
 
అడిగిన ప్రశ్న ఇది!

ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) పథకం కింద గత పదినెలల కాలంలో ఎన్ని ఇళ్లు మంజూరు చేశారు, ఎన్ని కట్టారు, ఎంతమందికి బిల్లులిచ్చారు, కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని? ఖర్చు పెట్టినవి ఎన్ని? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి ప్రశ్నించారు. దీనికి గృహనిర్మాణ మంత్రి మృణాళిని సూటిగా జవాబు చెప్పలేకపోయారు. ఐఏవై, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు 3,895 ఇళ్లు మంజూరు చేయమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, వాటిల్లో అగ్నిప్రమాద బాధితులకు సంబంధించినవి 3,275 ఉన్నాయంటూ గత పదేళ్లలో ఏమి జరిగిందంటే అని మొదలుపెట్టారు. దీంతో గోవర్దన్‌రెడ్డి మళ్లీ స్పష్టంగా తన ప్రశ్నను సంధించారు. దీంతో ఆత్మరక్షణలో పడిన మంత్రి మృణాళిని... పథకాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ పథకంతో కలపడం వల్ల ఏమీ చేయలేకపోతున్నామని, నూతన మార్గదర్శకాలు తయారవుతున్నాయని చెప్పి కూర్చున్నారు.
 
మంత్రి మృణాళినికి వత్తాసుగా మరికొందరు...

మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు కాకాని, రోజా తదితరులు సూటిగా జవాబు చెప్పాలని పట్టుబట్టారు. ఈ దశలో గృహనిర్మాణ మంత్రికి మద్దతుగా మరో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోబోగా.. విపక్ష సభ్యులు అభ్యంతరపెట్టారు. అయినా అచ్చెన్నాయుడు, ఆ తర్వాత గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడారు. దీంతో విపక్ష, పాలకపక్ష సభ్యులమధ్య వాగ్వాదం జరిగింది. వంద జన్మలెత్తినా వైఎస్ రాజశేఖరరెడ్డిలాగా రాష్ట్ర ప్రజల్ని మెప్పించడం టీడీపీ వల్ల కాదని వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. ఈలోగా మరో మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ.. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేయడంతో విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు.
 
తెలుగు కాంగ్రెస్ మీదే కదా?: జగన్

‘‘హౌసింగ్ సమస్య చాలా ముఖ్యమైంది. ఎన్నికలై పది నెలలైంది. ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఇల్లయినా నిర్మించిందా? కొత్తది ఒక్కటీ ఇవ్వకపోగా మంజూరైన వాటిని రద్దు చేశారు. పని మొదలైన తర్వాత కూడా నిధులు ఆపారు. మీరు ఈ ఏడాదిలో ఏం చేశారో చెప్పమంటే గత పదేళ్లలో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అది చేసింది, ఇది చేసిందీ, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటూ అభాండాలు వేస్తున్నారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న తెలుగుదేశం వాళ్లే కదా కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌ను కాపాడింది? అసలు సిసలైన తెలుగు కాంగ్రెస్ మీది కాదా? 294 మంది సభ్యులున్న ఇదే అసెంబ్లీలో రూ.32 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపిన కిరణ్ సర్కార్‌ను గద్దె దించడానికి బదులు విప్ జారీ చేసి మరీ పడిపోకుండా కాపాడారు. మెజారిటీకి 2 ఓట్లు తక్కువగా ఉంటే కాపాడింది ఎవరు? మీరు కాదా? తెలుగు కాంగ్రెస్ మీదయితే మమ్మల్ని అంటారా? వైఎస్సార్ గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆయన తన ఐదేళ్ల పాలనలో 48 లక్షల ఇళ్లు కట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారు. దేశం మొత్తం మీద కట్టిన ఇళ్లే 47 లక్షలు. కానీ వైఎస్ కట్టించింది 48 లక్షల ఇళ్లు. స్పీకర్‌గారు కూడా తన నియోజకవర్గంలో ఇళ్లు కట్టలేని పరిస్థితి. ఒక్కసారి నియోజకవర్గానికి వెళ్లండి. పేదలగోడు వినండి. అందరికీ అవసరమే ఇది’’ అని జగన్ నిప్పులు చెరిగారు.
 

 
ఇంకో ఏడాది కాలయాపన కోసమా?: జగన్

తర్వాత జగన్ మాట్లాడుతూ... ‘‘ఒక్క ఇల్లూ లేదు, బిల్లూ లేదు. ఏడాది గడిచింది. హౌస్ కమిటీ పేరిట ఇంకో ఏడాది గడపాలన్నది పాలకపక్షం ఆలోచనగా ఉంది. ఓ పక్క కమిటీ అంటారు, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో గృహ నిర్మాణ మంత్రిగా పనిచేసిన శిల్పామోహన్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకుని టికెట్ ఇస్తారు.. కిరణ్ సర్కార్ కూలకుండా మద్దతు తెలుపుతారు. మీకో విషయాన్ని స్పష్టం చేస్తున్నా.. మేము వైఎస్‌కు వారసులమేగానీ కాంగ్రెస్‌కు కాదు.. మానవత్వంతో మెలగండి, పేదల ఇళ్ల నిర్మాణానికి ముందుకు రండి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మేము సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం.. అని ప్రకటించారు.
 
రెచ్చిపోయిన మంత్రులు: అనంతరం మాట్లాడిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, యనమల రామ కృష్ణుడు, రావెల కిషోర్‌బాబు, కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథరెడ్డి, మృణాళిని, ఎమ్మెల్యేలు గౌతు శివాజీ తదితరులు వైఎస్సార్‌సీపీపైన, జగన్‌మోహన్‌రెడ్డిపైన తీవ్రవ్యాఖ్యలు చేశారు. చివరిగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు మంత్రే స్వయంగా అంగీకరించినందున సభా సంఘాన్ని వేసుకోమని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నానన్నారు.

అంగన్ వాడీ సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం  అంగన్ వాడీ ఉద్యోగులు, హెల్పర్స్ సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.  ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నిన్న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఇవాళ అసెంబ్లీలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

అలుపెరగని పోరాటం చేస్తాం : వైఎస్ జగన్

Written By news on Thursday, March 12, 2015 | 3/12/2015


అలుపెరగని పోరాటం చేస్తాం : వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నేడు వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం ఉదయం లోటస్ పాండ్ లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పార్టీ పెట్టినప్పటి నుంచి అభివృద్ధి చెందుతూనే ఉందన్నారు.

పార్టీ పెట్టినప్పుడు తమకు ఎలాంటి అసెంబ్లీ స్థానాలు లేవని ఆ తర్వాత రెండు స్థానాలు.. అని అక్కడ నుంచి పార్టీ ప్రస్థానం మొదలు పెడితే ... పార్టీ ఆవిర్భవించిన అనతి కాలంలోనే ప్రజల ఆదరణ పొందిందన్నారు. పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని వైఎస్ జగన్ తెలిపారు.  
 

 

ఎత్తుగా.. లావుగా ఉన్నాడని మైకిస్తారా?


ఎత్తుగా.. లావుగా ఉన్నాడని మైకిస్తారా?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం రసవత్తర సన్నివేశం జరిగింది. ఎప్పుడూ నోరు వేసుకుని ప్రతిపక్షాన్ని విమర్శించే మంత్రి అచ్చెన్నాయుడి మీద ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంధించిన విమర్శనాస్త్రాలు అందరికీ నవ్వు పుట్టించాయి. వైఎస్ జగన్ వ్యాఖ్యలతో సభ మొత్తం నవ్వులతో నిండిపోయింది. గృహనిర్మాణం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నకు తన శాఖతో సంబంధం లేకున్నా.. కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పడంతో.. వైఎస్ జగన్ మండిపడ్డారు. ''ఆయన సంబంధిత మంత్రి కాకున్నా.. ఎత్తుగా, లావుగా, భద్రంగా ఉన్నాడని ఊ అంటే ఆయనకు మైకిచ్చేస్తారు. (ఈ మాట అనగానే సభ మొత్తం నవ్వులతో నిండిపోయింది) ఆయన అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తారు. మనిషి పెరుగుతున్నారు.. ఏం లాభం? ఎదిగే కొద్దీ ఒదగాలి, మానవత్వం ఉండాలి. అవేమీ లేవు. ఇలాంటి వ్యక్తులు ఇంత దారుణమైన మాటలు మాట్లాడేముందు మానవత్వం గురించి తెలుసుకోవాలి. చేయాల్సిన పనుల గురించి తెలుసుకోవాలి'' అని వైఎస్ జగన్ అన్నారు.  

అంతకుముందు ఆయన మాట్లాడుతూ, ''మీరు  ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా, కట్టిన ఇళ్లకూ బిల్లులు ఇవ్వడంలేదు. జియోట్యాగింగ్ పేరుతో ఇప్పటికే ఏడాది గడిచిపోయింది.. ఇప్పుడు మళ్లీ సభాసంఘం అంటూ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేసిన శిల్పామోహనరెడ్డిని పిలిచి పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. అప్పట్లో అవినీతి జరిగితే ఆయనకు టికెట్ ఎందుకిచ్చారు? మేం గత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలకడంలేదు. మేం దివంగత మహానేత వైఎస్ వారసులం అని గర్వంగా చెప్పుకొంటాం. గత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపింది మేం కాదు.. మీరే'' అని అధికారపక్షాన్ని దుమ్ము దులిపేశారు.

ఒక్క కొత్త ఇల్లు కట్టించిన పాపాన పోలేదు

హైదరాబాద్: టీడీపీ 10 నెలల పాలనలో ఒక్క కొత్త ఇల్లు కూడా ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఇళ్లు ఇవ్వకపోగా ఇంతకుముందు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేశారని అసెంబ్లీలో అన్నారు.

పేదల ఇళ్ల గురించి తాము అడుగుతుంటే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ అభండాలు వేస్తున్నారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కాపాడి టీడీపీ.. తెలుగుకాంగ్రెస్ గా వ్యవహరించిందని జగన్ గుర్తు చేశారు. విప్ జారీచేసి కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి 48 లక్షల ఇళ్లు కట్టి చూపించారని చెప్పారు. టీడీపీ సర్కారు ఒక్క కొత్త ఇల్లు కట్టించిన పాపాన పోలేదని వైఎస్ జగన్ విమర్శించారు.

వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన స్పీకర్  కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలను కొనసాగిస్తున్నారు. పలు సమస్యలపై ఎమ్మెల్యేలు అడుతున్న ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలిస్తున్నారు.

పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం లోటస్ పాండ్ లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.  పార్టీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని అయిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు,అభిమానులు హాజరయ్యారు.

కాగా  ప్రజా సమస్యలపై నిరంతరం పోరు సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటికి తన నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించడమే ప్రధాన ఎజెండాగా ఆవిర్భవించిన ఈ పార్టీ తొలి నుంచీ ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది.

తెలంగాణకు న్యాయం జరగలేదు


తెలంగాణకు న్యాయం జరగలేదు
  • కొత్త రాష్ట్రం కొండంత ఆశలు పెట్టుకుంది
  • రైల్వే బడ్జెట్‌పై చర్చలో ఎంపీ పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం లోక్‌సభలో రైల్వేబడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రైల్వే బడ్జెట్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై అంతగా దృష్టి పెట్టలేదు. ఇది ప్రజలందరినీ నిరుత్సాహ  పరిచింది. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం, భారత రైల్వేవిభాగం సగటు మనిషి అవసరాలను, ఆకాంక్షలను తీర్చడంలో విఫలమయ్యాయి.

రైల్వేలో సరైన సదుపాయాలు ఏర్పడక పోవడంతో రోజూ రైల్వే ద్వారా ప్రయాణం చేస్తున్న 2.5 కోట్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈసారైనా కొంత మేలు జరుగుతుందని ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. 120 కోట్లుగా ఉన్న ప్రస్తుత దేశ జనాభాకు అనుగుణంగా రైల్వే నెట్ వర్క్ విస్తరించాలని, ప్రజల అవసరాలు తీర్చాలని చాలా డిమాండ్లు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు కేవలం 12 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ మాత్రమే ఉంది. ఉన్న రైలు మార్గాల్లోనే ఏటా కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు.

దీనికారణంగా రైలు మార్గాలపై ఒత్తిడి పెరిగి ప్రమాదాలకు దారితీసే పరిస్థితి ఉంది. విద్యుదీకరణ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 65 వేల కిలోమీటర్ల ట్రాక్‌లో కేవలం 20,833 కిలోమీటర్ల ట్రాక్‌కు మాత్రమే విద్యుదీకరణ పూర్తయ్యింది. ఇప్పటికీ దేశ వాణిజ్య రాజధాని ముంబై, దేశంలోనే ఐదో పెద్ద నగరమైన హైదరాబాద్ మధ్య డీజిల్ లోకోమోటివ్ సర్వీసులు నడుస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ఇక అడ్వాన్స్ రిజర్వేషన్‌ను 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు. సీట్లను బ్లాక్ చేసుకోవడానికి టికెట్ మాఫియాకు ఇదొక సువర్ణ అవకాశంగా మారనుంది.

బహుశా మంత్రి విమానయాన సర్వీసుల్లో మాదిరిగా అడ్వాన్స్ టికెటింగ్ ద్వారా రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు దీనిని ప్రవేశపెట్టారేమో. కానీ విమానయాన సర్వీసుల్లో ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే కాస్త చవకగా, డిస్కౌంట్‌తో కూడిన టికెట్ ఇస్తారు. కానీ రైల్వేలో ప్రవేశపెట్టిన ఈ 120 రోజుల ముందస్తు టికెట్‌కు ఏ రకమైన డిస్కౌంట్ లభించదు. అయితే రైల్వే టికెట్ చార్జీలను పెంచకుండా ప్రయాణికులపై భారం వేయనందుకు సంతోషం. దీనిని స్వాగతిస్తున్నాం. మరో ముఖ్యవిషయం ఏంటంటే ఈ బడ్జెట్‌లో ఒక కొత్త రైలును కూడా ప్రకటించలేదు.

ఇది కూడా స్వాగతించదగిన పరిణా మం. గత బడ్జెట్‌లలో చేసిన ప్రకటనలను ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రకటించిన కొత్త రైల్లేవీ ఇంకా పట్టాలెక్కలేదు. అలాగే ఇప్పుడు ట్రాక్ సంబంధిత మౌలిక వసతులను బలోపేతం చేయాల్సిన సమయం వచ్చింది. రైల్వేబోర్డు మాజీ సభ్యుడొకరు ఏం చెప్పారంటే ఒక ప్యాసింజర్ రైలు కి.మీ.కు రూ. 450 సంపాదిస్తే.. గూడ్స్ రైలు రూ. 4,500 సంపాదిస్తుందని చెప్పారు.

అందువల్లే ప్రభుత్వం గూడ్స్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తూ ప్యాసింజర్ ట్రాఫిక్‌ను విస్మరిస్తున్నట్టుగా ఉంది. దక్షిణ మధ్య రైల్వేకు మౌలిక వసతుల కోసం రూ. 2,768 కోట్లు కేటాయించారు. అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల పేర్లతో ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఉండకూడదు?  తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించడంలో గానీ, ప్రస్తుత ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు పేరు మార్చకపోవడంపై గానీ రైల్వే శాఖ నిర్ణ యం తీసుకోకపోవడంలో ఉన్న తర్కమేంటో నాకు అర్థం కావడం లేదు. కాజీపేటను డివి జన్‌గా మార్చడం వల్ల వెనకబడిన ప్రజలకు న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్‌ను ప్రకటించింది. కానీ దీనికి సరైన కేటాయింపులు లేక ముం దుకు సాగడం లేదు.’ అని పేర్కొన్నారు.
 
మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల మూసివేతపై ప్రస్తావన

విద్యార్థుల కొరత కారణంగా ఎంబీఏ విద్యాసంస్థలు ఉనికి కోల్పోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి  సహా ఎంపీలు ధృవ్ నారాయణ, జి.హరి లోక్‌సభలో బుధవారం ప్రశ్నించారు. ఉనికి కోల్పోతున్న విద్యాసంస్థల వివరాలను రాష్ట్రాల వారీగా అందజేయాలని, కళాశాలల మూసివేతకు కారణాలపై ప్రభుత్వం చేసిన అధ్యయనం, తీసుకున్న చర్యలను తెలపాలని ప్రశ్నోత్తరాల సమయంలో అడిగారు. ఎంపీల ప్రశ్నలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీ ఇరానీ బదులిస్తూ దేశంలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో విద్యార్థుల కొరతతో ఎంబీఏ విద్యాసంస్థలు ఉనికి కోల్పోతున్న విషయం కేంద్రం దృష్టికి రాలేదన్నారు.  దేశంలో 12 రాష్ట్రాల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు నిర్వహిస్తున్న 41 సంస్థలను 2014-15లో మూసివేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 8 విద్యాసంస్థలను మూసివేసినట్టు తెలిపారు.

మాయ మాటలు.. భ్రమలు


మాయ మాటలు.. భ్రమలు
  • అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టిన బుగ్గన
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎన్నికలకు ముందు జనాన్ని హామీలతో సంతోషపెట్టారు. ఓట్లు వచ్చాక మీరు సంతోషపడ్డారు. మిమ్మల్ని సం తోషపెట్టాం, మేమూ సంతోషపడుతున్నాం. ఎన్నికల సమయంలో మిమ్మల్ని సంతోషపెట్టాం, ఇప్పుడు మేం సంతోషిస్తున్నాం. రెంటికీ సరిపోయింది కదా..’’ అన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం తీరుందని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

బుధవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, 9 గంటల విద్యుత్, గుడిసెలు లేని ఇళ్లు, ఇంటింటికీ ఉద్యోగం అంటూ హామీల మోత మోగించిన మీరు ఒక్కటైనా అమలుకు ప్రయత్నిస్తున్నా రా? అంటూ మండిపడ్డారు. ‘రుణమాఫీ రూ.80 వేల కోట్లయితే కేవలం రూ.3 వేల కోట్లతో చేతులు దులుపుకున్నారు. డ్వాక్రా రుణాలు రూ.14,200 కోట్లు, అపరాధ వడ్డీ రూ.2,500 కోట్లు కలిపి మొత్తం సుమారు రూ.17,000 కోట్లు ఉంది. 60 ఏళ్లు దాటితే పెన్షన్లు ఇస్తుండేవారు. ఇప్పుడేమో 65 ఏళ్లు దాటితేగానీ ఇవ్వడం లేదు. ఇదేనా మీ ప్రభుత్వ తీరు’ అంటూ దుయ్యబట్టారు.

మాఫీలంటూ జనాన్ని మాయచేసి అధికారంలోకి వచ్చాక ఒక్క పథకాన్నీ అమలు చేయడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను ఏమార్చుతుందో ఆయన సభలో వివరించారు. ‘పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్ సమయంలోనూ, ఎమ్మెల్సీల పెంపు సమయంలో నూ రెండుసార్లు విభజన చట్టానికి సవరణ జరి గింది. ఈ సవరణ జరుగుతున్నప్పుడైనా కేం ద్రంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం పోరాడిందా?’ అని నిలదీశారు. దీనిపై మంత్రి ఉమా స్పందిస్తూ..  బాబు ప్రమాణ స్వీకారం చెయ్యకముందే పోలవరం ఆర్డినెన్స్ వచ్చిందని చెప్పారు.
 
అప్పులు మీ హయాంలోనే

1991 నాటికి అప్పుల శాతం 21గా ఉంది. 2004 నాటికి 32 శాతానికి పెరిగింది. 2014 వచ్చేసరికి 22 శాతానికి తగ్గింది. అంటే 12 శాతం తగ్గినట్టు. దీన్ని మీరు గమనించారా అని బుగ్గన ప్రశ్నించారు. అంకెల గారడీ చూపింథ చేందుకు లక్ష కోట్ల బడ్జెట్ అంటున్నారని, 25 వేల కోట్ల లోటును అధిగమించేందుకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసమర్థులను క్షమిస్తారు, అమాయకులను భరిస్తారు, ఇంతలో చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు,  మంత్రి ప్రత్తిపాటి జోక్యం చేసుకుని, రాజేంద్రనాథ్‌రెడ్డి  అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు.
 
స్థానిక సంస్థల నిర్వీర్యం: స్థానిక సంస్థల అధికారాలకు సంబంధించి రాజ్యాంగంలో బలమైన హక్కులున్నాయి. కానీ నేడు ఆ సంస్థల ప్రతినిధులు  ఏం చేయాలో ప్రశ్నించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  రాష్ట్రంలో ప్రజాప్రతినిధులున్నారు, అధికారులున్నారు, కింది స్థాయి సిబ్బంది ఉన్నారు కానీ చంద్రబాబు ఒక్కరే పనిచేస్తున్నట్టు చెప్పడం ఏంటని, వీలైతే మీ సీఎంను ఒక్కసారి అడగాలని టీడీపీ సభ్యులకు సూచించారు. శివరామకృష్ణన్ హైపవర్ కమిటీపర్యటనలో ఉండగానే రాజధాని ఎక్కడో మీరే నిర్ణయించారు. భూములు తీసుకుంటున్నారు. ఏడాదికి మూడుపైర్లు వచ్చే భూములను ఎలా సేకరించారు?   సీఆర్‌డీఏ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకముందే ఒక్క ఎకరా కూడా స్వాధీనం చేసుకోకూడదు.  కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకే పట్టిసీమను చేపడుతున్నారని బుగ్గన మండిపడ్డారు.

ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేకపోయారు


ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేకపోయారు
  • ప్రభుత్వంపై జగన్ ధ్వజం
  • బాబొస్తేనే జాబొస్తుందంటూ ఊదరగొట్టారు
  • జాబులు రాలేదు.. జీతాలూ రావడం లేదు
  • చంద్రబాబు పుణ్యమా అని ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందారు
  • నిరుద్యోగ భృతి కోసం 1.75 కోట్ల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి
  • డీఎస్సీ, ఏపీపీఎస్సీ అభ్యర్థులు చదువుకుంటూనే ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికలకు ముందు ఏ టీవీ ఆన్ చేసినా, ఏ పత్రిక చూసినా జాబు రావాలంటే బాబు రావాలి, బాబొస్తేనే జాబొస్తుంది అంటూ ఊదరగొట్టారు. పోస్టర్లు, పాం ప్లెట్ల ద్వారా ఇంటింటి ప్రచారం చేశారు. బాబొచ్చి 9 నెలలు పూర్తయింది. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా..’ అంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం వైఎస్సార్‌సీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతుండగా.. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికార పక్ష సభ్యులు పదేపదే అడ్డు తగిలారు. దీంతో జగన్ కలుగజేసుకుని.. ‘ఉద్యోగాలిస్తామని చెప్పి ఒక్క నోటిఫికేషనూ ఇవ్వలేదు.

ఉద్యోగాలు రాకపోతే ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ ఈవేళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారా? ఇదిగో చూడండి మీ గెజిట్ (ఈనాడు)లోనే వచ్చింది, 10 నెలలుగా జీతాలు లేక ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెం దారు. ఇది చంద్రబాబు పుణ్యమే..’ అని ధ్వజ మెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది కాం ట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని జగన్ మండిపడ్డారు.

డీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం నిరుద్యోగ యువకులు చదువుతూనే ఉన్నారు.. చదువుతూనే ఉన్నారు. కానీ నోటిఫికేషన్లు రా వు. ఉద్యోగాలు రావు, కనీసం సర్వీస్ కమిషన్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేకపోయా రు.’ అని ధ్వజమెత్తారు. 1.75 కోట్ల కుటుంబా లు నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నాయని, కానీ చంద్రబాబు సంతకం పెట్టి వదిలేశారని ఎద్దేవాచేశారు.
 


 
మా సభ్యులు ఎలా మాట్లాడాలో మీరెలా నిర్ణయిస్తారు?

శాసనసభలో ఏం మాట్లాడాలనే విషయంలో ప్రతిపక్ష సభ్యులకు హక్కు ఉంటుందని, ఏం మాట్లాడాలనేది శాసనసభాపతి నిర్దేశించలేరని జగన్ చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైఎస్సార్‌సీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో వివరణ కోసం టీడీపీ సభ్యుడు శ్రవణ్‌కుమార్‌కు స్పీకర్ మైకు ఇచ్చారు. అదే సందర్భంలో కోడెల.. మీరు సభలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని బుగ్గనను ఉద్దేశించి అన్నారు. గత శాసనసభలో తెలుగువారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారని, అలా మాట్లాడకూడదని చెప్పారు. బుగ్గన స్పందిస్తూ తాను అలా మాట్లాడలేదని, ఎవరినీ ఉద్దేశించి చెప్పలేదని వివరించారు. ఈ దశలో జగన్ జోక్యం చేసుకుని స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసేటప్పుడు ప్రతిపక్ష సభ్యులకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటుంది. మా సభ్యులు ఎలా మాట్లాడాలో కూడా మీరే నిర్ణయిస్తారా? మీరు స్పీకరా? టీడీపీ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారా?’ అంటూ ప్రశ్నించారు. స్పీకర్‌గా వ్యవహరించాలని, టీడీపీ సభ్యులుగా కాదని సూచించారు. తమ నేత వ్యాఖ్యలకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ సభ్యులు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ తిరిగి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి మైకు ఇచ్చారు.

బడ్జెట్‌పై చర్చలో నిలదీస్తా.. : వైఎస్ జగన్


బడ్జెట్‌పై చర్చలో నిలదీస్తా.. : వైఎస్ జగన్
* ప్రభుత్వానికి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ హెచ్చరిక
* గవర్నర్ ప్రసంగం లేదా బడ్జెట్...
* ఏదో ఒకదాని మీదే విపక్ష నేత మాట్లాడటం సంప్రదాయం
* 2013 బడ్జెట్ సమావేశాలకు అప్పటి విపక్ష నేత చంద్రబాబు హాజరు కాలేదు
* గవర్నర్ ప్రసంగం మీద విపక్ష నేత మాట్లాడకపోవడం ఫస్ట్ టైమ్ అన్న సీఎం

 
 సాక్షి, హైదరాబాద్: ‘గవర్నర్ ప్రసంగం లేదా బడ్జెట్... ఏదో ఒకదాని మీదే విపక్ష నేత మాట్లాడటం సంప్రదాయం. గవర్నర్ ప్రసంగం మీద నేను మాట్లాడటం లేదు. బడ్జెట్ మీద జరిగే చర్చలో మాట్లాడతా. ప్రభుత్వాన్ని కడిగేస్తా. కాస్త ఒపికపట్టండి..’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పక్షానికి సూచించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద విపక్ష నేత జగన్ మాట్లాడకపోవడాన్ని బుధవారం టీడీపీ సభ్యులు తప్పుబట్టారు. ‘ధన్యవాద తీర్మానం మీద విపక్ష నేత మాట్లాడకపోవడం ఇదే తొలిసారి. నాయకత్వ దివాలాకోరుతనం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. సీఎం విమర్శకు సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వాలని జగన్ స్పీకర్‌ను కోరారు. చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత మాట్లాడమని స్పీకర్ సూచించారు. తమ నేతకు అవకాశం ఇవ్వాలని విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి డిమాండ్ చేసిన తర్వాత.. జగన్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు. 2013 బడ్జెట్ సమావేశాలకు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక్కరోజూ హాజరు కాలేదు... ఆ విషయం గుర్తులేదా? అని జగన్ ప్రశ్నించారు.
 
  ఏపీ తొలి బడ్జెట్ సమావేశంలో తాను మాట్లాడితే.. తాను మిగతా సభ్యులకు అవకాశం ఇవ్వడం లేదని టీడీపీ విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. బడ్జెట్ మీద తాను పూర్తిస్థాయిలో మాట్లాడతానని, ప్రభుత్వాన్ని అప్పుడు ఉతికేస్తానని చెప్పారు. ‘మిమ్మల్ని ఎలా కడిగేస్తానో ఆరోజు చూపిస్తా..’ అని అన్నారు. నిబంధనలు తెలియని విపక్ష నేత సభలో ఉన్నారంటూ టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శలకు జగన్ ఘాటుగా స్పందించారు. ‘నిబంధనలు, సభా సంప్రదాయాలు తెలియకపోతే తెలుసుకోవాలి. చదువు మీరు (అధికారపక్ష సభ్యులు) నేర్చుకోవాలి. నేర్చుకోని వచ్చిన తర్వాత మాట్లాడండి. ప్రతిపక్ష నేత ఎన్నిసార్లు మాట్లాడతారు. ధన్యవాద తీర్మానం లేదా బడ్జెట్... ఏదో ఒకదాని మీదే మాట్లాడతారు. నిబంధనలు తెలుసుకోవాల్సింది నేను కాదు.. చంద్రబాబు, ఆయన పార్టీ సభ్యులు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
 

పార్టీ పతాకాన్ని ఎగురవేయనున్న జగన్


ప్రజా సంక్షేమమే పరమావధి
* వైఎస్సార్‌సీపీ నాలుగేళ్ల ప్రస్థానం
* నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం
* పార్టీ పతాకాన్ని ఎగురవేయనున్న జగన్

 
 సాక్షి, హైదరాబాద్:  ప్రజా సమస్యలపై నిరంతరం పోరు సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటికి తన నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించడమే ప్రధాన ఎజెండాగా ఆవిర్భవించిన ఈ పార్టీ తొలి నుంచీ ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. వైఎస్ మరణానంతరం సంభవించిన రాజకీయ మార్పుల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీగా ఉండిన  ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల అధిష్టానవర్గం వివక్ష చూపుతూ వచ్చింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించడం ధర్మంగా భావించి నల్లకాలువ(వైఎస్ మృతి చెందినచోటు) వద్ద ఇచ్చిన మాటను అనుసరించి ఓదార్పు యాత్రను చేపడతానని జగన్ ప్రకటించారు.
 
 కాంగ్రెస్ అధిష్టానం ఈ యాత్రను అడ్డుకోవాలని చూసింది. వివక్షను జీర్ణించుకోలేకపోయిన జగన్ ఆ పార్టీని వీడారు. మార్చి 12, 2011 సంవత్సరంలో ప్రజాసంక్షేమమే పరమావధిగా ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించారు. అదే ఏడాది మే లో కడప లోక్‌సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ రికార్డు స్థాయిలో 5.43 లక్షల మెజారిటీతో గెలుపొందారు. అదే సందర్భంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులివెందుల నుంచి 85 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఓదార్పు యాత్రను ఓ వైపు కొనసాగిస్తూనే మరోవైపు ప్రజాసమస్యలపై పోరాటాన్ని జగన్ సాగించారు.
 
ప్రతిబంధకాలను అధిగమిస్తూ: జగన్ వల్ల తమ పార్టీ పునాదులు కదులుతూ ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్ అధిష్టానం సీబీఐని ఉసిగొల్పి కేసులతో ఇబ్బందులకు గురిచేసింది. రాజకీయంగా జగన్ ఎదుగుదలను ఓర్వలేని టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై అడుగడుగునా వైఎస్సార్‌సీపీకి ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చాయి. 2012 మే నుంచి 16 నెలలపాటు జగన్‌ను జైల్లో ఉంచి వైఎస్సార్‌సీపీపై ఉక్కుపాదం మోపేయత్నం చేశారు. జైల్లో ఉన్నా అక్కడినుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ జగన్.. పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. తాను ప్రజలమధ్య లేని లోటును తన తల్లి విజయమ్మ ద్వారా పూడ్చే యత్నం చేశారు. వైఎస్ తరువాత సీఎంలైన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ మహానేతకున్న మంచిపేరును తుడిచి వేయాలన్న దురుద్దేశంతో ఆయన ప్రారంభించిన  పథకాలకు తూట్లు పొడిచినప్పుడు జగన్  ప్రతిఘటిస్తూ వచ్చారు. రైతులు, విద్యార్థుల సమస్యలపై నిరాహార దీక్షలు చేస్తూ పోరాటాన్ని సాగించారు. తనను జైల్లో పెట్టిన తరువాత ఇవే ప్రజా సమస్యలపై తన తల్లి విజయమ్మతో దీక్షలు చేయించారు.  
 
రెండు ప్లీనరీలతో పార్టీ పటిష్టం: మార్చి 12, 2011న స్థాపించిన వైఎస్సార్‌సీపీ తొలి ప్లీనరీ ఇడుపులపాయలో అదే ఏడాది జూలై 8, 9 తేదీల్లో జరిగింది. రెండో ప్లీనరీ 2014 ఫిబ్రవరి 2న నిర్వహించారు. ఎన్నికల్లో గెలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేపట్టబోయే సంక్షేమపథకాలను ప్రకటించారు. పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటూనే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల ను సవాలుగా తీసుకుని వైఎస్సార్‌సీపీ పోరాడింది. గణనీయమైన సంఖ్యలో పంచాయతీలను గెల్చుకుంది. 2014 సాధారణ ఎన్నికల్లో విజయపు అంచులవరకూ చేరుకున్న  అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. ప్రజాభిమానం జగన్ వైపే ఉన్నా టీడీపీ ఆచరణకు సాధ్యంగాని హామీలు ఇవ్వడంతో మోసపోయిన రైతాంగం, ఇతర వర్గాలు చంద్రబాబువైపు మొగ్గుచూపాయి.
 
 అబద్ధపు హామీలతో వైఎస్సార్‌సీపీకన్నా కేవలం 1.9% ఓట్లతో టీడీపీ విజయం సాధించింది. 2011లో 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే స్థానాలతో  బోణీ కొట్టిన వైఎస్సార్‌సీపీ క్రమంగా బలాన్ని పెంచుకుంది. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఏపీలో 17 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలను గెల్చుకుంది.  సాధారణ ఎన్నికల్లో ఉభయ రాష్ట్రాల్లోనూ కలపి 70 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. ఎన్నికల ఫలితాలు కొంత నిరాశకు గురిచేసినప్పటికీ.. ఆ మరుక్షణమే తేరుకుని ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన జగన్ పోరాటపంథానే ఎంచుకున్నారు. గత 9 నెలల్లో  క్రియాశీల ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీని తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను జాగృతం చేస్తున్నారు.
 
 నేడు ఆవిర్భావ దినోత్సవం: గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాలుగో ఆవిర్భావ దినోత్సవం జరుగ నున్నది. వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ పతాకాన్ని ఎగురవేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

TDP MLA sleeping in assembly while Chandrababu speaking

అంగన్‌వాడీల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు

Written By news on Wednesday, March 11, 2015 | 3/11/2015

తెనాలి అర్బన్(గుంటూరు): గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో అంగన్‌వాడీ వర్కర్లు గత మూడు రోజులుగా చేస్తున్న రిలే దీక్షలకు వైఎస్సార్‌సీపీ ఏపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, తెనాలి నియోజవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మద్దతు తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అంగన్‌వాడీ సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
 

నిరూపిస్తే రాజీనామా చేస్తా: కొడాలి నాని


నిరూపిస్తే రాజీనామా చేస్తా: కొడాలి నాని
హైదరాబాద్: ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా పేదలకు ఒక్క ఇంటికి కూడా రుణం ఇవ్వలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. పేదల కోసం వైఎస్ఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పులిచింతల ప్రాజెక్టు ఘనత వైఎస్ రాజశేఖరెడ్డిదని, ఇప్పుడు పులిచింతల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తైతే వైఎస్ఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేదన్నారు. ఆయన చనిపోయిన రోజే పోలవరం ప్రాజెక్టు చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. పోలవరం చెడగొట్టడానికే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. రుణాలు మాఫీ కాకుండానే సన్మానాలు చేయించుకుంటున్నారని, ఒక్క మహిళకు రుణమాఫీ చేసినట్టు నిరూపించితే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. విభజన చట్టం ప్రకారం రాజధానిని కేంద్రం నిర్మించాలన్నారు. కేంద్రం నిర్మిస్తే తమకేమీ రాదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తామంటోందని ఆరోపించారు.

మా పార్టీ గొంతు నొక్కేస్తున్నారు


'మా పార్టీ గొంతు నొక్కేస్తున్నారు'
హైదరాబాద్ : ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ఎండగడతామనే.... ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ గొంతును బలవంతంగా నొక్కేస్తుందని చిత్తూరు జిల్లా చంద్రగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మి ఓట్లు వేసినందుకు.... లక్షలాది మంది యువత అన్యాయమైపోయారన్నారు. అసెంబ్లీ అయిదు నిమిషాల వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన చెవిరెడ్డి.....యువత ఓట్లతో  చంద్రబాబు, ఆయన అనుచరవర్గం మాత్రమే బాగుపడిందని ఎద్దేవా చేశారు

జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయి


హైదరాబాద్ :  చంద్రబాబు నాయుడు పాలనలో  అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు.  బుధవారం అసెంబ్లీ వాయిదా అనంతరం  మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాబు నెరవేర్చలేదన్నారు. సభలో ప్రతిపక్షం నిరుద్యోగ సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు.

బాబు వస్తే జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు.  ఉద్యోగాలు రాకపోగా...దాదాపు 50 వేల మంది ఉన్న ఉద్యోగాలను కోల్పోయారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంతో చర్చకు రాలేకే తమ వాయిదా తీర్మానాలను తిరస్కరించారని విమర్శించారు. ప్రాధాన్యత గల అంశాలను సభలో చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు.
 

మిమ్మల్ని ఎలా కడుగుతానో చూపిస్తా...


మిమ్మల్ని ఎలా కడుగుతానో చూపిస్తా...
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం వాడీవేడిగా జరిగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వుద్దం జరిగింది.  గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడకపోవటం ఇదే ప్రధమమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.  అయితే ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు.  ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని... గత అసెంబ్లీ సమావేశాల్లో సభలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు తాను మైక్ ఇవ్వటం లేదన్న చంద్రబాబు మాటలను గుర్తు చేశారు. దాని బట్టే బడ్జెట్ పై తాను ఎంత మాట్లాడానో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక 2013 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అసలు సభలోనే లేరన్నారు.

అసెంబ్లీలో  ఏపీ బడ్జెట్ ప్రసంగంలో మిమ్మల్ని కడిగి పారేస్తా... కడిగించుకోండి అని వైఎస్ జగన్ అన్నారు.  ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ జగన్ ముందుగా అచ్చెన్నాయుడు మాట్లాడటం ఎలాగో నేర్చుకోవాలని సూచించారు.

వైఎస్‌ఆర్‌సీపీ నేతది హత్యే..!


వైఎస్‌ఆర్‌సీపీ నేతది హత్యే..!
* విషమిచ్చి చనిపోయేలా చేశారు
* సుధీర్‌రెడ్డి పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
* దోషులను తేల్చాల్సింది పోలీసులే...

 
 సాక్షి ప్రతినిధి, వరంగల్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా నేత భీంరెడ్డి సుధీర్‌రెడ్డి మృతిపై నెలకొన్న అనుమానాలు వీడాయి. రోడ్డు ప్రమాదానికి ముందు సుధీర్‌రెడ్డి తీసుకున్న ఆహారంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. సుధీర్‌రెడ్డికి ఆస్తులు ఉండడంతో పాటు రాజకీయంగా శత్రువులు ఉండడంతో పక్కా ప్రణాళికతో కొందరు ఈ పని చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుధీర్‌రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తుల సహకారంతోనే ఆయన శత్రువులు ఈ పని చేసినట్లుగా తెలుస్తోంది. సుధీర్‌రెడ్డి మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించిన ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీస్ నివేదిక ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించలేదని స్పష్టం చేసింది. ఆర్గనోఫాస్ఫేట్ అనే పురుగుమందుల ఆనవాళ్లు సుధీర్‌రెడ్డి శరీంలో ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్షలో తేలింది.
 
 మృతదేహం నుంచి సేకరించిన నాలుగు నమూనాలను పరీక్షించగా... మూడింటిలోనూ ఆర్గనోఫాస్ఫేట్ ఆనవాళ్లు ఉన్నటు ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. ఫోరెన్సిక్‌కు సంబంధించిన నివేదికను సోమవారం వెల్లడించింది. ఈ నివేదిక ప్రతిని కాజీపేట డీఎస్పీకి, పోస్టుమార్టం చేసిన వైద్యుడికి పంపింది. విషం కారణంగా సుధీర్‌రెడ్డి శరీరం నిస్సత్తువకు గురైందని... అదే సమయంలో ప్రయాణంలో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోంది. సుధీర్‌రెడ్డికి ఉన్న శత్రువులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ జరిపితేనే దోషులు ఎవరనేది తేలనుంది. మొదట రోడ్డు ప్రమాదం కారణంగానే సుధీర్‌రెడ్డి మృతి చెందినట్లుగా పోలీసులు భావించారు.
 
  తాజాగా ఫోరెన్సిక్ నివేదికతో ఇప్పుడు దోషులను గుర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న భీంరెడ్డి సుధీర్‌రెడ్డి 2014 డిసెంబర్ 23న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మడికొండ పరిధిలోని తరాలపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. సుధీర్‌రెడ్డి ఆ రోజు ఉదయం మల్లక్కపల్లిలో క్వారీ పనులను చూసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పనులు ముగించుకుని హన్మకొండ వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. తలకు బలమైన గాయం కావడంతో సుధీర్‌రెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. రోడ్డు ప్రమాదమే మృతికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రోడ్డు ప్రమాదమే అయినా సుధీర్‌రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

భూ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ


భూ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ
* లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో వ్యతిరేకంగా ఓటేసిన పార్టీ ఎంపీలు
* బహుళ పంటల సేకరణ తగదంటూ సవరణ ప్రతిపాదన
* వీగిపోయిన వైఎస్సార్‌సీపీ సవరణ; అయినా 101 సభ్యుల మద్దతు
* విపక్షాల సవరణ ప్రతిపాదనలకు మద్దతు తెలిపిన వైఎస్సార్‌సీపీ
* సాగు భూముల సేకరణ తగదన్న మిథున్‌రెడ్డి

 
 సాక్షి, న్యూఢిల్లీ: రైతుల పొట్టగొట్టే భూసేకరణ బిల్లును లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మంగళవారం సాయంత్రం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. బహుళ పంటలు పండే భూముల సేకరణకు తాము వ్యతిరేకమని, అలాగే సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం తప్పనిసరిగా ఉండాలన్న తమ వాదనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ.. బిల్లుకు పలు సవరణలు ప్రతిపాదించింది. ఈ సవరణలకు అధికార పక్షం మద్దతివ్వకపోవడంతో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడంతోపాటు, విపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలకు మద్దతిచ్చింది. బహుళ పంటల అంశం, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనానికి సంబంధించి వచ్చిన సవరణలన్నింటికీ మద్దతుగా ఓటేసింది.
 
  ప్రైవేటు ఎంటిటీ అన్న పదాన్ని తొలగించాలంటూ ఒక సవరణను, బహుళ పంటల భూముల సేకరణ తగదని, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనం ఉండాలని మరొక సవరణ ను ప్రతిపాదించాలని వైఎస్సార్సీపీ తొలుత భావించింది. కానీ, ప్రైవేటు ఎంటిటీ అంశానికి సంబంధించిన సవరణను వేరే పార్టీలు ప్రతిపాదించడంతో.. మిగిలిన సవరణను వైఎస్సార్‌సీపీ ప్రతిపాదించింది. బహుళ పంటల సేకరణ తగదని, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనం ఉండాలని.. ఈ మేరకు బిల్లును సవరించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదించగా.. ఈ సవరణ వీగిపోయింది.
 
 ఈ సమయంలో సభలో 430 మంది సభ్యులు ఉండగా.. సవరణకు మద్దతుగా 101 ఓట్లు లభించాయి. వ్యతిరేకంగా 311 ఓట్లు పడ్డాయి. మరో 18 మంది ఓటు వినియోగించుకోలేదు. పార్టీ ప్రతిపాదించే సవరణలకు సంబంధించి అనుకూలంగా ఓటేయ్యాలని పార్టీ విప్, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విప్ జారీచేశారు. దీంతో పార్టీ సభ్యులంతా ఓటింగ్‌లో పాల్గొని అనుకూలంగా ఓటేశారు. అయితే అనారోగ్య కారణాలతో పార్టీ ఎంపీ వై.ఎస్.అవినాశ్‌రెడ్డి సభకు హాజరు కాలేదు. అలాగే పార్టీకి దూరంగా ఉన్న ఎస్పీవై రెడ్డి కూడా సభకు హాజరుకాలేదు. పార్టీకి దూరంగా ఉన్న కొత్తపల్లి గీత వైఎస్సార్‌సీపీ జారీచేసిన విప్ ప్రకారం ఆ పార్టీ ప్రతిపాదించిన సవరణకు అనుకూలంగా ఓటేశారు. ఇక టీడీపీ మొదటి నుంచి బిల్లుకు మద్దతు పలుకగా.. టీఆర్‌ఎస్ తాము బిల్లు మొత్తానికి కాకుండా అంశాలవారీగా మద్దతిచ్చామని పేర్కొంది.
 
 ముందేచెప్పాం: మేకపాటి
 బిల్లును వ్యతిరేకిస్తామని ముందే చెప్పామని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బిల్లుపై ఓటింగ్ జరిగిన అనంతరం ఆయన పార్లమెంటు ఆవరణలో సహచర ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘మొదటి నుంచి చెపుతున్నట్టుగానే ఈ భూసేకరణ బిల్లులో.. నీటి పారుదల వసతులు బాగా ఉండి, బహుళ పంటలు పండే భూములను సేకరించకూడదు అనేది మా వాదన. ఆ విషయాన్నేబిల్లుపై చర్చలో మా పార్టీ తరఫున వైవీ. సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి  చెప్పారు. తర్వాత మా పార్టీ తరఫున వైవీ సుబ్బారెడ్డిగారు సవరణలు ప్రతిపాదించారు. దీనిపై డివిజన్ కూడా అడిగాం.  మేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వానికి మిగిలిన విషయాల్లో సహకరించాం. ఈ ప్రత్యేక విషయంలో మొదటి నుంచి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, మేం వివిధ సందర్భాల్లో  చెప్పినట్టుగానే చర్చలో పాల్గొన్నాం, సవరణలు పెట్టాం. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశాం’ అని మేకపాటి వివరించారు.
 
 ఓవైపు ఖర్చు.. మరోవైపు సేకరణా?: చర్చలో మిథున్‌రెడ్డి
 వ్యవసాయ భూములకు సాగునీరు కల్పించేం దుకు కోట్లు వెచ్చిస్తూనే మరోవైపు వాటినే సేకరించడం ఎంతవరకు సమర్థనీయమని మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. లోక్‌సభలో ఓటింగ్‌కు ముందు బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘వైఎస్సార్‌సీపీ వైఖరిని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. భూసేకరణ చట్టం ఆధారంగా బహుళ పంటలు సాగయ్యే భూములను తీసుకునే విధానానికి మేం వ్యతిరేకం. అలాగే సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం నిబంధన యథాతథంగా ఉండాలని కోరుతున్నాం.
 
 ఈ బిల్లు కారణంగా ఆహార భద్రత ప్రమాదంలో పడటంతో పాటు.. భూములు కోల్పోయే రైతులు, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోతారు. ఏటా కేంద్ర సాధారణ బడ్జెట్‌లో, ఇటు రాష్ట్రాల బడ్జెట్‌లో సాగునీటి వసతి కోసం వేల కోట్లు కేటాయిస్తూనే ఉన్నాం. పంట భూములను సేకరించడం వల్ల మనం పెడుతున్న ఖర్చంతా వృథా కదా. అలాగే సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ అధ్యయనమే ఈ చట్టానికి వెన్నెముక. అలాగే మేం మరో ముఖ్యవిషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా భూసేకరణ విధానం ఒకేలా ఉంటే మంచిది. మేం చెప్పే అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోని పక్షంలో ఈ బిల్లును తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం’ అని పేర్కొన్నారు.
 
 వ్యతిరేకించిన ఎంఐఎం
 భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఎలాంటి కారణం లేకుండా ఈ బిల్లును తెచ్చి కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ప్రపంచంలో ఎక్కడైనా రైతుల భూములు, మత్స్యకారుల భూములు తీసుకుని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టిన దాఖలాలున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం 88,419 ఎకరాలను సేకరించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందని విమర్శించారు.
 
 మద్దతు పలికిన టీడీపీ..
 ఈ బిల్లుకు కేంద్రంలో భాగస్వామి అయిన టీడీపీ మద్దతు పలికింది. చర్చలో ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం మాట్లాడారు. ‘ఈ బిల్లుకు మేం సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం. అయితే దేశంలో చిన్నచిన్న కమతాలు కలిగిన రైతులు వారి భూములతో అనుబంధాన్ని  పెంచుకున్నారు. చాలావరకు వారి పూర్వీకుల నుంచి వచ్చినవే ఆ భూములు. అందువల్ల వీరి సెంటిమెంటును, జీవనోపాధిని గుర్తించాలి. వారి ప్రయోజనాలను కాపాడాలి. అదేసమయంలో ఆర్థికాభివృద్ధిపై కూడా దృష్టిపెట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నాడు’ అన్నారు.

ఆ హత్యతో కడప ఎంపీకి సంబంధ మేంటి?

అసెంబ్లీలో నిలదీసిన విపక్ష నేత జగన్

హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో ఏదో జరిగితే దానితో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముడిపెట్టాలని చూస్తున్నారంటూ విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పక్ష సభ్యులు నోటికొచ్చినట్లు అబద్ధాలాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కొనికమిట్ల మండలం పొట్లూరివారి పల్లికి చెందిన కె.నరసింహారెడ్డి హత్యపై.. కొందరు టీడీపీ సభ్యులు 74వ నిబంధన కింద ఇచ్చిన నోటీసుకు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం వివరణ ఇస్తూ శాసనసభలో ప్రకటన చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 24 మధ్యరాత్రి హత్య జరిగిందని చెప్పారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని, ఈనెల 9న కేసుకు సంబంధించి 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారంటూ పూర్వాపరాలు వివరిం చారు.

‘కొనికమిట్ల గ్రామంలోని 559 ఎకరాల పశువుల పచ్చికబీడు ఈ కేసుకు నే పథ్యం. చట్టరీత్యా వారసులు అందరూ ఈ భూమిని గండ్లూరి వీరప్రతాప్‌రెడ్డి ఎండీగా ఉన్న వీరభద్ర మినరల్స్‌కు విక్రయించారని గుర్తించారు. అయితే 1.4 ఎ కరాలకు సంబంధించి చాగంరెడ్డి పోటిరెడ్డి పేరిట ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాన్ని వానిపెంట తిరుపతయ్య పేరిట మార్చినందుకు భూమి వారసుల్లో ఒకరైన నరసింహారెడ్డి (మృతుడు) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 రాత్రి 9 గంటల ప్రాంతంలో నిందితులు నరసింహారెడ్డిని ఘటనా స్థలానికి తీసుకువచ్చి హత్య చేసి మృతదేహాన్ని వెలుగొండ కాలువలో పడేశారు’ అంటూ ప్రకటన చదివారు. ఈ హత్యకు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సంబంధం ఉందం టూ టీడీపీ సభ్యులు ఆరోపణలు గుప్పించారు. విపక్ష నేత జగన్‌పైనా అధికార పక్షం వ్యక్తిగత ఆరోపణలకు దిగింది. వైఎస్సార్‌సీపీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. హోంమంత్రి బంధువు అవినాష్ తూ.గో. జిల్లాలో సాగిస్తున్న ఆగడాలను ప్రస్తావించారు. వెంటనే స్పీకర్ ఆయన మైక్ కట్ చేశారు. జగన్ జోక్యం చేసుకుని అధికార పక్ష సభ్యుల ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అవినాష్‌రెడ్డికి ముడిపెట్టాలనిచూస్తున్నారు

‘కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మా చిన్నాన్న కుమారుడు. నాకు బంధువు. అవినాష్‌రెడ్డికి బంధువు ప్రతాప్‌రెడ్డి. ఆయనకు బంధువులు ఎవరో..! వారి దగ్గర ఏదో జరిగితే దాన్ని అవినాష్‌రెడ్డికి ముడిపెట్టాలని చూస్తున్నారు. మా ఎంపీ పేరును అసెంబ్లీలో ప్రస్తావనకు తెచ్చారు. అధికారపక్ష సభ్యులు నోటికొచ్చినన్ని అబద్ధాలాడారు. లేనిపోని ఆరోపణలు చేశారు. ఒక్కటే చిన్న ఉదాహరణ చెబుతా. మొన్నామధ్య బాలకృష్ణ.. ఇంటికి వచ్చిన వారిని కాల్చారు..’ అని విపక్ష నేత జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాలకృష్ణ జరిపిన కాల్పులను జగన్ ప్రస్తావించబోవడంతో అధికారపక్షం సభ్యులంతా నిలబడి అభ్యంతరం తెలిపారు. విపక్ష సభ్యులూ తమ స్థానాల్లో నిలబడ్డారు. సభలో గందరగోళం మధ్య అధికార, విపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు.
 
పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు

అధికార పక్షం పచ్చి అబద్ధాలతో ప్రతిపక్షంపై ప్రచారం సాగిస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మరో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం జరిగితే దానికి రాజకీయ రంగు పులిమి ప్రతిపక్ష నేతకు అంటగట్టడం దుర్మార్గమని అన్నారు. నరసింహారెడ్డి హత్యను ఖండిస్తూ.. ఈ ఘటనలో దోషులెవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. అవినాష్‌రెడ్డి మామ వీర ప్రతాప్‌రెడ్డి గత 20 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నారని, ఆయన కుటుంబసభ్యుల పేరిట గత ఏడాది అగస్టు 30, నవంబర్ మధ్య కాలంలో భూములు కొన్న మాట వాస్తవమని అన్నారు.

హత్యకు గురైన నరసింహారెడ్డికి చెందిన పొలాల పక్కన ఆ పొలాలున్నాయని అంత మాత్రాన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బంధువులే హత్య చేశారనడం సరికాదన్నారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన టీడీపీకి సవాల్ విసిరారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువు అవినాష్ పచ్చి మోసగాడని దేశమంతా తెలుసని, అయినా ఇంతవరకు అతనిపై చర్య తీసుకోలేదని విమర్శించారు. కనీసం కేసు నమోదు చేయడానికి చేతులు రావడం లేదని, అతనికి గన్‌మెన్‌ను ఇచ్చారంటే ఉన్నతస్థాయి వ్యక్తుల సహకారం లేనిదే సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు.

ఉద్యోగాల భర్తీపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక  ప్రతినిధులు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Popular Posts

Topics :