
♦ వైఎస్సార్ స్మారక గార్డెన్ను ఆవిష్కరించిన షర్మిల
♦ మూడోరోజు ఆరు కుటుంబాలకు పరామర్శ
♦ నేడు ఏడు కుటుంబాలకు ఓదార్పు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : దివంగత మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత సోదరి షర్మిల పరామర్శ యాత్రకు జిల్లాలో భారీ స్పందన వచ్చింది. నర్సంపేట నియోజకవర్గంలో వేల మంది జనం పరామర్శ యాత్రకు తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి షర్మిల నర్సంపేటలో వైఎస్సార్ స్మారక గార్డెన్ను ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సంపేట వీధుల నిండా జనం పోగయ్యారు. షర్మిల వచ్చే సమయంలో చేతులు ఊపుతూ పలకరించారు. అందరి వైపు చూస్తూ, నవ్వుతో పలకరిస్తూ షర్మిల ముందుకు సాగారు.
మహానేత వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించే ప్రక్రియలో భాగంగా షర్మిల బుధవారం గూడూరు మండల కేంద్రంలో మొదలైన పరామర్శ యాత్ర నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం, కొత్తగూడ, దుగ్గొండి మండలాల్లో జరిగింది. షర్మిల ఆరు కుటుంబాలను పరామర్శించారు. షర్మిలకు అన్ని గ్రామాల్లోనూ స్థానికులు ఘన స్వాగతం పలికారు. రాజశేఖరరెడ్డి తనయను చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూశారు. దగ్గరికి వచ్చి చేతులు కలిపేందుకు పోటీ పడ్డారు.
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ షర్మిల పరామర్శ యాత్ర సాగించారు. వృద్ధులు, పిల్లలు కనిపించగానే అప్యాయంగా వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. నర్సంపేట, నెక్కొండలో వాహనాల భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామ మహిళలు రోడ్డు నిండా ముగ్గులు వేసి షర్మిలను ఆహ్వానించారు.
అప్యాయంగా..
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక చనిపోరుున వారి కుటుంబాలను పరామర్శించే క్రమంలో షర్మిల ప్రతి కుటుంబంలో అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గూడూరు నుంచి వెళ్లే దారిలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేశారు. నెక్కొండ మండలం వెంకటాపురంలో సూరం ఐలయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మంచిరోజులు వస్తాయని ఐలయ్య భార్యకు భరోసా కల్పించారు. అక్కడి నుంచి దీక్షకుంట్లకు చేరుకున్నారు. గ్రామంలోని బేతం చంద్రయ్య ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం ఇదే గ్రామంలోని కొమ్ముల మల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
దీక్షకుంట్ల నుంచి చెన్నారావుపేట మండలం జీజీఆర్పల్లి సమీపంలోని మామిళ్లపల్లిలో బూస నర్సయ్య భార్య కోమలను ఓదార్చారు. మంచిరోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం దట్టమైన అటవీ ప్రాంతంలోని కొత్తగూడ మండలం ఓటాయితండాకు వెళ్లారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలే చనిపోయిన బానోత్ మంగిళి కుటుంబానికి భరోసా కల్పించారు. గిరిజన తండాకు వెళ్లినప్పుడు షర్మిలను వారు డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. మూడోరోజు యాత్రలో చివరగా దుగ్గొండి మండలం మహ్మదాపురంలో మిట్టపెల్లి సంజీవ ఇంటికి వెళ్లారు. సంజీవ తల్లి సారమ్మను ఓదార్చారు. సారమ్మకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గురువారం ఏడు కుటుంబాలు
పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బంధంపల్లిలో ఎల్లాపురం కొంరమ్మ కుటుంబాన్ని ఓదార్చుతారు. అక్కడి నుంచి పరకాల నియోజకర్గం ఆత్మకూరు మండలం పెద్దాపురంలో వేల్పుల వీరాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం పత్తిపాకలో బోయిన నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. అనంతరం రేగొండ మండలం కోనారావుపేటలోని తిప్పారపు మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
తర్వాత ఇదే మండలంలోని సుల్తాన్పూర్లో గజవెల్లి వెంకట్రాజం కుటుంబాన్ని ఓదార్చుతారు. అక్కడి నుంచి కనిపర్తికి చేరుకుని పల్లెబోయిన ఓదెలు కుటుంబాన్ని పరామర్శిస్తారు. నాలుగో రోజు చివరగా పరకాల మండలం కామారెడ్డిపల్లెలోని కొయ్యడ రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. గురువారం జరిగే గురువారం పరామర్శ యాత్ర దూరం 107 కిలో మీటర్లు సాగనుంది.
జనయాత్రలో నేతలు
నర్సంపేట: జిల్లాలో మూడో రోజు షర్మిల పరామర్శ యాత్రలో ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుధవారం జరిగిన యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర యువజన అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్రెడ్డి, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు ఆదం విజయ్కుమార్, రాష్ట్ర కార్యదర్శులు గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, విలియం మునిగాల, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నాడెం శాంతికుమార్, షర్మిల సంపత్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎ.మహిపాల్రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు ఎం.కళ్యాణ్రాజ్, ప్రచార కమిటీ అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, వరంగల్సిటీ అధ్యక్షుడు కాగిత రాజ్కుమార్ యాదవ్, జిల్లా నాయకులు సంగాల ఇర్మియా, ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, ఖమ్మం జిల్లా నాయకులు కె.నరేందర్రెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి,నరసింహరావు, జిల్లా యువజన నాయకులు ఎం.సుమిత్గుప్తా, వరంగల్ జిల్లా ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ బి.రవితేజరెడ్డి, ఖమ్మం జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.
♦ మూడోరోజు ఆరు కుటుంబాలకు పరామర్శ
♦ నేడు ఏడు కుటుంబాలకు ఓదార్పు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : దివంగత మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత సోదరి షర్మిల పరామర్శ యాత్రకు జిల్లాలో భారీ స్పందన వచ్చింది. నర్సంపేట నియోజకవర్గంలో వేల మంది జనం పరామర్శ యాత్రకు తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి షర్మిల నర్సంపేటలో వైఎస్సార్ స్మారక గార్డెన్ను ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సంపేట వీధుల నిండా జనం పోగయ్యారు. షర్మిల వచ్చే సమయంలో చేతులు ఊపుతూ పలకరించారు. అందరి వైపు చూస్తూ, నవ్వుతో పలకరిస్తూ షర్మిల ముందుకు సాగారు.
మహానేత వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించే ప్రక్రియలో భాగంగా షర్మిల బుధవారం గూడూరు మండల కేంద్రంలో మొదలైన పరామర్శ యాత్ర నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం, కొత్తగూడ, దుగ్గొండి మండలాల్లో జరిగింది. షర్మిల ఆరు కుటుంబాలను పరామర్శించారు. షర్మిలకు అన్ని గ్రామాల్లోనూ స్థానికులు ఘన స్వాగతం పలికారు. రాజశేఖరరెడ్డి తనయను చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూశారు. దగ్గరికి వచ్చి చేతులు కలిపేందుకు పోటీ పడ్డారు.
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ షర్మిల పరామర్శ యాత్ర సాగించారు. వృద్ధులు, పిల్లలు కనిపించగానే అప్యాయంగా వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. నర్సంపేట, నెక్కొండలో వాహనాల భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామ మహిళలు రోడ్డు నిండా ముగ్గులు వేసి షర్మిలను ఆహ్వానించారు.
అప్యాయంగా..
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక చనిపోరుున వారి కుటుంబాలను పరామర్శించే క్రమంలో షర్మిల ప్రతి కుటుంబంలో అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గూడూరు నుంచి వెళ్లే దారిలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేశారు. నెక్కొండ మండలం వెంకటాపురంలో సూరం ఐలయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మంచిరోజులు వస్తాయని ఐలయ్య భార్యకు భరోసా కల్పించారు. అక్కడి నుంచి దీక్షకుంట్లకు చేరుకున్నారు. గ్రామంలోని బేతం చంద్రయ్య ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం ఇదే గ్రామంలోని కొమ్ముల మల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
దీక్షకుంట్ల నుంచి చెన్నారావుపేట మండలం జీజీఆర్పల్లి సమీపంలోని మామిళ్లపల్లిలో బూస నర్సయ్య భార్య కోమలను ఓదార్చారు. మంచిరోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం దట్టమైన అటవీ ప్రాంతంలోని కొత్తగూడ మండలం ఓటాయితండాకు వెళ్లారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలే చనిపోయిన బానోత్ మంగిళి కుటుంబానికి భరోసా కల్పించారు. గిరిజన తండాకు వెళ్లినప్పుడు షర్మిలను వారు డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. మూడోరోజు యాత్రలో చివరగా దుగ్గొండి మండలం మహ్మదాపురంలో మిట్టపెల్లి సంజీవ ఇంటికి వెళ్లారు. సంజీవ తల్లి సారమ్మను ఓదార్చారు. సారమ్మకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గురువారం ఏడు కుటుంబాలు
పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బంధంపల్లిలో ఎల్లాపురం కొంరమ్మ కుటుంబాన్ని ఓదార్చుతారు. అక్కడి నుంచి పరకాల నియోజకర్గం ఆత్మకూరు మండలం పెద్దాపురంలో వేల్పుల వీరాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం పత్తిపాకలో బోయిన నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. అనంతరం రేగొండ మండలం కోనారావుపేటలోని తిప్పారపు మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
తర్వాత ఇదే మండలంలోని సుల్తాన్పూర్లో గజవెల్లి వెంకట్రాజం కుటుంబాన్ని ఓదార్చుతారు. అక్కడి నుంచి కనిపర్తికి చేరుకుని పల్లెబోయిన ఓదెలు కుటుంబాన్ని పరామర్శిస్తారు. నాలుగో రోజు చివరగా పరకాల మండలం కామారెడ్డిపల్లెలోని కొయ్యడ రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. గురువారం జరిగే గురువారం పరామర్శ యాత్ర దూరం 107 కిలో మీటర్లు సాగనుంది.
జనయాత్రలో నేతలు
నర్సంపేట: జిల్లాలో మూడో రోజు షర్మిల పరామర్శ యాత్రలో ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుధవారం జరిగిన యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర యువజన అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్రెడ్డి, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు ఆదం విజయ్కుమార్, రాష్ట్ర కార్యదర్శులు గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, విలియం మునిగాల, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నాడెం శాంతికుమార్, షర్మిల సంపత్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎ.మహిపాల్రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు ఎం.కళ్యాణ్రాజ్, ప్రచార కమిటీ అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, వరంగల్సిటీ అధ్యక్షుడు కాగిత రాజ్కుమార్ యాదవ్, జిల్లా నాయకులు సంగాల ఇర్మియా, ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, ఖమ్మం జిల్లా నాయకులు కె.నరేందర్రెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి,నరసింహరావు, జిల్లా యువజన నాయకులు ఎం.సుమిత్గుప్తా, వరంగల్ జిల్లా ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ బి.రవితేజరెడ్డి, ఖమ్మం జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.