31 May 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ఆర్ సీపీలోకి బొత్స సత్యనారాయణ

Written By news on Saturday, June 6, 2015 | 6/06/2015


వైఎస్ఆర్ సీపీలోకి బొత్స సత్యనారాయణ
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచక్చుకుంటున్నారు. ఆదివారం ఉదయం 8.15 గంటలకు ఆయన పార్టీలో చేరుతారు. హైదరాబాద్ లోటస్ పాండ్ ప్రాంతంలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరుతారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖ పంపిన రెండు రోజుల తర్వాత ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లొచ్చని ఊహాగానాలు వచ్చినా.. ఆయన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎంచుకున్నారు.

విజయనగరం జిల్లాలోను, ఉత్తరాంధ్ర ప్రాంతంలోను పార్టీకి గట్టి నాయకుడిగా.. ఏ అంశం మీదైనా తనదైన శైలిలో అనర్గళంగా వివరించగల వక్తగా బొత్స సత్యనారాయణ పేరొందారు. ఆయన భార్య బొత్స ఝాన్సీలక్ష్మి కూడా ఇంతకుముందు ఎంపీగా పనిచేశారు. తొలుత బొబ్బిలి, తర్వాత విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాలకు ఆమె ప్రాతినిధ్యం వహించారు. బొత్స సత్యనారాయణ గత ఎన్నికల్లో  చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేశారు

నయా జోష్


నయా జోష్
- జగన్ సమర దీక్ష జయప్రదంతో
- వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం
- చంద్రబాబు సర్కారు వైఫల్యాలపై
- ప్రజల్లో సర్వత్రా చర్చ
సాక్షి, విజయవాడ బ్యూరో : 
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరిలో నిర్వహించిన రెండు రోజుల సమర దీక్ష పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపింది. అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోని పాలకులపై వైఎస్ జగన్ సమరశంఖం పూరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రెండు రోజుల దీక్ష విజయవంతం కోసం పది రోజుల నుంచి  పార్టీ కీలక నేతలు చేసిన కృషి ఫలించింది. మంగళగిరి తరలివచ్చిన ప్రజలకే  కాకుండా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రజల ముంగిటకు సమరదీక్ష సంకల్పాన్ని తీసుకెళ్లగలిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి రాష్ట్రం నలుమూలలా పర్యటించి పార్టీశ్రేణులను సమరదీక్ష కోసం సన్నద్ధం చేయగలిగారు.

ఆయన ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలోనే మకాం వేసి రాష్ట్రం అంతటా తిరిగి నియోజకవర్గ సమన్వయకర్తలను, పార్టీ శ్రేణులను కలిసి అందరినీ సమాయత్తం చేశారు. పార్టీ మరో ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ మంగళగిరి వైజంక్షన్ వద్ద స్థలం ఎంపిక నుంచి దీక్ష పూర్తయ్యే వరకు ఏర్పాట్లను చూసి పార్టీ శ్రేణులను సమన్వయం చేశారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)  తమవంతు కృషి చేశారు.   గుంటూరు, కృష్ణా జిల్లాల  నేతలు బాధ్యత తీసుకోవడంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టయింది.

వినూత్న తరహాలో ప్రభుత్వ వైఫల్యాలు
ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించడంలో వైఎస్సార్ సీపీ చేసిన ప్రయత్నం ఫలప్రదమైంది. టీడీపీ ఇచ్చిన వాటిలో వంద హామీలను ప్రస్తావిస్తూ తొలిరోజున విడుదల చేసిన ప్రజా బ్యాలెట్‌కు అపూర్వ స్పందన లభించింది. శిశుపాలుడి నూరు తప్పులను శ్రీకృష్ణుడు సహించిన చందాన ఈ ప్రజా బ్యాలెట్‌తో టీడీపీ సర్కార్ వంద హామీలను ప్రజల్లో చర్చకు పెట్టినట్లయిది. రెండో రోజున ‘రాష్ట్రానికే మోసగాడు’ పేరుతో చంద్రబాబు బూటకపు వాగ్దానాలు, మోసాలను ప్రస్తావిస్తూ ప్రచురించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను జగన్ ఆవిష్కరించారు.

ఇది కూడా చంద్రబాబు ప్రజలను ఎలా దగాచేస్తున్నారో వివరిస్తూ అందరినీ ఆలోచింపజేసింది. వీటితోపాటు చంద్రబాబు ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఎలా మాట మారుస్తున్నారు అనే వివరాలను రెండో రోజు  స్క్రీన్స్‌పై ప్రదర్శించారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా తక్కువ సమయంలోనే జగన్ తన ఉపన్యాసంలో వివరించడం అందరినీ ఆకట్టుకుంది. ఏడాది క్రితం టీడీపీ ప్రభుత్వం మంగళగిరి ప్రాంతంలోనే ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించగా, ఏడాది తరువాత అదే ప్రాంతంలో చరిత్రాత్మక సమర దీక్ష నిర్వహించడంతో వైఎస్సార్‌సీపీ మరింత పట్టు సాధించేందుకు దోహదం చేసింది. 

సీఎం హామీలు నెరవేర్చాలని వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా


సీఎం హామీలు నెరవేర్చాలని వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా
- మదనపల్లెలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
- అడ్డుకునేందుకు పోలీసుల విఫలయత్నం
మదనపల్లె:
 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ  మదనపల్లెలో శుక్రవారం ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ ఏడాది పాలనను నిరసిస్తూ  వైఎస్సార్‌సీపీ నాయకులు స్థానిక టౌన్‌బ్యాంకు సర్కిల్‌లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 300లకు పైగా హామీలు గుప్పించిన చంద్రబాబు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు.

తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ర్ట మంత్రి పీతల సుజాత ఇంట్లో రూ.10 లక్షల డబ్బు దొరికిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అధికారుల బదిలీల్లో  మంత్రులు అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. రాజధాని, పట్టిసీమ పేరుతో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దండుకుని ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనే పని లో ఉన్నారని ఎద్దేవాచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శులు బాబ్‌జాన్, ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అడ్డుకునేందుకు పోలీసుల విఫలయత్నం
మదనపల్లెలో సీఎం దిష్టిబొమ్మను వైఎస్సార్ సీపీ నాయకులు దహనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు అడ్డుకునేందు కు విఫలయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుంటారని ముందే ఊహిం చిన నాయకులు మూడు దిష్టిబొమ్మలను సిద్ధంగా ఉంచుకున్నారు. రెం డింటిని అడ్డుకోగా మరో దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు.

మనోధైర్యం నింపేందుకే షర్మిల పరామర్శయాత్ర

Written By news on Friday, June 5, 2015 | 6/05/2015


మనోధైర్యం నింపేందుకే షర్మిల పరామర్శయాత్ర
యాదగిరిగుట్ట(నల్లగొండ): మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక గుండెపగిలి మృతి చెందిన వారి కుటుంబాల్లో మనోధైర్యం నింపేందుకే  వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శయాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో చేపట్టనున్న పరామర్శ యాత్రకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాల వద్ద ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మృతిని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అనేకమంది కుటుంబాలను పరామర్శిస్తామని గతంలోనే జగన్‌మోహన్‌రెడ్డి నల్లకాలువలో ప్రకటించి సంగతిని గుర్తు చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలను పరామర్శించి, వారిలో మనోధైర్యం నింపేందుకు షర్మిల ఈ యాత్రను చేపట్టారని పేర్కొన్నారు.  ఈ యాత్ర జిల్లాలో 9 నుంచి12వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 9, 10 తేదీల్లో సాగుతుందన్నారు.
 
ఈ యాత్రకు పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. షర్మిల యాత్ర కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన గాదె నిరంజన్‌రెడ్డి, స్టేట్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ సిద్ధార్థ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్న, రాష్ట్ర కార్యదర్శులు కుసుమ కుమార్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, వడ్లోజు వెంకటేశ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూడూరు జైపాల్‌రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.

కేసీఆర్ కాళ్లు పట్టుకుని.. బయటపడాలని చూస్తున్నారు


'కేసీఆర్ కాళ్లు పట్టుకుని.. బయటపడాలని చూస్తున్నారు'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కాళ్లు పట్టుకుని బయటపడాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. బీజేపీ నేతలకు సైతం సమాచారం ఇవ్వకుండా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హైదరాబాద్ కు ఎందుకు వచ్చారని, కేసీఆర్, చంద్రబాబుల మధ్య రాయబారానికా అని అంబటి ప్రశ్నించారు.

తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ముడుపులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కెమెరాల్లో అడ్డంగా దొరికిపోయినా, టీడీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి  పదే పదే బాస్ అంటూ చెప్పిన పేరు చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఈ విషయంపై చంద్రబాబు సూటిగా ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటికైనా తప్పు అంగీకరించాలని అంబటి డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.

మోదీని ఇంగ్లిష్‌లో తిట్టరెందుకు బాబూ..!


కొట్టుకుపోతారు
సమరదీక్ష ముగింపు సభలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్
♦ ఎన్నికలొస్తే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవు
♦ రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, పదేళ్ల ప్రత్యేకహోదా... అప్పట్లో అన్ని టీవీల్లోనూ ఇవే మాటలు
♦ ఈ హామీలన్నీ సమైక్య రాష్ట్రంలో ఇచ్చానని, ఇప్పుడు అమలు సాధ్యం కాదంటున్నారు
♦ అన్నీ అబద్ధాలు... రాష్ట్రాన్ని విడగొట్టాకే ఏపీ, తెలంగాణకు రెండు మేనిఫెస్టోలు విడుదల చేశారు
♦ ఇవ్వాళ భద్రతా సిబ్బంది లేకుండా గ్రామాల్లో తిరిగితే రాళ్లతో కొడతారు

♦ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి లంచమిస్తూ అడ్డంగా దొరికిపోయారు
♦ ఈయనేమో విజయవాడ వచ్చి అవినీతిరహిత రాజ్యం కావాలంటూ ప్రమాణం చేయిస్తారు.. ఇంతకన్నా సిగ్గుమాలిన నాయకుడు ఎవరైనా ఉంటారా?
♦ ప్రత్యేక హోదాపై ఢిల్లీతో పోరాడాలంటే బాబుకు భయం
♦ చంద్రబాబు మెడలు వంచైనా సరే హామీలన్నీ నెరవేర్చేలా చేస్తాం
♦ అప్పటివరకూ ఆయనను నిద్రపోనివ్వం

 
సమరదీక్ష ప్రాంగణం నుంచి  సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఈసారి ఎన్నికలొస్తే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవని, ప్రజల గుండెల్లో నుంచి వచ్చే కోపాగ్ని కెరటం ఉవ్వెత్తున ఎగసి ఆయనను బంగాళాఖాతంలో కలుపుతుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. బాబు నయవంచనకు నిరసనగా మంగళగిరి ‘వై’ జంక్షన్ వద్ద రెండు రోజులపాటు సమరదీక్ష (నిరాహారదీక్ష) చేసిన జగన్ గురువారం తన దీక్షను విరమించారు.

భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, గద్దెనెక్కిన తరువాత ఏరకంగా తుంగలో తొక్కారో ప్రజలందరూ చూస్తున్నారని... వారే బాబుకు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్నికలొస్తే ప్రజల గుండెల్లో ఒక కదలిక వచ్చి... అది కెరటంగా మారి చంద్రబాబును బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే...
 
⇒ చంద్రబాబు ఏడాది కిందట ఏం చెప్పారు?
చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చనందుకు నిరసనగా తణుకులో రెండు రోజులపాటు నిరాహారదీక్ష చేశాను. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున ధర్నాలు చేశాం. విశాఖలో జరిగిన ధర్నాలో నేనే స్వయంగా పాల్గొన్నా. ఇప్పుడు చంద్రబాబు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో ప్రధానంగా ఐదు అంశాలపై రెండు రోజుల పాటు నిరాహారదీక్ష చేశాం.

ఆ రోజుకూ, ఈ రోజుకూ చంద్రబాబు మనసులో వచ్చిన మార్పేమిటి? అనే విషయాలను ఒకసారి మనమంతా తెలుసుకోవాలి. ఒక్కసారి ఏడాది కిందకు వెళదాం. ఆరోజు చంద్రబాబు ఓట్ల కోసం ఏం చెప్పారో మీ ముందున్న పెద్ద టీవీల్లో ఒక్కసారి చూడండి. (అప్పట్లో చంద్రబాబు ఎన్నికల సభల్లో మాట్లాడిన వీడియో దృశ్యాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లపై ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ముగిశాక జగన్  ప్రసంగాన్ని కొనసాగించారు.)
 
⇒ గ్రామాల్లో తిరిగితే ప్రజలు రాళ్లతో కొడతారు
ఎన్నికల సమయంలో ఏ టీవీ పెట్టినా... జాబు కావాలంటే బాబు రావాలనే మాటలే వినిపించేవి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలనే ప్రకటనలు కనిపించేవి. రైతుల మొహంలో చిరునవ్వు కనిపించాలంటే, వారి రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలనే మాట వినిపించేది. ప్రత్యేక హోదా పదేళ్లేం ఖర్మ, పదిహేనేళ్లు కావాలని ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలైపోయి ఇవాల్టికి సంవత్సరం దాటిన తరువాత చంద్రబాబు నోటి నుంచి వస్తున్న మాటలు వేరుగా ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు ఈ హామీలన్నీ సమైక్య రాష్ట్రంగా ఉన్నపుడు ఇచ్చినవని, ఇప్పుడు అమలు చేయడం తనవల్ల కాదని చెప్పారట. ఆయన చెబుతున్నవన్నీ అబద్ధాలే. రాష్ట్రాన్ని విడగొట్టిన తరువాతనే ఆయన ఈ హామీలు ఇచ్చారు. తెలంగాణకు, సీమాంధ్రకు వేర్వేరుగా ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేశారు. ఈ హామీలు ఎలా నెరవేరుస్తారని ఎన్నికల కమిషన్ అడిగితే... తనకు రాష్ట్ర ఆర్థిక వనరులపై పూర్తి అవగాహన ఉందనీ, ప్రతి హామీని నెరవేరుస్తానని లేఖ రాశారు.

ఇపుడు ఎన్నికలైపోయాయి కనుక ప్రజలతో నాకేం పని? రైతులతో నాకేం పని? చేనేత కార్మికులతో నాకేం పని? నిరుద్యోగులతో నాకేం పని? అనుకుంటూ ప్లేటు మార్చారు. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడానికి రోజుకో అబద్ధం ఆడుతున్నారు. ప్రతిరోజూ అబద్ధాలు చెప్పడం, ఆరోపణలుచేయడం ఆయనకు అలవాటైపోయింది. ఎన్నాళ్లు బతికామనేది ముఖ్యంకాదు, ఎలా బతికామన్నది ముఖ్యమని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పేవారు. చంద్రబాబును చూస్తుంటే నిజంగా రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులున్నారా? అని సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. ఇవ్వాళ చంద్రబాబు తన భద్రతా సిబ్బందిని పక్కన బెట్టి గ్రామాల్లో తిరిగితే ప్రజలంతా రాళ్లతో కొడతారు.
 
⇒ ఆయనకన్నా సిగ్గుమాలిన వారుంటారా?
మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలంగాణలో చంద్రబాబు తరపున ఐదు కోట్ల రూపాయలు లంచంగా ఇస్తూ పట్టుబడిన దృశ్యాలను అంతా టీవీల్లో చూసే ఉంటారు. రేవంత్‌రెడ్డి లంచం ఇచ్చేటపుడు... మా బాస్‌తో మాట్లాడిస్తానని చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. ఈ ఐదు కోట్ల రూపాయలు సరిపోకపోతే ఇంకా ఎక్కువ అడిగినా మా బాస్ ఇస్తార ని చెప్పాడు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడంకోసం... ఒక ఎమ్మెల్యేను కొనడానికి ఐదు కోట్ల నగదుతో సిద్ధమయ్యారు.

ఒక్క ఎమ్మెల్సీ గెలవాలంటే 18 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయి. అంటే అంతమంది ఎమ్మెల్యేలను కొనడానికి రూ.90 కోట్లు కావాలి. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చంద్రబాబూ? ఒకవైపు రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు బట్టలు విప్పేస్తుంటే... విజయవాడకు వచ్చిన చంద్రబాబు అక్కడ చదువుకున్న పిల్లలతోసహా వాళ్లనూ, వీళ్లనూ పోగేసి అవినీతి లేని రాజ్యం కావాలంటూ ప్రమాణం చేయించడం విడ్డూరంగా ఉంది. నిండా అవినీతిలో మునిగిన చంద్రబాబు అవినీతిరహిత రాష్ట్రం కావాలని ప్రమాణం చేయిస్తున్నారంటే ఆయనకన్నా సిగ్గుమాలిన వారుంటారా?

⇒ మోదీని ఇంగ్లిష్‌లో తిట్టరెందుకు బాబూ..!
గత సంవత్సర కాలంలో ప్రజలను ఇబ్బందులు పెట్టడం తప్ప చంద్రబాబునాయుడు రాష్ట్రానికి చేసిందేమీలేదు. కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి కనీసం ప్రత్యేక హోదా అయినా తీసుకురావాలని ఎన్నిసార్లు తిట్టినా ప్రయోజనం లేకపోయింది. ఢిల్లీ వాళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని నసుగుతాడేతప్ప... ఢిల్లీ వాళ్లను ఇంగ్లిష్‌లో గాని, హిందీలో గాని తిట్టనే తిట్టడు. ఇంగ్లీషులో తిడితే... మోదీకి వినిపిస్తే... తనను ఇబ్బందులు పెడతాడని ఆయనకు భయం.

ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి మనకు వచ్చే వనరుల్లో గ్రాంట్లు పెరుగుతాయి. కేంద్రం నుంచి పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలకు ఆదాయపుపన్ను రాయితీలు లభిస్తాయి. కార్పొరేట్ పన్ను రాయితీ వస్తుంది. ఎక్సైజ్ డ్యూటీలో రాయితీలు ఇస్తారు. దానివల్ల పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు వస్తాయి. రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబుకు ఇవన్నీ తెలిసినా కానీ ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాటమే చేయడు. ఆయనకు సంబంధించిన ఇద్దరు మంత్రులు మాత్రం కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూనే ఉంటారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనపుడు నీ ఇద్దరు మంత్రులను కేంద్రంలో ఎందుకు కొనసాగిస్తున్నావు చంద్రబాబూ?

⇒ రైతుల భూములు వెనక్కు ఇచ్చేస్తాం
రాజధాని పేరుతో రైతులకు ఇష్టమున్నా లేకపోయినా బలవంతంగా భూములు లాక్కుంటున్నాడు. అయ్యా చంద్రబాబూ... హైదరాబాద్‌లో ఉన్న నీ భూమిని, నీ స్థలాలను ఎవరైనా లాక్కుంటే నీకెలా ఉంటుంది? హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఇల్లు, స్థలాలకు ఏమీ కాకూడదు. కానీ ఇక్కడ రైతులకు ఇష్టం లేకపోయినా మూడు పంటలు పండించే భూములను లాక్కుంటారు. ఈ మాదిరిగా చేసే పరిపాలన ఎక్కువ రోజులు సాగదు. చంద్రబాబు ఆ పదవిలో రెండేళ్లుంటారో, మూడేళ్లుంటారో నాకైతే తెలియదు కానీ, మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. చంద్రబాబు బలవంతంగా లాక్కున్న భూములన్నింటినీ అప్పుడు రైతులకు తిరిగి వెనక్కు ఇచ్చేస్తాం.
    
⇒ హామీలు నెరవేర్చేవరకూ నిద్రపోనివ్వం
చంద్రబాబు ఆరోజు ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టి మోసం చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. గద్దెనెక్కాక రైతుల గురించి పట్టించుకోవడంలేదు, చేనేత కార్మికులను ఆదుకునే పరిస్థితిలేదు, చదువుకున్న పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు. చదువుకున్న పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సంవత్సరం దాటినా పిల్లల చదువులకు సంబంధించిన ఫీజు బకాయిలను చంద్రబాబు ఇంతవరకూ కట్టలేదు.

ఇక్కడికి రావడానికి ముందు ఒక ఇంజినీరింగ్ కళాశాల యజమానితో మాట్లాడా... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వచ్చాయా? అని అడిగా. విద్యాసంవత్సరం పూర్తయినా తమకు రావాల్సిన రూ. 4.15 కోట్లు రాలేదని చెప్పారు. పిల్లలు సర్టిఫికెట్లకోసం వస్తే... ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామనే పరిస్థితి నెలకొని ఉందన్నాడు. ఇలా అన్ని వర్గాలనూ బాధిస్తున్న చంద్రబాబును ఊరికే వదలబోం. ఆయన మెడలు వంచైనా సరే ఎన్నికలపుడు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితిని తీసుకుని వస్తాం. అప్పటివరకూ నిద్రపోనివ్వం.

⇒ సమరదీక్షకు హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు చేపట్టిన సమరదీక్ష ముగింపు సందర్బంగా గురువారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా తరలివచ్చారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్లరామకృష్ణారెడ్డి(ఆర్కే), జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొహహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, ఉప్పులేటి కల్పన, కొడాలి నాని, జలీల్‌ఖాన్, మేకా ప్రతాప్ వెంకట అప్పారావు, కొక్కిలగడ్డ రక్షణనిధి, ఆర్‌కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తిరువీధుల జయరామయ్య, గండికోట శ్రీకాంత్‌రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, గౌరు చరితారెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, దేశాయి తిప్పారెడ్డి, నారాయణస్వామి.

ఎం.సునీల్‌కుమార్, ఎన్.అమరనాథ్‌రెడ్డి, కలమట వెంకటరమణ, విశ్వరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, రావు సుజయకృష్ణ రంగారావు, బూడి ముత్యాలరావు, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, డీసీ గోవిందరెడ్డి, సి.నారాయణరెడ్డి, ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి,కొలుసు పార్ధసారధి, మోపిదేవి వెంకటరమణ, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, లక్ష్మీపార్వతి, విజయచందర్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఆళ్లపేరిరెడ్డి, వల్లభనేని బాలశౌరి, జంగా కృష్ణమూర్తి, బూరగడ్డ వేదవ్యాస్, పేర్ని నాని, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, కాపు రామచంద్రారెడ్డి, అమరనాధ్‌రెడ్డి, పూనూరు గౌతంరెడ్డి, వంగవీటి రాధా, మేరుగ నాగార్జున, తెర్లం బాలరాజు, గుంటూరు, కృష్ణా జిల్లాల అధ్యక్షులు మర్రి రాజశేఖర్, సామినేని ఉదయభానులు పాల్గొన్నారు.
 
ఆకట్టుకున్న నేతల ప్రసంగాలు
సమరదీక్ష వేదికపైనుంచి గురువారం వైఎస్సార్‌సీపీ నేతలు చేసిన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేశాయి. వారు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కార్ తీరును ఎండగడుతూ, బాబు హామీలపై ప్రశ్నలు సంధిస్తూ మాట్లాడినప్పుడు కరతాళధ్వనులు మోగాయి. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు,నెల్లూరు  ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి,ఎమ్మెల్యే ఆర్.కె.రోజా, రాష్ట్రపార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు,  లక్ష్మీపార్వతిలు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.
 
ఆలోచింపజేసిన వీడియోలు
ఎన్నికలకు ముందు పలు సభల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలను సమరదీక్షలో ప్రదర్శించారు. ఆ వీడియోల్లో చంద్రబాబు ఏం మాట్లాడారో ఆ క్లిప్పింగులను, ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ప్రకటనలను యథాతధంగా ప్రదర్శించారు. వీటికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది.
 
బాబు హామీ - 1
అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాం

వ్యవసాయ రుణాలు మొత్తం    :    87,617 కోట్లు
(బాబు అధికారంలోకి వచ్చే నాటికి)
2014 సెప్టెంబర్ నాటికి ఆ రుణాల మొత్తం    :    97,555 కోట్లు
సకాలంలో చెల్లిస్తే రైతులపై పడే వడ్డీ    :    పావలా వడ్డీ
బాబు మాఫీ చేస్తారన్న నమ్మకంతో చెల్లించ కపోవడంతో
రైతులపై పడిన అపరాధ వడ్డీ భారం    :    14 వేల కోట్లు
బాబు చెల్లించింది (తొలి ఏడాది)    :    4,689 కోట్లు (వడ్డీకే సరిపోదు)
బాబు చెల్లించింది (రెండో ఏడాది)    :    2,327 కోట్లు (వడ్డీకే సరిపోదు)
 
బాబు హామీ - 2
అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాం

డ్వాక్రా సంఘాల మొత్తం రుణాలు    :    14,204 కోట్లు
సకాలంలో చెల్లిస్తే పడే వడ్డీ    :    సున్నా
చెల్లించని కారణంగా కాంపౌండ్ ఇంపాక్ట్ పేరుతో వడ్డీ     :    24 శాతం (రూ.2 చొప్పున వడ్డీ)
బాబు చెల్లిస్తారన్న ఉద్దేశంతో సకాలంలో చెల్లించని కారణంగా
పడిన 50 వేల రుణానికి పడిన వడ్డీ    :    12 వేలు
బాబు ఇప్పుడు ఇస్తానంటున్నది (అదీ అప్పుగానే)    :    3 వేల చొప్పున(వడ్డీకే సరిపోదు)
 
బాబు హామీ - 3
ఇంటికో ఉద్యోగం లేదంటే ఒక్కొక్కరికీ2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం
రాష్ట్రంలో ఉన్నకుటుంబాలు మొత్తం    :    1.75 కోట్లు
ఇంటికో ఉద్యోగం    :    ఒక్క ఇంటికీ ఇవ్వలేదు
నిరుద్యోగులకు భృతి    :    ఏ ఒక్కరికీ చెల్లించలేదు

60 వేల అబద్ధాలతో చంద్రబాబు

Written By news on Thursday, June 4, 2015 | 6/04/2015


60 వేల అబద్ధాలతో చంద్రబాబు బతుకు: రోజా
మంగళగిరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేయడానికి ప్రయత్నించారని, ఆయన 60 వేల అబద్ధాలతో బతుకు గడుపుతున్నారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. తనకు ఓటేస్తే డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయని, కుదువలో ఉన్న తాళిబొట్లు ఇంటికి వస్తాయని ఎన్నికల ముందు బాబు ఊదరగొట్టారని.. కానీ ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ వేసి ఉన్న ముక్కుపుడకలు, కమ్మలు కూడా కుదువ పెట్టేలా చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ఆయన 60 వేల అబద్ధాలతో తమ జీవితాలు నాశనం చేశారని మహిళలు ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఒకప్పుడు మహిళలు వస్తుంటే ఆడపడుచులంటూ ఆదరించేవారని, కానీ ఇప్పుడు బ్యాంకులకు వెళ్తుంటే మహిళలను డిఫాల్టర్లుగా అవమానిస్తున్నారని, ఈ పరిస్థితి తెచ్చింది చంద్రబాబు కాదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

డ్వాక్రా గ్రూపులు తానే ప్రారంభించానని చెప్పుకొనే చంద్రబాబు.. పాము తన గుడ్లు తానే తినేసినట్లు డ్వాక్రా గ్రూపులను సర్వనాశనం చేశారని రోజా అన్నారు. మహిళలు పొదుపు చేసుకున్న డబ్బు కూడా వడ్డీలకే కట్టేలా చేస్తున్నారని ఆమె తెలిపారు. వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు అశేష జనం వచ్చి మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు చెబుతూ, చంద్రబాబు కారణంగా మోసపోయిన మీరంతా త్వరగానే మేల్కొన్నారని, సమరానికి సిద్ధమై.. మీకు జరగాల్సిన న్యాయాన్ని పొందాలని ఆమె ఆకాంక్షించారు.

'రాష్ట్రానికి మోసగాడు' బుక్ రిలీజ్

సమరదీక్షను విరమించిన వైఎస్ జగన్


సమరదీక్షను విరమించిన వైఎస్ జగన్
గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళగిరి 'వై' జంక్షన్లో రెండు రోజుల పాటు ఎర్రటి ఎండలో చేసిన 'సమర దీక్ష'ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. బయట తిరగాలంటేనే భయపడేలా ఎండలున్నాయి. వాటిని ఖాతరు చేయలేదు. రెండు రోజుల పాటు దీక్ష జరిగినా కూడా కష్టం అనిపించినా, ఈ ఎండలు తీక్షణంగా ఉన్నా.. అన్నీ పక్కకు నెట్టేసి ఇక్కడికొచ్చి చిక్కటి చిరునవ్వుతోనే ఇంతటి ఆప్యాయతను చూపిస్తున్నారని అన్నారు.

మీ అందరి ఆత్మీయతకు, ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా'  అన్నారు. ఈ సమర దీక్ష కన్నా ముందు విశాఖపట్నంలో ఒక భారీ ధర్నా చేశామన్నారు. అందులో తాను పాల్గొన్నానని, అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా జరిగిందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

చంద్రబాబు ఎన్నికలు జరిగేటప్పుడు అధికారంలోకి రాకముందు ఏం మాటలు చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆరోజుకు, ఇప్పటికి చంద్రబాబు మనసులో వచ్చిన మార్పు ఏంటో తెలుసుకోవాలి. ఒక్కసారి ఎన్నికలు జరిగే సమయానికి, ఒక ఏడాది ముందుకు వెళ్దాం. అప్పుడు చంద్రబాబు ఓట్ల కోసం ఏం చెప్పారో చూద్దాం.

1) రైతుల రుణాలన్నీ నెలరోజుల్లో మాఫీ చేస్తాం
2) డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేసేబాధ్యత టీడీపీ తీసుకుంటుంది
3) ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి
4) పదేళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా

ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలివి. ఆయన ఊరూరా ఇదే మాటలు చెప్పారు. ఏ టీవీ ఆన్ చేసినా వినిపించే మాటలివే. జాబు కావాలంటే బాబు రావాలనేవారు.

ఈరోజు చంద్రబాబు పర్యటన గోదావరి జిల్లాల్లో జరిగింది. అక్కడ, ఈ హామీలన్నీ సమైక్యరాష్ట్రంలో ఇచ్చాను, వాటిని అమలుచేయడం ఇప్పుడు సాధ్యం కాదని ఆయన అన్నారు. ఈ హామీలన్నీ మీరు చూశారు. ఎన్నికలప్పుడు ఇలాగే చంద్రబాబు మీ వద్దకు వచ్చి ఇలాగే అడిగారు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులంతా చేతులు పైకెత్తాలని అడిగారు. బంగారం బ్యాంకుల్లో పెట్టిన ఆడపడుచులు చేతులు పైకెత్తాలన్నారు. చేతులన్నీ పైకి లేచాక.. మీ రుణాలన్నీ నెలలోనే మాఫీ చేస్తామని ఇదే చంద్రబాబు అన్నారు. ఉద్యోగం కోసం పిల్లలు వెతుక్కుంటే, వాళ్లనూ వదిలిపెట్టలేదు. ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తాను, ఇవ్వలేకపోతే 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మన రాష్ట్రంలో రెండు మ్యానిఫెస్టోలు విడుదల చేశారు. ఒకటి తెలంగాణ, మరొకటి సీమాంధ్రకు అన్నారు.
మే నెలలో టీవీ ప్రకటనలు ఇచ్చారు. ఎన్నికల సభలో ఆయన మాట్లాడిన ప్రతి మాటా విన్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి రైతులు, డ్వాక్రా మహిళలు, పిల్లలతో నాకేం పని ఉందని ప్లేటు మారుస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మాట అనేవారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం.. బతికినన్నాళ్లు ఎలా బతికామన్నది ముఖ్యం అనేవారు. ఇదే చంద్రబాబు సెక్యూరిటీని పక్కన పెట్టి ప్రజల్లో తిరిగితే రాళ్లతో కొడతారు. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చడానికి రోజుకో అబద్ధం ఆడుతున్నారు.

మొన్నటికి మొన్న మరొకటి ఆశ్చర్యం అనిపించింది. ఆయన పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీకు టీవీల్లో కనపడి ఉంటారు. 5 కోట్ల లంచం ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించే ఉంటుంది. మా బాస్ తో మాట్లాడిస్తానని ఆయన చెప్పారు. అవి చాలకపోతే ఇంకా ఎక్కువ అడగండి, కావాలంటే మా బాస్ ఇస్తారని కూడా అదే రేవంత్ రెడ్డి చెప్పారు. 5 కోట్ల నగదుతో ఒక తెలంగాణ ఎమ్మెల్యేని కొనేందుకు వెళ్లారు. 18 మంది ఎమ్మెల్యేలను కొనడానికి 90 కోట్లు ఎక్కడినుంచి తెస్తున్నారని అడుగుతున్నాను. చంద్రబాబు సిగ్గన్నది లేకుండా.. పూర్తిగా బట్టలు విప్పేసి తిరుగుతున్నారు. చంద్రబాబు విజయవాడకు వచ్చి, చదువుకుంటున్న పిల్లలను పిలిపించి, అందరితో ప్రమాణాలు చేయించారు. అవినీతి లేని రాజ్యం కావాలని ఆయన ప్రమాణం చేశారట. నిండా అవినీతిలో మునిగిన నువ్వు.. అవినీతి రహిత రాష్ట్రం కావాలని ప్రమాణం చేయిస్తున్నావంటే నీకన్నా సిగ్గు మాలినవాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాం. ఇదే చంద్రబాబు గత సంవత్సర కాలంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదు. కనీసం కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా అయినా తీసుకురమ్మని పోరాడాం. ఆయన్ను ఎన్నిసార్లు తిట్టినా.. ఢిల్లీ వాళ్లు ఇవ్వట్లేదని నసుగుతారు తప్ప వాళ్లను ఇంగ్లీషు, హిందీలలో తిట్టరు. మోదీకి వినపడుతుందన్న భయంతోనే ఆయన కనీసం ఇంగ్లీషులోతిట్టే ధైర్యం చేయరు. తనకు సంబంధించిన మంత్రులు ఇద్దరు కేంద్రంలో ఉంటారు. అయినా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వాళ్లిద్దరినీ ఎందుకు కొనసాగిస్తున్నారని అడుగుతున్నా. ఇవేవీ చంద్రబాబుకు ఎక్కవు.
 
హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఇంటికి, స్థలాలకు ఏమీ కాకూడదు గానీ రైతులకు ఇష్టం లేకపోయినా, 3 పంటలు పండే భూములను లాక్కోడానికి ఆయనకు మనసొస్తుంది. ఎన్నికల హామీలన్నీ చూశాం, రైతుల నుంచి భూములు లాక్కోవడాన్నీ చూశాం. చంద్రబాబు మెడలు వంచైనా సరే ఎన్నికల హామీలు నెరవేర్చే పరిస్థితి తీసుకొస్తాం. ఆరోజు ప్రజల చెవుల్లో కాలిఫ్లవర్లు పెట్టి ముఖ్యమంత్రి సీటు ఎక్కావు. ఇప్పుడు ప్రజలను వాళ్లబాధలు వాళ్లు పడండి అంటూ వదిలేయడం సరికాదని చెబుతున్నా. బలవంతంగా ఇక్కడినుంచి భూములు లాక్కుంటున్నావు. ఈ పాలన ఎక్కువ కాలం సాగదు. రెండేళ్లు ఉంటావో, మూడేళ్లుంటావో తెలియదు గానీ వచ్చేది మళ్లీ మేమే అని గట్టిగా చెబుతున్నా. బలవంతంగా నువ్వు లాక్కున్న భూములను మళ్లీ రైతులకు తిరిగి ఇస్తామని గట్టిగా చెబుతున్నా. చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నా.. ఈసారి ఎన్నికలు వస్తే మాత్రం మీకు డిపాజిట్లు కూడా రావు. పైనుంచి దేవుడు మొట్టికాయలు వేస్తాడు. ప్రజల గుండెల్లో నుంచి ఒక కదలిక, ఒక కెరటం వస్తుంది. ఆ కెరటం ఉవ్వెత్తున పైకి లేచి నిన్ను బంగాళాఖాతంలో కలుపుతుంది.

చాలామంది మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలు, ఆయన చెప్పిన మాటలు, ఏడాది తర్వాత ఆయనమీద చేస్తున్న పోరాటాలు.. అన్నీ చెబుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజి పెట్టిన ఓ యజమానిని అడిగాను.. ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిలు వచ్చాయా అన్నా.. 4.5 కోట్ల బకాయిలు ఏడాది నుంచి రావాలని చెప్పారు. పిల్లలు సర్టిఫికెట్ల కోసం వస్తే, కాలేజి యాజమాన్యం ఆ ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పే పరిస్థితి ఉంది. ఏడాది నుంచి పిల్లల ఫీజుల బకాయిలు కూడా కట్టలేదు. చంద్రబాబును నిద్రపోనివ్వమని గట్టిగా చెబుతున్నాను. ఈ పోరాటాన్ని గట్టిగా కొనసాగిస్తాను. సంఘీభావం చూపించి మీ ఆత్మీయత చూపించినందుకు పేరుపేరునా ప్రతి ఒక్కరికీ మరొక్కసారి చేతులు జోడించి, శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.

ఇదీ మా అల్లుడు 'బాబు' ఘనచరిత్ర


ఇదీ మా అల్లుడు 'బాబు' ఘనచరిత్ర
గుంటూరు: అల్లుడి ఘన చరిత్ర తెలియాలంటే.. అత్తనే అడగాలని వైఎస్ఆర్ సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు నాయుడికి సంబంధించిన పలురహస్యాలను ఆమె 'సమర దీక్ష' వేదికగా ఆమె బయటపెట్టారు. 10 లక్షలు తీసుకుని ఎన్టీ రామారావు కూతురిని పెళ్లి చేసుకుని అల్లుడైపోయాడని ఆమె చెప్పారు. ఒకటో తరగతిలో ఉండగానే పక్కన పిల్లాడి దగ్గర బలపం కొట్టేశాడని, అప్పుడు వాళ్ల టీచర్ కొట్టారని ఆమె తెలిపారు.
కేజీ బేసిన్ లో ఓఎన్జీసీ ద్వారా గ్యాస్ నిక్షేపాలు బయటపడినప్పుడు రిలయన్స్ తో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 34 వేల కోట్ల ఒప్పందం చేసుకున్నాడని లక్ష్మీపార్వతి వెల్లడించారు. దీంట్లో 30 వేల కోట్లు మోదీకి పంపాలి, 4 వేల కోట్లు ఉంచుకుంటానన్నాడు. కానీ చివరికి 4 వేలకోట్లు గుజరాత్ కి పంపి, 30 వేలకోట్లు తను ఉంచుకున్నాడని చెప్పారు. అల్లుడు చరిత్ర అత్తకే కదా తెలిసేది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమర దీక్ష రెండోరోజున చంద్రబాబుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. వెధవా నువ్వు చేస్తున్నది పనికిమాలిన పని అని టీచర్లు గానీ, తల్లి గానీ ఎవరో ఒక్కరైనా చెప్పి ఉంటే రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం పట్టి ఉండేది కాదు అని చంద్రబాబుపై లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

ఆమె ఇంకా ఏమన్నారంటే..

''ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పని రహస్యాలు నాకు తెలుసు. వీడు ఒకటో క్లాసు చదువుకునేటప్పుడే పక్క పిల్లల బలపాలు కాజేసి టీచర్ దగ్గర దెబ్బలు తిన్నాడు. కాలేజీకి వచ్చాక క్లాస్ మేట్ల జేబుల్లో డబ్బులు కాజేసి రెండుసార్లు పోలీసు స్టేషన్లకు వెళ్లాడు. తర్వాత ఎన్టీఆర్ 10 లక్షలిస్తే.. కూతురిని పెళ్లి చేసుకుని అల్లుడైపోయాడు.

ఈ వేదిక మీద ఆకలి కేకలున్నాయి.. ఆ వేదిక మీద అధికార కాంక్షలున్నాయి. ఈ వేదిక మీద సింహం ఉంది. అక్కడేమో నక్కలున్నాయి. మా అల్లుడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. చాలా బాధపడుతున్నాను.. ఇంత మొద్దోడు అనుకోలేదు. ప్రజాబ్యాలెట్ లో వందకి సున్నా మార్కులు తెచ్చుకున్నవాడిని చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నాకైతే, రెండు మొట్టికాయలు మొట్టి వెధవా.. బాగా చదువు అని చెప్పాలనిపిస్తోంది. చంద్రబాబుకు జరిగిన అవమానానికి సంతాపం తెలియజేస్తున్నాను. మనవడైనా గట్టివాడు ఉంటాడేమో అనుకుంటే.. అబ్బిగాడికి అబ్బిగాడే పుడతాడని తేలింది. ఒబామాతో ఫొటో దిగడానికి 6 లక్షలు ఖర్చుపెట్టాడు. మా మనవడు లోకేశ్.. ఒబామాకే స్మార్ట్ సిటీలు ఎలా ఉండాలో చెప్పాడని బిల్డప్పిచ్చారు. తండ్రికి తగ్గ కొడుకే పుట్టాడని అప్పుడు అనుకున్నాను.''

9 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర


9 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
* నల్లగొండ జిల్లాలో 17 కుటుంబాలకు పరామర్శ
* 509 కిలోమీటర్ల మేర యాత్ర
* వైఎస్సార్‌సీపీ నేత శివకుమార్
సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన సోదరి షర్మిల రెండో విడత పరామర్శ యాత్రను ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు.

ఈ మేరకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ బుధవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. 9న భువనగిరి నియోజకవర్గం బీబీనగర్‌లో యాత్ర ప్రారంభమై.. 12న మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌లో ముగుస్తుందని చెప్పారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 509 కి.మీ. మేర యాత్ర సాగుతుందన్నారు.
17 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారన్నారు. మహానేత వైఎస్సార్ మరణం తట్టుకోలేక నల్లగొండ జిల్లాలో 49 మంది చనిపోయారని, అందులో 32 కుటుంబాలను గతంలోనే ఆమె పరామర్శించారని చెప్పారు. తాజా యాత్ర రోడ్‌మ్యాప్ పూర్తయిందన్నారు. పార్టీ యంత్రాంగంతోపాటు ప్రజలందరూ ఈ యాత్రలో పాల్గొనాలని కోరారు. త్వరలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కూడా పరామర్శ యాత్ర ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముజ్‌తబా అహ్మద్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్ పాల్గొన్నారు.
 

Popular Posts

Topics :