15 March 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Ugadi celebrations in YSRCP Central Office Part 2-21st Mar 2015

Written By news on Saturday, March 21, 2015 | 3/21/2015

Ugadi celebrations in YSRCP Central Office Part 1-21st Mar 2015

ఎమ్మెల్యే రోజాపై మాగంటి అసభ్య వ్యాఖ్యలు

కైకలూరు: ఎమ్మెల్యే రోజాపై ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)... మహిళాలోకం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా కైకలూరులో శుక్రవారం జరిగిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామకృష్ణ ఎన్నికల ప్రచార సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతోపాటు మాగంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజాపై ఆయన పత్రికల్లో రాయలేనిరీతిలో అసభ్య పదజాలంతో దూషిం చారు.

ఆయన మాటలు విన్న కైకలూరు టీడీపీ  జెడ్పీటీసీ సభ్యురాలు బి. విజయలక్ష్మి కంగుతిన్నారు. మంత్రి కామినేని సైతం ఆ మాటలు వద్దంటూ వారిం చారు. ఆవేశంలో ఉన్న ఎంపీ మాగంటి...మీరు చెవులు మూసుకోండంటూ జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మికి సలహా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే సభను నడిపించాలనేది తన ఉద్దేశమన్నారు. 

కుప్పంలో రైతుకు అన్యాయo


మాఫీ అన్నారు.. మాయ చేశారు!
మార్చి 28న వేలం వేస్తామని నోటీసు
16న నగలు వేలం వేసేశారు
కుప్పంలో రైతుకు అన్యాయుం

 
కుప్పం: కష్టాల నుంచి బయుటపడేందుకు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణవూఫీ హామీతో తాకట్టుపెట్టిన బంగారు నగలు ఇంటికొస్తాయని ఎంతో ఆశపడ్డారు. రుణవూఫీ జాబితాలో ఉన్నా.. బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా చివరకు బంగారు నగలను వేలం వేసేశారు.. బాధితుల కథనం మేరకు..

కుప్పం పట్టణం జైప్రకాష్‌రోడ్డులో నివాసవుుంటున్న రమేష్ 2012 సంవత్సరంలో చిన్నకురబలపల్లె రెవెన్యూకు సంబంధించిన సర్వేనెంబరు 99/1బీ లోని 23 సెంట్ల భూమితో పాటు నగలను స్థానికంగా ఉన్న ఇండియున్ బ్యాంకులో తాకట్టు పెట్టారు. 25 గ్రావుుల బంగారు నగలపై రుణ ఖాతానెంబర్లు 6066566534, 6062539195 కింద మొత్తం రూ.44 వేల రుణం పొందారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ బ్యాంకు నుంచి నోటీసులు అందారుు. రుణ వ్యవధి కాలం వుుగిసిందని, వెంటనే తీసుకున్న రుణం చెల్లించకుంటే నగలను వేలం వేస్తావుని నోటీసులో పేర్కొన్నారు. దీంతో సంబంధిత ఖాతాదారుడు ఫిబ్రవరి 24న బ్యాంకు అధికారులను సంప్రదించి తీసుకున్న రుణాన్ని రెన్యూవల్ చేసేందుకు నగదు చెల్లించారు.

ఇలా ఉండగా.. వూర్చి 8వ తేదీ వురో నోటీసు అందింది. ఈనెల 28వ తేదీ లోపు రుణం చెల్లించి నగలు విడిపించుకోవాలని, లేకుంటే నగలను వేలం వేస్తావుని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణవూఫీ ద్వారా లబ్ధిదారుడికి రెండు రుణాల కింద  రూ.15 వేలు వూఫీ అరుు్యంది. మిగిలిన రూ.25,599 రుణాలు చెల్లించాలని నోటీసు పంపారు. రెండు రోజుల క్రితం బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే ఈనెల 16వ తేదీనే వేలం వేసేశామని నిర్లక్ష్యంగా సవూధానం చెపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకు అధికారులు పంపిన నోటీసుల్లో వూర్చి 28వ తేదీ గడువుగా పేరొన్నారు. తీరా 16వ తేదీనే వేలం వేశారు. 25 గ్రావుులకు గాను బ్యాంక్ ద్వారా రూ.14 వేలు ఒకటి, రూ. 30 వేలు ఒకటిగా రెండు రుణాలు తీసుకున్నారు. మొత్తానికి రుణవూఫీ జాబితాలో రూ.15 వేల వూఫీ అరుు్యంది. కాగా రెన్యూవల్ కోసం వినియోగదారుడు వడ్డీతో సహా 15 వేలను ఒక రుణానికి చెల్లించారు. అయితే బ్యాంకు అధికారులు నగలను వేలం వేశారు. ఇప్పుడు రుణవూఫీ ద్వారా ఇచ్చిన నగదు, రెన్యూవల్ కోసం కట్టిన డబ్బులు ఏమైందో అధికారులకే తెలియూల్సి  ఉంది. వేలం వేస్తున్నట్టు పత్రికలో ఇచ్చిన ప్రకటనలోనూ తప్పుగా వుుద్రించారు.

రమేష్ పేరిట 60 గ్రావుుల నగలను వేలం వేస్తున్నట్టు అందులో ఉంది. ఇప్పుడు నగలు చేతికందక, రెన్యూవల్ చేసేందుకు అప్పులు చేసిన డబ్బులతో తీవ్రంగా నష్టపోయూవుంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు కలుగుజేసుకుని న్యాయుం చేయూలని బాధితులు కోరుతున్నారు.

ఈ విషయుమై బ్యాంకు మేనేజర్ సంపత్‌ను వివరణ కోరగా ‘‘2012లో  ఆయన నగలు పెట్టి రుణం తీసుకున్నారు.. 2013లోనే నగలు వేలం వేయూల్సి  ఉంది.. ఇప్పుడు వేశాం.. రుణవూఫీ ద్వారా వచ్చే నగదును వారి ఖాతాలోనే జవు చేస్తాం.’’ అన్నారు. 

పెట్రోల్, డీజిల్‌పై ఎక్కడా లేని పన్నులా..?


సీఎంగా పనిచేయండి.. ‘రియల్’ వ్యాపారిగా కాదు!
  • ‘రాజధాని కోసం’ రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను తిరిగి ఇచ్చివేయండి
‘‘రాష్ట్ర రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబుకు మనసు లేకుండా పోయింది. రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంత రైతుల నుంచి బెదిరించి, భయపెట్టి బలవంతంగా భూములు లాక్కున్నారు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడి 9.3 ఫారాలు ఇచ్చిన రైతుల్లో చాలా మంది వాటిని వెనక్కి తీసుకోవాలని భావిస్తోన్న వారికి తక్షణమే 9.3 ఫారాలను అప్పగించాలనని డిమాండ్ చేశారు.

‘‘మూడు పంటలు పండే పచ్చటి పొలాలను రాజధాని కోసం తీసుకోవడం బాధ కలిగిస్తోంది. రాజధాని ప్రాంతంలో ఏ పర్సెంటేజీ ఇచ్చి రైతుల నుంచి భూములను తీసుకున్నారో.. అదే పర్సెంటేజీకి చంద్రబాబు గానీ, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు గానీ విజయవాడ, హైదరాబాద్‌లలో వాళ్ల సొంత భూములు ఇవ్వగలరా..? ఈ పర్సెంటేజీకి మీరు భూములివ్వలేనపుడు రైతుల నుంచి ఎందుకు లాక్కుంటున్నారు? చంద్రబాబూ.. ముఖ్యమంత్రిగా వ్యవహరించాలి. సీఎం చేయాల్సిన పనులు చేయాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దు’’ అని హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
 
‘‘ఆ ప్రాంతంలో చంద్రబాబు చేస్తానంటున్న అభివృద్ధి రోడ్లేసి, కరెంటు ఇచ్చి, నీళ్లివ్వడమే కదా. సాధారణంగా ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారైనా రైతుల నుంచి భూమిని తీసుకున్నా.. ఎకరం భూమి అభివృద్ధికి రూ. 35 లక్షల నుంచి రూ. 40 లక్షలు మాత్రమే ఖర్చు చేస్తారు. రైతులకు 70 శాతం భూమి ఇచ్చి.. తక్కిన 30 శాతం వ్యాపారి తీసుకుంటారు. కానీ ఇవాళ ప్రభుత్వం చేస్తున్నదేమిటంటే 2,200 గజాలు ఇవ్వాల్సిన చోట.. కనీసం వెయ్యి గజాలు కూడా ఇవ్వడం లేదు. ఇదే పర్సేంటేజికీ మీ భూములైతే ఇస్తారా? రాజధాని ప్రాంతంలో దళితులు, గిరిజనులు, బీసీ, మైనారిటీ, పేద, మధ్య తరగతి వారికి ఐదు శాతం భూమిని ఇస్తారట! ఎంత గొప్ప సామాజిక న్యాయం! ఇక మిగిలిందంతా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే కదా చంద్రబాబూ..! రాజధాని నిర్మాణానికి వందేళ్లు పడుతుందని చంద్రబాబు ఓ వైపు చెబుతున్నారు.

అలాంటపుడు.. రైతులకు ఆ ప్రాంతంలో ఇచ్చే వెయ్యి గజాల ధర ఎప్పటికి పెరుగుతుంది? ఇది రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం కాదా? అంతగా రాజధాని అక్కడే కట్టాలనుకుంటే మంగళగిరిలో ఖాళీగా ఉన్న 2,000 నుంచి 3,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీసులు కట్టండి, భవనాలు కట్టండి, మిగిలిన చోట్ల రోడ్లు వేయండి.. జోనింగ్ చేసి వదలి వేయండి. అపుడు రైతులు తమ భూముల్లో వ్యవసాయం చేసుకుంటారో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారో వాళ్లే నిర్ణయించుకుంటారు.

అమెరికా, జపాన్, సింగపూరే కట్టాలనుకుంటే అదే ప్రాంతానికి కేవలం 20 కిలోమీటర్ల దిగువన వినుకొండలో 18 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ కట్టండి.. కానీ ఇలా రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని వారి ఉసురు పోసుకోవద్దు. పరిస్థితులు ఎప్పుడూ ఇలానే ఉండవు.. ఎన్నికలు వస్తాయి.. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి తీసుకున్న భూములను అప్పుడు వారికే తిరిగి ఇచ్చేస్తాం.
 
జాతీయ మీడియాలో మాట్లాడరెందుకు?

విభజన జరిగి పది నెలలు గడిచినా కేంద్రం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని తెలుగు మీడియాతో రెచ్చిపోయి మాట్లాడే చంద్రబాబు.. ఇంగ్లిష్ (జాతీయ) మీడియాతో మాట్లాడరు. పోనీ.. చంద్రబాబుకు ఇంగ్లిష్ రాదా అంటే బాగా వచ్చు. ఎందుకు మాట్లాడరంటే.. ఇంగ్లిష్ మీడియాలో మాట్లాడితే నరేంద్రమోదీకి తెలుస్తుంది.. తనకు నష్టం జరుగుతుందన్నది చంద్రబాబు భయం. అందుకే జాతీయ మీడియాతో చస్తే మాట్లాడనని చంద్రబాబు అంటారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఆర్నెల్లలోగా అమలు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి.. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలు మరి కొన్ని ఉన్నాయి.

వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు దగ్గర నుంచీ గ్రీన్‌ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ ఏర్పాటువరకూ ఎన్నో అమలు చేయాల్సిన హామీలు ఉన్నాయి. ఆ హామీల అమలుకు కలసికట్టుగా పోరాడదాం రండి. మేం చెబుతున్నాం.. ఢిల్లీ వెళ్దాం పదండి.. మీరు మేమూ ఇద్దరం కలిసి వెళ్దాం.. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. పది నెలల్లో ఇప్పటికే మూడు సార్లు మేం ఢిల్లీ వెళ్లాం. ప్రధాని, ఇతర మంత్రులతో అపాయింట్‌మెంట్లు తీసుకుని.. రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రాలు ఇచ్చాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మా వంతు పోరాటం చేస్తాం’’ అని ఆయన చెప్పారు.
 
పెట్రోల్, డీజిల్‌పై ఎక్కడా లేని పన్నులా..?

మేం ఇటీవల అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు పెట్రోల్ డీలర్ల సంఘం తరఫున ఓ వినతిపత్రం మాకు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో మన రాష్ట్రంలో పెట్రోలు, డీజిలుపై అధికంగా పన్నులు వసూలు చేస్తున్నట్లు ఆ వినతిపత్రంలో ఉంది. మన రాష్ట్రంలో పెట్రోల్ లీటరుపై 31 శాతం పన్ను, రూ. 4 వ్యాట్, డీజిల్‌పై 22.25 శాతం పన్ను, రూ. 4 వ్యాట్ వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో వనరులు పెరుగుతున్నాయని చంద్రబాబు చెబుతున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదని అనంతపురం జిల్లా పెట్రోల్ డీలర్ల సంఘం చెప్పింది. 2014 ఫిబ్రవరిలో 3,85,736 లీటర్ల డీజిల్ రాష్ట్రంలో అమ్ముడు పోతే.. 2015 ఫిబ్రవరిలో 2,53,729 లీటర్ల డీజిల్ అమ్ముడుపోవడమే అందుకు తార్కాణం.

ఆదుకుంటామని మోసం చేస్తారా..?


రైతన్న దయనీయ స్థితికి బాబే కారణం
‘‘రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని 2014-15 సామాజిక ఆర్థిక సర్వే తెలియజెబుతోంది. దీనికి కారణం చంద్రబాబే’’ అని జగన్ మండిపడ్డారు. ‘‘ఎన్నికలకు ముందు చంద్ర బాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వేర్వేరుగా టీడీపీ మేనిఫెస్టోలను ప్రకటించారు. వ్యవసాయ రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని.. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని.. జాబు రావాలంటే బాబు రావాలని.. ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతిగా నెలకు రూ. 2 వేల చొప్పున పంపిణీ చేస్తామని హామీలిచ్చారు. కానీ.. ఎన్నికల తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారు’’ అంటూ ఎండగట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

‘‘చంద్రబాబు సంతకంతో కూడిన ఒక లేఖను టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, అందించారు. ‘దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి. అందుకే వ్యవసాయ రుణాల రద్దుపై తొలి సంతకం చేస్తాను. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే అక్కాచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. అందుకే డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దు చేస్తాను. జాబు రావాలంటే బాబు రావాలన్న కాంక్షిస్తోన్న కలలను సాకారం చేయడానికి ఇంటికో ఉద్యోగం - ఉపాధి కల్పిస్తాను. అలా చేయకపోతే నిరుద్యోగ భృతి కింది ఇంటికి నెలకు రూ. రెండు వేలు ఇస్తాం’ అని రాశారు. చంద్రబాబు ఈ లేఖపై సంతకం చేసి ఇచ్చారని, స్వయంగా అందజేయమని మీ ఇంటికి మమ్మల్ని పంపారని టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఆ లేఖలు ఇచ్చి చెప్పారు. ఆ మాటలను ప్రజలు నమ్మి చంద్రబాబును సీఎంను చేశారు. అధికారం వచ్చాక.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే.. చంద్రబాబు అఫిషియల్ గెజిట్ ఈనాడు పేపరుకు.. ప్రభుత్వమే ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చింది. దాంట్లో వ్యవసాయ రుణాల రద్దు, డ్వాక్రా రుణాల రద్దు, ఇంటికో ఉద్యోగం హామీలను ప్రముఖంగా చూపారు.

అపరాధ వడ్డీ భారం
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన అధ్యక్షతన 2014 జూన్ 30న తొలి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం సమావేశం జరిగింది. అది 184వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం. ఇందులో.. 2014 మార్చి 31 నాటికి రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు మొత్తం రూ. 87,612 కోట్లు, డ్వాక్రా రుణాలు రూ. 14,204 కోట్లు ఉన్నట్లు చంద్రబాబుకు బ్యాంకర్లు వివరించారు. అలాగే.. వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని మీరు ఇచ్చిన హామీని అమలు చేస్తారనే ఆలోచనతో రైతులు రుణాలు చెల్లించడానికి, రెన్యువల్ చేయించుకోవడానికి సుముఖంగా లేరని చెప్పారు. రుణాలు చెల్లించకపోవడం వల్ల వారికి పంటల బీమా అందదనీ, సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలకు సంబంధించిన వడ్డీ రాయితీలు కూడా అందవని వివరించారు. మళ్లీ ఆర్నెల్ల తర్వాత చంద్రబాబు అధ్యక్షతన 188వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2014 మార్చి 31 నాటికి రూ. 87,612 కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాలు 2014 సెప్టెంబరు 30 నాటికి తడిసి మోపెడై రూ. 99,555 కోట్లకు చేరుకున్నాయని బాబుకు తెలిపారు. ఇందుకు కారణం ఆ రుణాలపై అపరాధ వడ్డీ భారమే.

రుణ లక్ష్యంలో సగం కూడా ఇవ్వలేదు...
188వ ఎస్‌ఎల్‌బీసీ భేటీలోనే.. అప్పటివవరకూ ప్రతి ఏటా లక్ష్యానికి మించి రుణాలు పంపిణీ చేశామని చంద్రబాబుకు బ్యాంకర్లు గొప్పగా వివరించారు. కానీ.. 2014-15 పరిస్థితి ఏంటంటే.. రూ. 56,019 కోట్లు వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే 2014 సెప్టెంబరు  30 నాటికి కేవలం రూ. 13,789 కోట్లు మాత్రమే పంపిణీ చేశామని తెలియజేశారు. అంటే.. రైతులు రుణాల కోసం బ్యాంకుల గడప తొక్కే పరిస్థితి కూడా లేకపోవటంతో.. రైతులు తక్కిన రూ. 46,000 కోట్లను ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రూ. 2 నుంచి రూ. 3 చొప్పున వడ్డీకి తెచ్చుకున్నారు. సెప్టెంబరు నుంచి ఇప్పటిదాకా ఇచ్చిన రుణాలను కూడా కలుపుకుంటే 2014-15లో ఇచ్చిన వ్యవసాయ రుణాలు రూ. 20 వేల కోట్లకు మించవు.

వడ్డీలకు ఇచ్చింది రూ. 172 కోట్లే!
188వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం పూర్తయిన తర్వాత.. వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ పథకాలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలపాలని కోరుతూ చంద్రబాబుకు బ్యాంకర్లు ఓ లేఖ రాశారు. చంద్రబాబు అధికారంలోకి రాకమునుపు రూ. లక్ష వరకూ వడ్డీ లేని రుణం, రూ. మూడు లక్షల లోపు రుణాన్ని పావలా వడ్డీకే రైతులకు పంపిణీ చేసేవారు. 2014-15లో రూ. 20 వేల కోట్లను వ్యవసాయ రుణాలుగా పంపిణీ చేశారని అనుకుంటే.. నాలుగు శాతం వడ్డీ రాయితీ కింద రైతులకు రూ. 800 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి. పాత రుణాల్లో రెన్యువల్ చేసుకున్న రుణాలు పోను మిగిలిన రూ. 80 వేల కోట్ల వ్యవసాయ రుణానికి 14 శాతం అపరాధ వడ్డీ లెక్క వేస్తే రూ. 11,200 కోట్లు అవుతుంది. అంటే.. రైతులకు రూ. 12,000 కోట్ల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. 2015-16 బడ్జెట్‌లో వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ పథకాలకు రుణ రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం కేవలం రూ. 172 కోట్లు మాత్రమే కేటాయించింది.

ఎక్కడ రూ. 12,000 కోట్లు? ఎక్కడ రూ. 172 కోట్లు? రాష్ట్రంలో 1.17 కోట్ల మంది రైతులు రూ. 99,555 కోట్లను వ్యవసాయ రుణాల రూపంలో బకాయిపడ్డారని.. ఇందులో 49.44 లక్షల ఖాతాల్లోని రూ. 36,000 కోట్ల రుణాల పరిస్థితి చేతులు దాటిపోయిందని చంద్రబాబుకు బ్యాంకర్లు నివేదించారు. రైతులు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారనడానికి ఇంత కంటే ఏం నిదర్శనం కావాలి? ఏ పత్రికలో చూసినా.. ఏ రోజు చూసినా.. బంగారం వేలం నోటీసులు, ప్రకటనలే కనిపిస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ అదే పరిస్థితి. బంగారం తులం రూ. 27 వేలు ఉంది. తులం బంగారంపై.. దాని విలువలో 40 నుంచి 45 శాతం అంటే రూ. 10,000 నుంచి రూ. 13,000 వరకూ బ్యాంకర్లు రుణం ఇస్తారు. రుణం చెల్లించకపోవడం వల్ల అపరాధ వడ్డీ పడుతుండటంతో తడిసిమోపెడవుతోంది. రుణాలు చెల్లించకపోతే బంగారం వేలం వేస్తామని బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగారాన్ని వదులుకోలేక అధిక వడ్డీ అప్పులు చేసి విడిపించుకునే దుస్థితి రైతులది.’’

ముందు ఈ షరతులు, పరిమితులు చెప్పారా?

ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తోందేమిటి? ఎన్నికప్పుడు ఎక్కడైనా పరిమితులు, షరతులు చెప్పారా? కొంత మందికే మాఫీ చేస్తామని గానీ.. కుటుంబంలో ఒకరికే రుణ మాఫీ వర్తింపజేస్తామని గానీ.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పాటిస్తామని గానీ.. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఉన్న వాళ్లకే మాఫీ చేస్తామని గానీ.. ఉద్యానవన పంటలకు వర్తింపజేయమని గానీ.. హైదరాబాద్‌లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ల రుణాలను మాఫీ చేయమని గానీ.. ఐదేళ్లలో మాఫీ చేస్తామనిగానీ ఎక్కడైనా చెప్పారా? హైదరాబాద్‌లోనే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు ఉన్న చంద్రబాబునాయుడు సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని మాత్రం అంటారు.. అదే హైదరాబాద్‌లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ల రుణాలను మాత్రం మాఫీ చేయరట. ఇదెక్కడి న్యాయం?

ఆదుకుంటామని మోసం చేస్తారా..?
2013లో మూడు తుపాన్లు.. పైలాన్, హెలెన్, లెహర్ తుపాన్లు వచ్చాయి. ఓ కరవు వచ్చింది. కరవు దెబ్బకు ఖరీఫ్ పంట మొత్తం పోయింది. ఎన్నికల నేపథ్యంలో రైతుల వద్దకు వెళ్లిన ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు.. ఆదుకుంటాం.. తోడుగా ఉంటాం.. అని హామీ ఇచ్చారు. చంద్రబాబు సైతం ఇదే రీతిలో హామీ ఇచ్చారు. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేటప్పుడు మంత్రి ప్రత్తిపాటి పుల్లరావును 2013 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని మా విశ్వేశ్వరరెడ్డన్న (ఉరవకొండ ఎమ్మెల్యే) అడిగితే.. ఆయన ‘మాకేం సంబంధం.. మేం ఇవ్వం’ అని చెప్పారు. వేరుశనగ, వరి రైతులకు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీలో కేంద్రం వాటాగా 45 శాతం ఇస్తే.. రాష్ట్రం వాటాగా 55 శాతం ఇవ్వాలి. అనంతపురం జిల్లాలో రైతులకు 2010 ఖరీఫ్‌కు రూ. 245 కోట్లు, 2011 ఖరీఫ్‌కు రూ. 398 కోట్లు, 2012 ఖరీఫ్ పంటలకు రూ. 648 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీ చేశారు. 2013 ఖరీఫ్ పంటలకు సంబంధించి అనంతపురం జిల్లా రైతులకే రూ. 643 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాల్సి ఉంది. తన వాటా నిధులను మిగిలించుకోవాలనే కుయుక్తితోనే ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని మంజూరు చేసేది లేదని చెబుతోంది.

చంద్రబాబు అబద్ధాలపై కేస్ స్టడీస్ ఇవీ...

రుణ మాఫీపై చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. రూ. 50 వేల లోపు రుణాలను ఒకేసారి పూర్తిగా మాఫీ చేశామని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీలో బ్యాంకర్లు చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో రూ. 50 వేల లోపు తీసుకున్న వ్యవసాయ రుణాలు ఎన్ని ఉన్నాయో తెలుసా.. సార్ (చంద్రబాబూ)? రూ. 13,280 కోట్లు ఉన్నాయి. రుణ మాఫీకి రైతు సాధికార సంస్థకు 2014-15లో కేటాయించిందే రూ. 5,000 కోట్లు మాత్రమే. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు చెబుతోన్న అబద్ధాలకు సంబంధించిన కొన్ని కేస్ స్టడీస్ ఇవీ..
 
  • అనంతపురం జిల్లా అగళి మండలం ఇనగలూరుకు చెందిన రామన్న రెండెకరాల్లో వేరుశనగ సాగుచేసేందుకు రూ. 15 వేలు అప్పు తీసుకున్నారు. వడ్డీతో కలిపి రూ. 15,788 అయ్యింది. రుణ మాఫీ కింద చంద్రబాబు ఆ రైతుకు ఇచ్చింది రూ. 3,157 మాత్రమే. రూ. 50 వేల లోపు రుణాలు ఒకేసారి ఎక్కడ మాఫీ చేశారో చంద్రబాబు చెప్పాలి.
  • మైలవరం నియోజకవర్గానికి చెందిన సామ్రాజ్యమ్మ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పట్టాదారు పాసుపుస్తకంతో పాటు బంగారు నగలు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. కానీ.. రుణ మాఫీకి ఆమెను అనర్హురాలుగా తేల్చారు.
  • రైతుల ఆత్మహత్యల పరంపర...
  • రైతుల ఆత్మహత్యల విషయమై శాసనసభలో ప్రభుత్వాన్ని మేం నిలదీస్తే.. రైతులు అందరూ సుఖసంతోషాలతో ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోలేదని బుకాయించారు. అదే సభలో మేం చెప్పాం.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తాం.. ఆ కుటుంబాలకు భరోసా కల్పిస్తాం.. అని చెప్పాం. అసెంబ్లీలో ఇచ్చిన మాట మేరకు అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను మేం పరామర్శించాం.
  • అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరుకు చెందిన వన్నూరప్ప అనే రైతు రూ. 1,02,221 వ్యవసాయ రుణంగా తీసుకున్నారు. వ్యవసాయ రుణాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి.. ఆ రైతు రెన్యువల్ చేసుకోలేదు. దాంతో అపరాధ వడ్డీ 14 శాతం పడింది. అప్పుపై వడ్డీ రూ. 14,310 అయ్యింది. రుణ మాఫీ కింద చంద్రబాబు ఆ రైతుకు కేవలం రూ. 8,736 మాత్రమే ఇచ్చారు. అంటే.. వడ్డీ కన్నా రూ. 5,574 తక్కువగా మాఫీ మొత్తం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. దాంతో అప్పు తీర్చే దారితెలియక.. కుటుంబాన్ని పోషించుకోలేక వన్నూరప్ప ఆత్మహత్య చేసుకున్నారు.
  • అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం మరుకుంటపల్లికి చెందిన నాగప్ప రూ. 58,964 బ్యాంకు నుంచి వ్యవసాయ రుణం కింద అప్పు తీసుకున్నారు. చంద్రబాబు హామీని నమ్మి ఆ రైతు రెన్యువల్ చేసుకోలేదు. దాంతో.. ఆ రైతుపై 14 శాతం వడ్డీ పడింది. వడ్డీ రూ. 8,255 అయ్యింది. రుణ మాఫీ కింద చంద్రబాబు ఆ రైతుకు కేవలం రూ. 10,242 ఇచ్చారు. అంటే.. వడ్డీ కన్నా కేవలం రూ. రెండు వేలు మాత్రమే ఎక్కువ. అప్పు తీర్చే మార్గం లేక.. కుటుంబాన్ని పోషించుకోలేక నాగప్ప ఆత్మహత్య చేసుకున్నారు.
  • అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం లోలూరుకు చెందిన గోవిందరెడ్డి రూ. 3,15,034 వ్యవసాయ రుణంగా బ్యాంకులో తీసుకున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి ఆ రైతు రెన్యువల్ చేసుకోలేదు. దాంతో.. 14 శాతం అపరాధ వడ్డీ పడింది. వడ్డీ రూ. 44,104 అయ్యింది. రుణ మాఫీ కింద చంద్రబాబు కేవలం రూ. 20,127 ఇచ్చారు. అంటే.. వడ్డీ కన్నా రూ. 23,977 తక్కువగా ఇచ్చినట్లు వెల్లడవుతోంది.
  • అనంతపురం జిల్లాలో గురువారం అప్పుల ఊబిలో కూరుకుపోయి.. కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితిలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబూ.. టీడీపీ అఫిషియల్ గెజిట్ ‘ఈనాడు’ పత్రికలోనే శుక్రవారం ఈ వార్త ప్రచురితమైంది సార్!

డ్వాక్రా మహిళలకూ టోపీ పెట్టారు
రాష్ట్రంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందన్నది సామాజిక ఆర్థిక సర్వే నివేదికను పరిశీలిస్తే స్పష్టమవుతుందని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘2014 మార్చి 31 నాటికి డ్వాక్రా మహిళలు రూ. 14,204 కోట్లు బ్యాంకులకు బకాయిపడ్డారు. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి అక్కచెల్లెమ్మలు మోసపోయారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణాల్లో రూ. 3,542 కోట్లు నిరర్ధక ఆస్తులు (నాన్ పెర్‌ఫార్మింగ్ అసెట్స్)గా మిగిలిపోయాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2014-15లో డ్వాక్రా మహిళలకు రూ. 13,791 కోట్ల రుణాలను పంపిణీ చేస్తామని 184వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు చంద్రబాబుకు వివరించారు. కానీ.. 2014 సెప్టెంబరు 30 నాటికి డ్వాక్రా మహిళలకు రూ. 2,028 కోట్లు మాత్రమే రుణాలుగా పంపిణీ చేశారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తోంది.

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించిన దాఖలాలు ఎక్కడా కనిపించ లేదు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కోసం.. ఈ ఏడాది రుణంగా పంపిణీ చేసిన రూ. 2,000 కోట్లకు ఏడు శాతం వడ్డీపై రూ. 140 కోట్లు; రూ. 12,000 కోట్ల పాత రుణాలపై 14 శాతం వడ్డీ లెక్క వేస్తే రూ. 1,680 కోట్లు వెరసి కనీసం రూ. 1,820 కోట్లు కేటాయించాలి. కానీ.. వడ్డీ లేని రుణాల కోసం ఒక్క పైసా కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీని అమలు చేయకపోగా కొత్తగా ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ (ఏపీఎంఎస్‌ఎస్)ను ఏర్పాటు చేస్తూ జీవో 18ను జారీచేశారు. ఈ జీవోను లోతుగా పరిశీలిస్తే.. లావాదేవీల్లో ఒక శాతం ఏపీఎంఎస్‌ఎస్ తీసుకోవచ్చుననే నిబంధన పెట్టారు. అంటే.. ఏపీఎంఎస్‌ఎస్ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తారా? డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ఇప్పటికే బ్యాంకులు ఉన్నాయి కదా? మరో కొత్త సంస్థ ఎందుకు? ఒక శాతం కమిషన్ వసూలు చేసుకోవడానికా? డ్వాక్రా మహిళలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన చంద్రబాబుకు.. అక్కచెల్లెమ్మల ఉసురు తగలకుండా పోదు’’ అని ఆయన హెచ్చరించారు.

అది చంద్రన్న కానుకా.. చంద్రన్నకు కానుకా?
సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించింది చంద్రన్న కానుకా? చంద్రన్నకు ఇచ్చిన కానుకా? నిజంగానే సంక్రాంతికి ప్రజలకు కానుక ఇవ్వాలనుకుంటే నిత్యావసర వస్తువులకు టెండర్లు పిలిచి తక్కువ మొత్తం టెండర్లు వేసిన వారికి ఇవ్వాలి. కానీ అధిక ధరలకు నామినేషన్లపై టెండర్లు ఇచ్చారు. కిలో కందిపప్పు అప్పట్లో మార్కెట్‌లో కేజీ ధర రూ. 68 నుంచి రూ. 70 ఉంటే చంద్రన్న కానుకకు రూ. 79.60 ధరకు కొనుగోలు చేశారు. కిలో నెయ్యి ధర అప్పుడు విజయా, ఇతర డైరీల్లో రూ. 325 నుంచి రూ. 375 ఉంటే చంద్రన్న ధర రూ. 499 నుంచి రూ. 575 పెట్టి కొనుగోలు చేశారు. నెయ్యి కొనుగోలుకు సంబంధించి తన కుమారుడు, తన భార్య కంపెనీ హెరిటేజ్‌కే ఏకంగా చెక్కు ఇచ్చేశారు. బెల్లం ధర మార్కెట్‌లో రు. 30 ఉంటే చంద్రన్న ధర రూ. 39! ఈ కానుక అందజేసే సంచుల విషయంలో కూడా అధిక ధరలే చెల్లించారు.

మళ్లీ అవే రోజులు పునరావృతం..


అదే బాబు.. అదే పాలన
  • ఉద్యోగుల్లో అభద్రత.. రైతుల్లో భయం
  • మళ్లీ అవే రోజులు పునరావృతం..
  • ఎవరి మేలు కోసం ఈ బడ్జెట్?
  • రైతుల కోసం కాదు.. డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం కాదు...
  • కాంట్రాక్టర్ల మేలుకే రూపొందించారు
  • యూజర్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలతో వాతలు
  • పెట్రోల్‌పై ఇంత పన్ను ఎక్కడైనా ఉందా?
  • చంద్రబాబు పాలనను, రాష్ట్ర బడ్జెట్‌ను తూర్పారబట్టిన వైఎస్ జగన్

సంక్షోభం ఉంటేనే తనకు చాలా ఇష్టమని చంద్రబాబే చెప్పారు.. అందుకే ఆయన సీఎం అయ్యాక రైతుల్లో, డ్వాక్రా అక్కచెల్లెమ్మల్లో, చదువుకుంటున్న పిల్లల్లో ఫీజుల కోసం, నిరుద్యోగుల్లో ఉద్యోగాల కోసం, అవ్వా తాతల పింఛన్లలో సంక్షోభం పుట్టించారు. గృహనిర్మాణ రంగంలోనూ, చివరకు రాజధాని నిర్మాణంలోనూ సంక్షోభం పుట్టించారు.
 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

‘‘మళ్లీ అదే విజన్, మళ్లీ అవే కన్సల్టెన్సీలు, మళ్లీ అవే దావోస్ ట్రిప్పులు, మళ్లీ అవే జీరో బేస్డ్ బడ్జెట్ మాటలు, మళ్లీ అవే సింగపూర్ పర్యటనలు, మళ్లీ అవే గోబెల్స్.. మళ్లీ అవే రెవెన్యూ డెఫిసిట్లు.. మళ్లీ అదే యూజర్ చార్జీలు, అదే కరెంట్ చార్జీలు, అదే ఆర్‌టీసీ చార్జీల వాతలు.. ఉద్యోగుల్లో అదే అభద్రతాభావం, రైతుల్లో అదే భయం!’’

‘‘ఈ బడ్జెట్ రైతులకు మేలు చేసేదా? డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు, విద్యార్థులకు కూడా మేలు చేసే బడ్జెట్ కూడా కాదు.. నిరుద్యోగ భృతికీ కేటాయింపులు లేవు.. మరి ఎవరికి మేలు చేయడానికి ఈ బడ్జెట్? ఒక్క కాంట్రాక్టర్లకు మాత్రమే మేలు చేసేదే ఈ బడ్జెట్.’’

‘‘సంక్షోభం ఉంటేనే తనకు చాలా ఇష్టమని చంద్రబాబే చెప్పారు.. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రైతుల్లో, డ్వాక్రా అక్క చెల్లెమ్మల్లో, చదువుకుంటున్న పిల్లల్లో ఫీజుల కోసం, నిరుద్యోగుల్లో ఉద్యోగాల కోసం, అవ్వా తాతల పింఛన్లలో సంక్షోభం పుట్టించారు. గృహనిర్మాణ రంగంలోనూ, చివరకు రాజధాని నిర్మాణంలోనూ సంక్షోభం పుట్టించారు.’’

సాక్షి, హైదరాబాద్: ‘‘అదే బాబు.. అవే మాటలు.. చరిత్ర పునరావృతం అవుతోంది! చంద్రబాబు వచ్చారు.. ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.. రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు తన మార్కు పాలనకు తెరతీశారు. నాటి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎలాంటి చేదు అనుభవాలను చవిచూశామో పదేళ్ల తర్వాత ఇప్పుడు అలాంటివే పునరావృతమవుతున్నాయి’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యూజర్ చార్జీలు పెంచారని.. ఈ బడ్జెట్ తర్వాత విద్యుత్ చార్జీలు, ఆర్‌టీసీ చార్జీలు కూడా పెంచుతారని అందరూ భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పెట్రోల్‌పై 31 శాతం పన్ను 4 రూపాయల వ్యాట్, డీజిల్‌పై 22.25 శాతం పన్ను 4 రూపాయల వ్యాట్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు... ఇలా అన్ని వర్గాలను చంద్రబాబు ఎలా మోసం చేస్తున్నదీ సోదాహరణంగా వివరించారు. వాస్తవిక అవసరాలకు బడ్జెట్ కేటాయింపుకు పొంతన లేకపోవడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన నోట నాటి తొమ్మిదేళ్ల పాలనలో వచ్చిన మాటలే ఇపుడూ వస్తున్నాయి.

చరిత్ర పునరావృతమవుతోంది. మళ్లీ విజన్ అంటున్నారు. గతంలో విజన్ 2020 అనేవారు. ఇప్పుడు విజన్ 2029 లేదా విజన్ 2050 అనో అంటున్నారు. మళ్లీ కన్సల్టెన్సీలకు తెరతీశారు. కన్సల్టెన్సీలకు 100 కోట్లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. కాకపోతే కన్సల్టెన్సీల పేర్లు మాత్రమే మారుతున్నాయి. చంద్రబాబు మళ్లీ ప్రతి ఏటా దావోస్ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. చల్లగా ఉంటుంది కాబట్టి స్విట్జర్లాండ్ వెళుతున్నారు. ‘జీరో బేస్డ్’ బడ్జెట్... ‘లెవెల్  ప్లేయింగ్’ అంటూ మళ్లీ అవే మాటలు వినిపిస్తున్నాయి. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమవుతుందనే విధంగా మళ్లీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చూసినపుడు చంద్రబాబు పాలన రాష్ట్రంలో పునరావృతం అయిందన్నది స్పష్టమవుతోంది’’ అని జగన్ తూర్పారబట్టారు. గతంలో చంద్రబాబు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పాలన అంతా రెవెన్యూ లోటుతోనే నడిచిందని.. ఆయన దిగిపోయే నాటికి మైనస్ 21,000 కోట్ల రూపాయల మేరకు రెవెన్యూ లోటు ఉండేదని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పదేళ్లు వరుసగా రెవెన్యూ మిగులు కనిపించిందని వివరించారు. చంద్రబాబు వచ్చారు కనుక ఇపుడు మళ్లీ రెవెన్యూ లోటు ఏర్పడిందని ఎద్దేవా చేశారు.

వ్యవసాయ వృద్ధి రేటు తగ్గిపోయింది..
‘‘వ్యవసాయ, అనుబంధ రంగాల్లోనూ చంద్రబాబు రాగానే వృద్ధిరేటు తగ్గి పోయింది. ఆయన రావడానికి ముందు ఏడాది 7.9 శాతం ఉన్న వృద్ధి రేటు.. ఆయన వచ్చాక 5.9కి పడిపోయింది. రైతులకు బ్యాంకులు రుణాలిచ్చే పరిస్థితి.. కనీసం వాళ్లు బ్యాంకుల్లో అడుగుపెట్టే పరిస్థితి కూడా లేకుండాపోయింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో.. రైతు రుణాల పంపిణీకి నిర్దేశించిన లక్ష్యంలో కనీసం 30 నుంచి 40 శాతం కూడా ఎక్కువ రుణాలు ఇవ్వలేకపోతున్నట్లు అధికారులు చెప్తున్నారు’’ అని జగన్ వివరించారు. ‘‘వరదలు, కరువు వచ్చినా దిక్కు లేదు. రైతులకు పంటల బీమా వచ్చే పరిస్థితి లేదు. ధాన్యం అమ్మాలంటే రైతులు కష్టపడే రోజులొచ్చాయి. వరి ధాన్యం కనీస మద్దతు ధర రూ. 50 మాత్రమే పెంచారు. అప్పటి మాదిరే ఆస్తులు, అప్పుల నిష్పత్తిలో కూడా బాగా తేడా ఏర్పడింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి ముందు 1994లో రాష్ట్రం అస్తులు, అప్పుల నిష్పత్తి 101ః100గా ఉంటే ఆయన దిగిపోయే నాటికి ఆస్తులు, అప్పుల నిష్పత్తి 50ః100కు పడిపోయింది. మళ్లీ గత పదేళ్లలో ఆస్తులు, అప్పుల నిష్పత్తి 105ః100గా ఉంటే, ఇపుడు చంద్రబాబు వచ్చాక ఆస్తుల కన్నా అప్పులు పెరిగాయి’’ అని ఆయన వివరించారు.

హుండీలు.. జెట్ ప్రయాణాలు
ఓ వైపు విచ్చలవిడిగా అవినీతి, మరో వైపు విచ్చలవిడిగా తిరగడం ఇలా జరుగుతోంది చంద్రబాబు పాలన అని జగన్ దుయ్యబట్టారు. ‘‘డబ్బులు లేవని, రాష్ట్రం దివాలా తీసిందని ఓవైపు సచివాలయంలో హుండీలు పెట్టి, వందా, యాభై అందులో వేయండి అని చెబుతారు. మరోవైపు మాత్రం చంద్రన్న ప్రయివేట్ జెట్ విమానాల్లోనే ప్రయాణిస్తారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు తన విమాన ప్రయాణ ఖర్చుల కోసం ఇప్పటికి రూ. 15 కోట్లు ఖర్చు చేశారు. జీవో నంబర్ 30 ద్వారా చంద్రన్న విమాన ఖర్చును విడుదల చేశారు.
చెట్టు కింద నుంచైనా పరిపాలన సాగిస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు.. సచివాలయంలోని తన తాత్కాలిక కార్యాలయానికి మరమ్మతుల కోసం రూ. 20 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక ఇళ్లకు, ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి మరో రూ. 30 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వరకూ ఖర్చు చేశారు’’ అంటూ చంద్రబాబు దుబారాను ఎండగట్టారు. ‘‘యోగా క్లాసులని చెప్పి స్టెప్పులు వేసి, డ్యాన్సులు చేశారు. చూసిన వాళ్లు ఆహా.. చంద్రన్న ఏం స్టెప్పులు వేశారని అన్నారు. తన మంత్రులు, అధికారులు, మేయర్లు, చైర్మన్లకు యోగా నేర్పినందుకు రూ. 2 కోట్లు ఖర్చు చేశారట. నా దగ్గర రూ.1.05 కోట్లకు సంబంధించిన జీవో ఉంది. ఒకవైపు ఉచితంగా యోగా నేర్పించడానికి రాష్ట్రంలో ఎం దరో సిద్ధంగా ఉన్నారు. డబ్బుల్లేవంటూనే రూ.2 కోట్లు యోగాపై పెట్టడం సరైనదేనా?’’ అని ప్రశ్నించారు.

రైతులకు సబ్సిడీ ఇవ్వరట.. కాంట్రాక్టర్లకు ఎక్సెస్ ఇస్తారట...
‘‘ఇంటికో ఉద్యోగం లేకుంటే నిరుద్యోగభృతి ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేశారు. రాష్ట్రంలోని 1.75 కోట్ల ఇళ్లకు ప్రతి నెలా రూ. 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే రూ. 3,500 కోట్లవుతుంది. సంవత్సరానికి రూ. 42,000 కోట్లు కావాలి. ఇందుకు బడ్జెట్‌లో ఎక్కడా నిధులు కేటాయించినట్లు కనబడలేదు’’ అని జగన్ ఎండగట్టారు. ‘‘రాష్ట్రంలో 2013లో సంభవించిన పైలిన్, హెలెన్, లెహెర్ తుపాన్లలో జరిగిన నష్టాలకు సంబంధించి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇమ్మంటే అప్పటి మొత్తం ఇవ్వడానికి మాకేం సంబంధం అని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చెప్పింది. అయితే కాంట్రాక్టర్లకు మాత్రం 2013 సంవత్సరం నుంచి అదనపు (ఎక్సెస్) చెల్లింపులు చేయడానికి జీవో నంబరు 22ను జారీ చేశారు’’ అని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరచి ప్రతిపక్ష వాణిని విని తప్పులను సవరించుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.

శాసనసభలో ప్రజలకు న్యాయం జరగకపోయినా..
మీడియా ద్వారా మేలు జరగాలి...
సాధారణంగా బడ్జెట్‌పై ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా సరే అన్ని అంశాలనూ ప్రస్తావిస్తూ కూలంకషంగా విశ్లేషిస్తూ ప్రసంగించటం ఆనవాయితీ. అయితే.. గురువారం నాడు అసెంబ్లీలో విపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌పై ప్రసంగం ప్రారంభించాక 50 నిమిషాల ప్రసంగంలోనే ఆరేడుసార్లు అడ్డుకోవటం.. ఆ తర్వాత రైతుల సమస్యలను ప్రస్తావించగానే.. మైక్ కత్తిరించివేయటం.. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. అవకాశం ఇవ్వకపోవడం విదితమే. ఈ నేపథ్యంలో.. బడ్జెట్‌పై ప్రజల పక్షాన ప్రతిపక్షం విశ్లేషణను అభ్యంతరాలను జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నాడు మీడియా ఎదుట వివరించారు. అసెంబ్లీలో గురువారం నాడు తాను చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలనూ క్లుప్తంగా ప్రస్తావించారు. ‘‘బడ్జెట్‌లో పెరుగుదల కనిపించకపోవటం, ప్రణాళికేతర వ్యయాన్ని ఇష్టారీతిగా పెంచేసి చూపించటాన్ని, అదే 2015-16 సంవత్సరంలో ఈ ప్రణాళికా వ్యయాన్ని ఏకంగా రూ. 11 వేల కోట్లు ఎలా తగ్గించారు అనేది వివరించాను.
సీఎం కార్యాలయంలోని కోర్ డాష్ బోర్డు సమాచారం ద్వారా మార్చి 16వ తేదీ వరకూ ఉన్న ఖర్చుల వివరాలను బట్టి.. బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లో రూ. 80 వేల కోట్లను దాటే అవకాశం లేదు. కాదంటే రూ. 90 వేల కోట్లను మించి ఉండే అవకాశం లేకపోయినా.. కానీ బడ్జెట్‌ను సవరించిన అంచనాల్లో ఏరకంగా రూ. 1,12,000 కోట్లను చూపించారనేది వివరించటం జరిగింది’’ అని తెలిపారు. ‘‘సభలో ప్రజలకు న్యాయం జరక్కపోయినా.. మీడియా ద్వారా అయినా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొంటూ బడ్జెట్‌పై తన విశ్లేషణను కొనసాగించారు. చివర్లో మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

బోండా, గోరంట్లపై సభాహక్కుల నోటీస్


బోండా, గోరంట్లపై సభాహక్కుల నోటీస్
  • అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత దూషణలతో ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, పాముల పుష్ప శ్రీవాణి, వి.కళావతి, కోటంరెడ్డిశ్రీధర్‌రెడ్డిలతో కలసి ఆమె శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి ఈ నోటీసును అందించారు.

అనంతరం మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఈ నెల 18న పట్టిసీమపై చర్చ జరిగినప్పుడు మంత్రులతోసహా టీడీపీ సభ్యులు ఏవిధంగా అసభ్యకర పదజాలంతో మాట్లాడారో ప్రజలు చూశారని రోజా అన్నారు. ఎమ్మెల్యేలు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, మంత్రులు రావెల కిశోర్‌బాబు, దేవినేని ఉమా, కె.అచ్చెన్నాయుడు, పీతల సుజాత తదితరులు మాట్లాడిన మాటల క్లిప్పింగ్స్ చూస్తే ఏ ఒక్కరోజన్నా ప్రజా సమస్యల గురించి మాట్లాడింది, లేనిదీ బహిర్గతమవుతుందన్నారు.

తమను రెచ్చగొట్టేలా వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడారని, వాళ్లు పదిసార్లు మాట్లాడితే.. ఒకసారి మాట్లాడిన తమను టీవీల్లో చూపించడం దుర్మార్గమన్నారు. తనపై టీడీపీ ఎమ్మెల్యే అనిత ద్వారా గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభాహక్కుల నోటీస్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. హావభావాలను ప్రదర్శించడం బూతు అయితే.. సభలో స్పీకర్ సాక్షిగా ‘ఏంట్రా... అరేయ్ పాతేస్తా... నా కొ...’ అనడం తప్పుగా అనిపించకపోవడం బాధాకరమన్నారు.

టీడీఎల్పీ కార్యాలయంలో మీడియా ముందు ఎడిట్ చేసి ప్రదర్శించిన వీడియో ఫుటేజీ వ్యవహారానికి సంబంధించి చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. స్పీకర్ కు సంబంధం లేకుండా ఎంపిక చేసిన క్లిప్పింగ్స్ మాత్రమే ఎలా బయటికొచ్చాయని ప్రశ్నించారు.

Popular Posts

Topics :