20 September 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఆయనకు సింగపూర్ తో సంబంధమేమిటి?

Written By news on Saturday, September 26, 2015 | 9/26/2015


ఆయనకు సింగపూర్ తో సంబంధమేమిటి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ నేత అనంత వెంకటామిరెడ్డి మండిపడ్డారు. ఏపీ రాజధానిని సింగపూర్ వ్యాపారవేత్తలకు అప్పగిస్తున్న చంద్రబాబు నిజ స్వరూపం బట్టబయలైందని విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో అనంత వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ  ఆయనో గోముఖ వ్యాఘ్రమని ఘాటుగా విమర్శించారు. 
రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు పెట్టలేదని అనంత వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం ప్రారంభిస్తే సింగపూర్ కంపెనీలు రావని భయమా?అని నిలదీశారు. చంద్రబాబుకు సింగపూర్ కు మధ్య ఉన్న సంబంధమేంటో బయటపెట్టాలని వెంకటామిరెడ్డి డిమాండ్ చేశారు.

పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శించిన పొంగులేటి

అశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని వైఎస్సార్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సందర్శించారు. రైతు పక్షాన నిలబడి పామాయిల్ రైతుల డిమాండ్లపై సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పామాయిల్ గెలల ధరల పెంపుపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో మాట్లాడుతానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

దీక్షకు కోర్టు అనుమతి కోరుతాం


దీక్షకు కోర్టు అనుమతి కోరుతాం
 ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టేందుకు సోమవారం హైకోర్టును అనుమతి కోరతామని పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష విషయంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయన ఇంట్లో కూడా దీక్ష చేసుకోనీయరని, అడ్డుకుంటారని అర్థమైపోయింది.

సీఎం పంథా మాకు తెలిసిన తర్వాత నిరాహార దీక్షను ఆపకూడదు.. చేయాలన్న ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించాం. అయితే హౌస్‌మోషన్ రూపంలో కాకుండా సాధారణ పనిదినాల్లో పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. సోమవారం తిరిగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం. కోర్టులో తమకు అనుకూలమైన నిర్ణయం వస్తుందని నమ్ముతున్నాం’ అని పెద్దిరెడ్డి చెప్పారు. ‘గతంలో చంద్రబాబు ఢిల్లీలో ఒకసారి, హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మరోసారి.. రెండుసార్లు నిరాహార దీక్షలు చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు సీఎం జయలలిత కావేరి జలాలను రాష్ట్రానికి సాధించుకోవడానికి నిరాహార దీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకొని జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టదలచిన దీక్షను అడ్డుకోవడం దురదృష్టకరమని’ పెద్దిరెడ్డి అన్నారు.
 
ఏది ప్రయోజనం?: ‘రాష్ట్రానికి కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందని టీడీపీ నేతలు ప్రకటనలతో హడావుడి చేశారు. గతంలో ఏడు వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చిన మాదిరే రూ.350 కోట్లు, రాజధాని, పోలవరం నిర్మాణాలకు మరికొంత.. మొత్తం కలిపి రూ.వెయ్యి కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేక హోదా ఎక్కడ? ఈ వెయ్యి కోట్ల ప్రకటన ఎక్కడ? ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లింది ఇందుకేనా? కేంద్రమంత్రులందరినీ కలిశారు. దేని కోసమో అర్థం కావడం లేదు.

ఆయన పార్టీ ఎమ్మెల్యే, చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసుల నుంచి బయటపడడం కోసం అందరినీ కలుస్తున్నారా? లేక ప్రత్యేక హోదా కోసం కలిసారా? అన్నదానిపై ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై యూనివర్సిటీలో జరిగిన సదస్సులో పాల్గొన్నారని ఒక ప్రొఫెసర్‌పై చర్య తీసుకుంటున్నారు. ఇవన్ని చూస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చంద్రబాబే అడ్డుపడుతున్నారు’ అని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు.
 
భయంతోనే అనుమతి నిరాకరణ
వైఎస్ జగన్ దీక్షపై చంద్రబాబు ఢిల్లీలో మాట్లాడిన మాటలు చూస్తే.. ఆయనకు ఎంత భయం పట్టుకుందో అర్థమవుతుందని పెద్దిరెడ్డి అన్నారు. దీక్ష జరిగితే, ప్రత్యేక హోదా వస్తుంది.. వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి, రాష్ట్రానికీ మంచి జరుగుతుంది. అయినా ఆయన దీక్షను అడ్డుకోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాహార దీక్షల విషయంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు వింటే.. గతంలో ఆయన రెండు పూటలు తిని ఒక పూట దీక్షలు చేశారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

ధర్మయుద్ధానికి మద్దతివ్వండి


ధర్మయుద్ధానికి మద్దతివ్వండి
న్యాయవాదుల సమావేశంలో  వైఎస్సార్ సీపీ నేతల పిలుపు

 పట్నంబజారు(గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అధర్మ యుద్ధాన్ని అడ్డుకోవటం కోసం జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ధర్మ పోరాటానికి న్యాయవాదులంతా మద్దతుగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. హిట్లర్ పాలనను గురించి వినటమే తప్ప  చూడలేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయనకు ప్రతిరూపమని నిప్పులు చెరిగారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ లీగల్ విభాగం సమావేశం జరిగింది. సమావేశానికి లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైఎస్ జగన్ చేపడుతున్న నిరవధిక దీక్షను అడ్డుకోవటం కోసం చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ దీక్ష  రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా జరుగుతుందనే పోలీసులను అడ్డంపెట్టుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

జగన్ దీక్షకు అండగా నిలిచి అవసరమైతే న్యాయపోరాటానికి న్యాయవాదులంతా సిద్ధంగా ఉండాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ బాబా రాందేవ్, అన్నాహజారేలతో పాటు ఎంతోమంది దీక్షలు చేశారని, ప్రాణానికి ప్రమాదం లేనంత వరకు దీక్షలు చేసుకునే అవకాశం ఉందని  సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ విధానాలను అడ్డుకునేందుకు న్యాయపోరాటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని చెప్పారు.

సమావేశంలో పలు విభాగాల నేతలు ఎలికా శ్రీకాంత్‌యాదవ్, శిఖా బెనర్జీ, దేవళ్ల రేవతి, బండారు సాయిబాబు, కొత్తా చిన్నపరెడ్డి, మొగిలి మధు, అంగడి శ్రీనివాసరావు, దేవరాజ్, పానుగంటి చైతన్య, మేరువ నర్సిరెడ్డి, న్యాయవాదులు వరదాయిని, కారసాని కోటిరెడ్డి, జి.విజయ్, బోడపాటి కిషోర్, బి.కిరణ్, రత్నశేఖర్, వి.కేశవరావు, సుబ్బారావు, జె.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష 6లేదా 7 నుంచి


ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష 6లేదా 7 నుంచి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన ‘ప్రత్యేక హోదా’ సాధన కోసం అక్టోబర్ 6 లేదా 7వ తేదీన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్షకు కూర్చునే అవకాశం ఉంది. ఈ మేరకు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టు సూచనల నేపథ్యంలో శనివారం నుంచి ప్రారంభించ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసుకున్న పార్టీ నాయకత్వం తదుపరి ఎప్పటి నుంచి చేపట్టాలన్న అంశంపై సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఈమేరకు ఒకటి, రెండు రోజుల్లో ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌తో గుంటూరు ఉల్ఫ్‌హాల్ గ్రౌండ్‌లో తలపెట్టిన దీక్షకు అనుమతి నిరాకరించడంతోపాటు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. దీంతో ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ నేతలు హైకోర్టు తలుపు తట్టారు. నిరవధిక దీక్షకు పోలీసులు అనుమతినివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

దీక్షకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి గురువారమే పిటిషన్ దాఖలు చేసి హౌస్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారించాలని కోరారు. హౌస్‌మోషన్‌పై హైకోర్టు రిజిస్ట్రీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే దృష్టికి తీసుకెళ్లింది. గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో... శుక్రవారం మరోసారి ఆ పిటిషన్‌ను ఆయన దృష్టికి తీసుకెళ్లింది.

హైకోర్టుకు వరుస సెలవు దినాలు కావడం, సంబంధిత సబ్జెక్ట్(హోం) చూసే న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో సాధారణ పనిదినాల్లో పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి రిజిస్ట్రీ వర్గాలు తెలిపాయి. హైకోర్టు సూచన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై పార్టీ సీనియర్లు శుక్రవారం సాయంత్రం సమావేశమై చర్చించారు. అక్టోబర్ తొలివారంలో తిరిగి దీక్షను ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు, ప్రధానంగా 6, 7 తేదీల్లో ఏదో ఒక రోజు దీక్షను ప్రారంభించాలన్న అభిప్రాయానికి వచ్చారు.
 
రాజకీయ కారణాలతోనే నిరాకరణ...
రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ తలపెట్టిన నిరవధిక దీక్షకు రాజకీయ కారణాలతోనే గుంటూరు పోలీసులు అనుమతిని నిరాకరించారని మర్రి రాజశేఖర్, అప్పిరెడ్డి తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. మొదట జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో, అంబేద్కర్ విగ్రహం(లాడ్జి సెంటర్), హిందూ కాలేజీ సెంటర్ ఈ మూడు చోట్లలో ఏదో ఒక చోట దీక్షకు అనుమతినివ్వాలని కోరామని, అందుకు పోలీసులు నిరాకరించారన్నారు.

ఈ నేపథ్యంలోనే తాము ఉల్ఫ్ హాల్ గ్రౌండ్‌ను ఎంపిక చేసుకుని అనుమతి కోరినా, దానికీ నిరాకరించారన్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో చంద్రబాబు రాష్ట్ర విభజనకు నిరసనగా ధర్నా చేస్తే అందుకు పోలీసులు అనుమతినిచ్చారన్నారు. ఇప్పుడు కేవలం రాజకీయ కారణాలతోనే దీక్షకు అనుమతిని నిరాకరించారని పిటిషన్‌లో తెలిపారు. హైకోర్టు సూచనలను పరిగణలోకి తీసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు దీక్షను తిరిగి ఏ రోజు నుంచి ప్రారంభించాలన్న అంశంపై సమాలోచనలు జరిపారు.
 
ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ...
అనేక పోరాటాలు నిర్వహించినా, ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడాన్ని నిరసిస్తూ తానే స్వయంగా నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈనెల 26 నుంచి గుంటూరు కేంద్రంగా నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించడమే కాకుండా ఈ నెల 12వ తేదీనే పోలీసుల అనుమతి కోరారు. ప్రభుత్వ స్థలాల్లో ఎలా నిర్వహిస్తారంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో నగరంలోని ఏసీ కాలేజీ ఉల్ఫ్‌హాల్ స్థలాన్ని ఎంపిక చేసి మరోసారి అనుమతి కోరారు. అలా కోరిన రెండు గంటల్లోనే వివిధ కారణాలు చూపిస్తూ దీక్షకు అనుమతి నిరాకరించారు.
 
ఆది నుంచీ అన్ని వేదికల్లోనూ పోరాటం...
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అన్ని వేదికల్లోనూ పోరాటం సాగిస్తోంది. ఎన్నికల అనంతరం తొలిరోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం విన్నవించింది. ఆ తర్వాత మంగళగిరిలో దీక్ష చేపట్టింది. వైఎస్ జగన్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీలో ఆగస్టు 29న ఒకరోజు ధర్నా చేసి ప్రత్యేక హోదా ఆకాంక్షను జాతీయ స్థాయిలో చాటిచెప్పారు. అదే రోజు మార్చ్ టూ పార్లమెంట్ నిర్వహించారు.

‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో ఆగస్టు 29న రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా విఫలం చేసేందుకు చంద్రబాబు అనేక కుయుక్తులు ప్రదర్శించినప్పటికీ విజయవంతమైంది. వైఎస్ జగన్ పదేపదే చేసిన డిమాండ్ మేరకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఈ నెల ఒకటిన ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించింది.

ఇదే క్రమంలో విద్యార్థులు, యువత.. తమకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ప్రత్యేక హోదాతోనే సాధ్యమని వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న తిరుపతి, 22న విశాఖలో యువభేరి సదస్సులు నిర్వహించారు. ఆ సదస్సులకూ ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. చివరకు సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ పైనా నిబంధనలకు విరుద్ధంగా చర్యలకు ఉపక్రమించింది. నిర్బంధాలతో అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విద్యార్థులు, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొని తమ ఆకాంక్షను వ్యక్తంచేసి విజయవంతం చేశారు.

వైఎస్ జగన్ దీక్ష వాయిదా

Written By news on Friday, September 25, 2015 | 9/25/2015

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 నుంచి గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్ష వాయిదా పడింది. దీక్ష వాయిదా విషయాన్ని వైఎస్ఆర్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. హైకోర్టు తీర్పు వచ్చాక వైఎస్ జగన్ దీక్ష తదుపరి తేదీలను ప్రకటిస్తామని ఆయన శుక్రవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు.

వైఎస్ జగన్ దీక్షకు అనుమతి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీ దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్ను శుక్రవారం హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.  హౌస్మోషన్ పిటిషన్ కాకుండా రెగ్యులర్ పద్దతిలో రావాలని హైకోర్టు సూచించినట్టు పెద్దిరెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ దీక్ష అనుమతి కోసం సోమవారం మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని,  వైఎస్ జగన్ దీక్షకు హైకోర్టు అనుమతి ఇస్తుందని, తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు పెద్దిరెడ్డి చెప్పారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు  వైఎస్ జగన్ దీక్ష వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్ దీక్షను అడ్డుకున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు రెండుసార్లు దీక్షలు చేయలేదా అని ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో జయలలిత కావేరి జలాల కోసం దీక్ష చేశారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా ఏపీకి ప్రత్యేక హోదా కోసం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు.

అహంకారంతో, ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారు

చంద్రబాబు అహంకారంతోను, గర్వంతోను, ఫ్రస్టేషన్లోను మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం, పోలీసులతో అణిచేయాలని చూస్తున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అహంభావం నెత్తికెక్కి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. మీరు ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారని, ప్రత్యేక హోదా సాధించడం మీ వల్ల కాకపోతే సమస్యను పరిష్కరించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తానని వైఎస్ జగన్ ముందుకొచ్చారని అంబటి అన్నారు.

ఆ దీక్షకు అనుమతి ఇవ్వబోమని ఓవైపు ముఖ్యమంత్రి చెబుతున్నారని.. కానీ పోలీసు శాఖ మాత్రం వేరే గ్రౌండులో పెట్టుకుంటే అనుమతి ఇస్తామని చెబుతోందని, ఈ ద్వంద్వవైఖరి ఏంటని నిలదీశారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబుకు మతి భ్రమించిందేమో అనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైనంత మాత్రాన మీరు చెప్పిందే చట్టమా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా రైతుల సమస్యల మీద నిరాహార దీక్ష చేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించిందని గుర్తు చేశారు. అన్నా హజారే కూడా వివిధ కారణాల కోసం నిరాహార దీక్షలు చేస్తున్నారని, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండి కూడా దీక్షలు చేశారని, అప్పుడేమీ అభ్యంతరం లేదు గానీ జగన్ దీక్ష చేస్తానంటే అభ్యంతరం వచ్చిందా అని అంబటి రాంబాబు విమర్శించారు.

ఇష్టం వచ్చినట్లు అణిచేయాలని చూస్తే మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. మీరు ఈ రాష్ట్రానికి శాశ్వత సీఎం కాదని.. ధర్మంగా, న్యాయంగా ఆలోచించాలని అన్నారు. చట్టబద్ధంగా నిరాహార చేస్తుంటే ఇన్ని ఇబ్బందులు పెడతారా అని ప్రశ్నించారు. వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్తుంటే ఆంక్షలు, ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్తుంటే ఆంక్షలు పెడతారా అని మండిపడ్డారు. అదే ఆంధ్రా యూనివర్సిటీలో టీడీపీ మెంబర్ షిప్ డ్రైవ్ చేశారు, లోకేష్ బర్త్ డే వేడుకలు చేశారని.. అవి రాజకీయాలు కావు గానీ.. ప్రత్యేక హోదాపై సదస్సు పెడితే రాజకీయమా అని ఆయన ప్రశ్నించారు.

అక్టోబర్ మూడు నుంచి మూడు రోజులపాటు పరామర్శ యాత్ర


వస్తున్నా.. మీ కోసం
3న మహానేత తనయ షర్మిల రాక
- మూడు రోజులు పరామర్శ యాత్ర
- తొమ్మిది మండలాలు.. 1,100 కిలోమీటర్లు
- 10 కుటుంబాలకు ఆత్మీయ పలకరింపు
- విజయవంతం చేయండి
- వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్
ఆదిలాబాద్ అర్బన్ :
 దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధితనే జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అక్టోబర్ 3న జిల్లాకు రానున్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి అకాల మరణా న్ని తట్టుకోలేక తనువు చాలించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. గురువారం ఆదిలాబాద్ ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ మరణా న్ని తట్టుకోలేక మరణించిన వారి కు టుంబాలను పరామర్శిస్తానని వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకా రం ఆయన సోదరి వస్తున్నట్లు తెలిపా రు. అక్టోబర్ మూడు నుంచి మూడు రోజులపాటు పరామర్శ యాత్ర సాగుతుందని చెప్పారు. 10 కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ని తొమ్మిది మండలాల్లో 1,100 కిలోమీటర్లకుపైగా యాత్ర కొనసాగుతుందని వివరించారు.

ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. అక్టోబర్ 3న మధ్యాహ్నం నిర్మల్‌కు చేరుకుంటారని అన్నా రు. నిర్మల్ నియోజకవర్గంలోని దిలావర్‌పూర్, ముథోల్ మండలం అవర్‌గాం, బోథ్ మండలం బజార్‌హత్నూర్, ఖానాపూర్ మండలం సత్తెనపల్లి, తాటిగూడ, కడెం మండలం లింగాపూర్, కాసిపేట మండలం దేవాపూర్, వేమనపల్లి మండలం లక్ష్మిపూర్, కాగజ్‌నగర్ మండ లం చింతగూడ, జన్నారం మండల కేంద్రంలో పరామర్శయాత్ర కొనసాగుతుందని వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు, ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.సికిందర్, కార్యదర్శి మేస్రం శంకర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎం.గంగన్న, యూత్ జిల్లా అధ్యక్షుడు తిలక్‌రావు, తొడసం నాగోరావు, సయ్యద్ సలీం, సాదుల్లా పాల్గొన్నారు.

వైఎస్ జగన్ దీక్ష ఆగదు


వైఎస్ జగన్ దీక్ష ఆగదు
* వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ
* ఉల్ఫ్ హాలు గ్రౌండ్‌లో దీక్షకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్
* శుక్రవారం సాయంత్రానికి అనుమతి వస్తుందని విశ్వాసం
 

సాక్షి, విజయవాడ బ్యూరో/ గుంటూరు:  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ పరిశీలకుడు బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. 26వ తేదీ ఉదయం నుంచి గుంటూరు ఉల్ఫ్ హాలు గ్రౌండ్‌లోనే దీక్ష చేపడతారని స్పష్టం చేశారు. గురువారం ఉదయం గుంటూరు ఐజీ ఎన్.సంజయ్‌తో చర్చలు జరిపిన తర్వాత, అనంతరం సాయంత్రం గుంటూరు దీక్షా ప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఉల్ఫ్ హాలు గ్రౌండులో దీక్షకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ వేశామని శుక్రవారం సాయంత్రానికి అనుమతి వస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. జగన్ దీక్షకు సంబంధించి తాము గతంలోనే మూడు ప్రాంతాలను పోలీసులకు తెలియజేశామని, వాటిని నిరాకరించడంతో ప్రైవేటు యాజమాన్యానికి చెందిన ఉల్ఫ్‌హాలు గ్రౌండ్‌ను అద్దెకు తీసుకున్నామని చెప్పారు.

 అయితే ప్రభుత్వ ఒత్తిడి మేరకు పోలీసులు అక్కడ దీక్షకు అనుమతులు నిరాకరించడం దారుణమన్నారు. హోదా వచ్చే వరకూ పోరాటం చేస్తామని, చంద్రబాబు గుండెల్లో నిద్రపోతామని బొత్స హెచ్చరించారు. హోదాకోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి ఆ పనిచేయకపోగా, రాష్ట్ర భవిష్యత్తుకోసం జగన్‌మోహన్‌రెడ్డి చేస్తుంటే దాన్ని ఆపాలని చూస్తున్నాడని ఆరోపించారు.  నిరవధిక దీక్షపై బాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. పొట్టిశ్రీరాములు నిరవధిక దీక్ష చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఉండేదా? అని ప్రశ్నించారు. హోదా అనేది భావితరాల భవిష్యత్ కోసమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని తెలిపారు. హోదా కోసం ఇతర ప్రజా సంఘాలను కలుపుకుని ఆందోళనలు చే పడతామని ఆయన వెల్లడించారు.

ఐజీతో జరిగిన చర్చల్లో పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, కొడాలి నాని,  మాజీ మంత్రులు కొలుసు పార్థసారధి, మోపిదేవి వెంకటరమణ, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, తాడికొండ, తెనాలి, వినుకొండ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు హెనీ క్రిస్టినా, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు.

రుణమాఫీ ఒకేదశలో చేసిన నేత వైఎస్సార్

Written By news on Thursday, September 24, 2015 | 9/24/2015





కరీంనగర్ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లాలో చేపట్టిన తొలివిడత పరామర్శయాత్ర గురువారం సాయంత్రం ముగిసింది. 3 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భాగంగా 6 నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించి 12 కుటుంబాలను పరామర్శించారు. జిల్లాలోని మల్లాపూర్ లో తుకారంగౌడ్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రైతుల రుణమొత్తాలను ఒకేదశలో మాఫీ చేసిన ఘనత వైఎస్సార్దేనని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు మహానేత పెద్దపీట వేశారని, ప్రతి ఎకరాకు నీరిచ్చి అన్నపూర్ణ రాష్ట్రంగా చేసేందుకు వైఎస్సార్ కృషిచేశారని షర్మిల గుర్తుచేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పాలనలోనే 46 లక్షల ఇళ్లను నిర్మించిన ఘనత వైఎస్సార్ సొంతమన్నారు. వైఎస్సార్ బతికుంటే ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు, ఉచిత విద్య, రైతులకు 9 గంటలు కరెంట్ అందేదని అన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చుకునేందుకు చేయిచేయి కలిపి రాజన్న రాజ్యాన్ని సాధించుకుందామని షర్మిల పిలుపునిచ్చారు. మల్లాపూర్లో వెంకటేశం కుటుంబాన్ని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి, రూ. 5వేల ఆర్ధిక సాయం అందించారు.

అధికారం ఉన్నా... లేకున్నా వైఎస్సార్ ప్రజల పక్షాన...


వైఎస్సార్ ఎవరెస్టు
కరీంనగర్ పరామర్శ యాత్రలో  షర్మిల
తెలుగు జాతి ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో వైఎస్
వైఎస్ ఆశయ సాధనకు చేయి చేయి కలుపుదాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దివంగత మహానేత వైఎస్సార్ ఎవరెస్టు శిఖరంలాంటి వారని, ఆయనకు మరణం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ప్రజల గుండెలపై వైఎస్ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి బుధవారం షర్మిల కరీంనగర్ జిల్లాలోని మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండోరోజు పరామర్శ యాత్ర కొనసాగించారు.

ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలికి భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. అధికారం ఉన్నా... లేకున్నా వైఎస్సార్ ప్రజల పక్షాన నిలబడ్డారని, అందుకే వారి గుండెల్లో రాజన్నగా బతికి ఉన్నారన్నారు. ‘‘వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలు కావొద్దని రుణమాఫీ చేసి ఆదుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించి అండగా నిలబడ్డారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారు.

అందుకే వైఎస్సార్ మరణించి ఇంతకాలమైనా ప్రజ లు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు..’’ అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను, ఆయన సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం చేయి చేయి కలిపి ముందుకు సాగుదామని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
అన్నల కోటలో.. కాటారం, మహాదేవపూర్, కమాన్‌పూర్ అడవుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, వరంగల్ జిల్లా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున అటవీ ప్రాంతంలోని కుటుంబాలను ఒకే చోటకు పిలిచి పరామర్శించాలని వరంగల్ డీఐజీ చేసిన సూచనను షర్మిల సున్నితంగా తిరస్కరించారు. అలా చేస్తే పరామర్శకు అర్థం ఏముంటుందన్నా అంటూ యాత్రకు పయనమయ్యారు.

దట్టమైన అటవీ మార్గం మీదుగా కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ మడక సుశీల కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అదే మండలం విలాసాగర్‌లోని మంచినీళ్ల కొమురమ్మ కుటుంబీకులను కలిశారు. తర్వాత కమాన్‌పూర్ మండలం కేకే నగర్‌లో చిలకాని హన్మంతు, సుల్తానాబాద్ మండలం చిన కల్వల గ్రామంలో కుంభం వెంకటలక్ష్మి, చొప్పదండి మండలం వెదురుగట్టులో మడ్డి రామస్వామి, ధర్మారం మండలం నర్సింహులపల్లిలో కునుకుంట్ల రాయమల్లు కుటుంబాలను పరామర్శించారు.

పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ నగేష్, బీష్వ రవీందర్, బోయినపల్లి శ్రీనివాసరావు, సెగ్గం రాజేష్, అక్కినపెల్లి కుమార్, సందమల్ల నరేష్, గోవర్ధన శాస్త్రి, సింగిరెడ్డి ఇందిర,  జిల్లా నాయకులు రాజమ్మ, పద్మ, ఎస్‌కే ముస్తాక్, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
 
అమ్మా... మీ ఇల్లే నా తల్లిగారిల్లు!
తల్లిదండ్రులు లేని ఆ ఆడబిడ్డకు వైఎస్ కుటుంబమే తల్లిగారి ఇల్లు అయింది. ఏ తోడు లేని ఆ నిరుపేదకు వైఎస్ ఇల్లు కట్టిస్తే... పెళ్లీడుకొచ్చిన ఆ యువతికి జగన్ డబ్బు పంపి పెళ్లి చేయించారు. ఇప్పుడు నిండు గర్భిణిగా ఉన్న ఆమె ఇంటికి షర్మిల వెళ్లారు. కాటారం మండలం విలాసాగర్‌కు చెందిన మంచినీళ్ల కొమురమ్మ కూతురు కొమురమ్మ. ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ దశలో ఉండగా.. వైఎస్ హఠాన్మరణంతో తల్లి కొమురమ్మ గుండెపోటుతో చనిపోయారు.  

ఇంటి నిర్మాణం ఆగిపోయింది. మరోవైపు ఆమె కూతురు పెళ్లీడుకు వచ్చింది. పెళ్లి కష్టమనుకున్న సమయంలో జగన్ రూ.లక్ష చెక్కు పంపారు. ఈ డబ్బుతోనే ఊరివాళ్లంతా కలిసి ఆమెకు పెళ్లి చేశారు. ఇంటికి రేకులు తెచ్చి పైకప్పు వేశారు. ఇప్పుడు ఆమె 8 నెలల గర్భవతి. తమ ఇంటికి వచ్చి షర్మిల కొంత డబ్బు చేతిలో పెట్టగానే కొమురమ్మ ఉద్వేగానికి గురైంది. ‘‘అమ్మా.. మా నాయిన నాకు ఏమీయ్యలే.. మీ నాయినే నాకు ఇల్లు కట్టిచ్చిండు, పెళ్లి కాదనుకున్న నాకు జగనన్న డబ్బు ఇచ్చి పెళ్లి చేసిండు. ఇప్పుడు మీరు నా ఇంటికొచ్చి కాన్పుకు సాయమైనరు. తల్లిదండ్రులు లేని నాకు మీ ఇల్లే.. నా తల్లిగారిల్లమ్మా’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ ఏముందిలే వీళ్లు పేదోళ్లు! ఎవరికి చెప్పు కోగలరు?


చెంపలు టపటపా వాయించాలి
‘తల్లి కావడం ఏ తల్లికి ఆనందాన్నివ్వదు చెప్పండి? రెండోసారి గర్భవతినయ్యానని తెలిశాక చాలా సంతోష పడ్డాను. పెద్దాడికి తోడుగా దేవుడు ఇంకో బిడ్డను పంపిస్తున్నాడని సంబరపడ్డాను. ఎంత కష్టమైనా సరే ఇద్దరు పిల్లల్ని బాగా పెంచాలని ఆరాటపడ్డాను. కానీ పొత్తిళ్లలోనే రెండో పిల్లాడు పోవడం.. ఆ బాధ... పగవాడికి కూడా వద్దు. దాన్నుంచి ఇప్పటికీ కోలుకోలేక పోతున్నాం.  కళ్లు మూసినా తెరిచినా వాడే కనిపిస్తున్నాడు.  తట్టుకోలేక ఏదైనా చేసుకుందామని కూడా ప్రయత్నించా. నా భర్త పరిస్థితి కూడా అలాగే ఉంది.

ఇలా జరిగేదా?
 పిల్లోడిని బతికించుకోవాలనే ఆశతోనే గుంటూరు ఆసుపత్రికెళ్లాం.  డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది. డాక్టర్లు, నర్సులు పట్టించుకొని ఉంటే ఇలా జరిగేదా? ‘ఆ ఏముందిలే వీళ్లు పేదోళ్లు! ఎవరికి చెప్పు కోగలరు? వీళ్ల మాటలు విని మమ్మల్ని ఎవరేం చేయగలరు’  అనే నిర్లక్ష్యంతోనే మా పిల్లాడిని చంపేశారు.

ఆదివారం రాత్రి (ఆగస్ట్ 23) ఎడమ చేయి అయిదు వేళ్లు, కుడిచేయి రెండు వేళ్లను ఎలుకలు కొరికాయి. ఆ రాత్రి ట్రీట్‌మెంట్ లేదు. సోమవారం ఉదయం డాక్టర్‌ను అడిగా - ‘మా బాబును మాకు ఇచ్చేయండి... బయట చూపించుకుంటాం’ అని. దానికి డాక్టర్ ఒకటే చెప్పారు... ‘బాబు చనిపోయే వరకు ఇంక్యుబేటర్ నుంచి తీయం మేం!’ అని. తర్వాత  సిస్టర్‌కు మందు ఇమ్మని చెప్పి వెళ్లిపోయారు. సిస్టర్ ‘‘అంత జాగ్రత్త వున్నదానివి... ఇలాంటి పిల్లాడిని ఎలా కన్నావే’’ అని వెటకారాలాడింది. ‘‘పెద్దబాబు బాగానే ఉన్నాడుగా... ఈ బాబు మీద ఆశలు వదులుకోండి’’ అంటూ విసుక్కుంది. తొమ్మిది నెలలు మోసింది బిడ్డ మీద ఆశలు వదులుకోవడానికా? మేమడిగినట్టు సోమవారమే పంపించేస్తే మా బిడ్డ మాకు దక్కేవాడు. బుధవారం తెల్లవారుజామున బిడ్డను  రెండోసారి (26 ఆగస్ట్) ఎలుకలు కొరికితే  మధ్యాహ్నం రెండు గంటల వరకు డాక్టర్లు రాలేదు. చనిపోయిన బాబుకు  రెండు గంటల సమయంలో ట్రీట్‌మెంట్  చేయడానికి వస్తారా? ఇదేనా డాక్టర్‌ల బాధ్యత? ఇక నర్సులయితే కబుర్లు చెప్పుకోవడం, వెళ్ళిపోవడం. నైట్ డ్యూటీలో ఉన్నవాళ్లయితే  పదకొండింటికే నిద్రపోతారు. ఎలుకల నుంచి మా బిడ్డలను మేం కాచుకోవాలి. మాకు మేమే కాపాడుకుంటూ, మాకు మేమే ట్రీట్‌మెంట్ చేసుకునేవాళ్లమే అయితే ఈ ఆసుపత్రికి ఎందుకు వెళ్తాం?

ఇప్పుడు ఎలుకలను చూస్తేనే మా బాబు గుర్తుకొస్తున్నాడు. పసిపిల్లాడు.. ఆ బాక్స్‌లో ఎలుకలు కరుస్తుంటే ఎలా భరించాడో నా తండ్రి.. ఎంత క్షోభపడ్డాడో! కిచకిచ శబ్దానికి మెలకువ వచ్చి చూసేసరికే నా బిడ్డ రక్తపు ముద్దయ్యాడు. వెంటనే సిస్టర్‌కి కబురు పెట్టాం. సిస్టర్ వచ్చి ‘మీరు ఉంది ఎందుకు? పిల్లోడి దగ్గర మిమ్మల్ని ఎందుకు పెట్టాం? మీరే చూసుకోవాలి. పదేపదే మమ్మల్ని ఎందుకు పిలుస్తారు?’ అంటూ విసుక్కుంది. తీరిగ్గా వచ్చిన మాధవరావు డాక్టర్ జేబులో చేతులు పెట్టుకొని చూసి వెళ్లిపోయాడు. బాబు మీద చేయి వేసి చూస్తే ఒళ్లు చల్లగా తగిలింది. ఇంక్యుబేటర్ దగ్గర ఉన్న  ఓ చిన్న చెక్క స్టూల్ మీద కూర్చొనే ఎలుకలు రాకుండా కాపలా కాసేదాన్ని.

పెద్దాపరేషన్ అయింది (సిజేరియన్). కుట్లు నొప్పిపుడుతున్నా... అలాగే కూర్చొని  కాపలా కాసేదాన్ని. మొదటిసారి ఎలుకల నుంచి బిడ్డను కాపాడుకున్నా. కానీ రెండోసారి... (ఏడుస్తూ ఆగిపోయింది లక్ష్మి. మళ్ళీ గొంతు పెగుల్చుకొని...) గురువారం ఆపరేషన్ చేశారు. శనివారం మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. కానీ ఎలుకలకు బాబు నైవేద్యం అయిపోయాడు. బాబు పోయాక కూడా  మేం పోలీస్ కేసు పెడితేనే బాబును మాకు అప్పగించారు. రక్తపు ముద్దగా బారిన బిడ్డను చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలనిపించింది. బాధ్యత లేని వాళ్ల చెంపలు టపాటపా వాయించాలనిపించింది.

బాధేస్తోంది...
ఇంత జరిగినా బాధ్యుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధేస్తోంది.  ప్రభుత్వం ఆ రోజు మాకిచ్చిన మాటేంటి? డబ్బులిచ్చేసి తమ బాధ్యత అయిపోనట్టు, మా బాధ తీరిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. మా బాధ తీరలేదు. మా బాబు చనిపోవడానికి కారకులైన డాక్టర్లను తొలగిస్తేనే మాకు కొంచెం ఊరట. కొంచెం తృప్తి. మాలాగా ఇంకే తల్లిదండ్రులకూ కడుపుకోత రాకూడదు.

అబద్ధాలు చెప్తున్నారు
కళ్ల ముందే బిడ్డను చంపుకున్న క్షోభను మేం అనుభవిస్తున్నాం. జీవితాంతం ఆ బాధ మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. పిల్లాడు బతికి, ఎదిగి మాకు ఎంత సంతోషాన్ని ఇచ్చేవాడో.. అయిదు లక్షల పరిహారం అంత సంతోషాన్నిస్తుందా. పైగా నేను పదిలక్షలు అడిగానని అబద్ధాలు చెప్తున్నారు (డాక్టర్లు, నర్సులు).  మాకు డబ్బు ప్రధానం కాదండి... మాలాగా ఇంకో తల్లీ తండ్రీ బాధపడకూడదు. ప్రభుత్వం నుంచి  మాకు న్యాయం కావాలి.  పసిపిల్లలకు ట్రీట్ మెంట్ ఇవ్వాలంటే జాగ్రత్తగా ఉండాలనే భావం రావాలి. దేవుడి తర్వాత దండం పెట్టేది డాక్టర్‌కే. ఆ గౌరవం కాపాడుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చేవరకు పోరాడుతాం. ఎంతవరకైనా వెళతాం.

ఒకటే కోరిక...
వార్డుల్లోకి చెప్పులు వేసుకొని రావద్దని చెప్తుంటారు. కానీ డాక్టర్లు మాత్రం దాన్ని పాటించరు. గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో ఆడవాళ్లకు, మగవాళ్లకు బాత్రూమ్స్ ఒకటే. నీళ్ళు రావు. కంపుగొట్టి లేని రోగాలు వస్తున్నాయి. నా బిడ్డకు జరిగినట్టే వాళ్ల బిడ్డలకూ జరుగుతుందేమోనని హాస్పిటల్‌లో ఉన్న మిగతా తల్లిదండ్రులూ భయపడ్డారు. ఆ  ఆసుపత్రి నుంచి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా బయటపడితే బాగుండు అని దేవుడికి దండం పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నేను కోరుకునేది ఒకటే... ఏ ప్రభుత్వం వల్ల నేను నష్టపోయానో అదే ప్రభుత్వం మా కుటుంబానికి న్యాయం చేయాలి. నాకు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా కల్పించాలి.  కనీసం ఉన్న ఒక్క కొడుకునైనా మంచిగా పెంచుకోవడానికి సహకరించాలి.

ఇన్‌పుట్స్: ఎన్. మాధవ్ రెడ్డి,
సాక్షి, గుంటూరు
జి. రాజారమేష్, సాక్షి టీవి, విజయవాడ

http://www.sakshi.com/news/family/should-give-the-panishment-to-nigligence-people-278646

కుట్ర సాగదు...దీక్ష ఆగదు


కుట్ర సాగదు...దీక్ష ఆగదు
గుంటూరు : ప్రత్యేక హోదా ప్రజల హక్కు అనే నినాదంతో వైఎస్సార్ సీపీ అధినేత  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష నిర్ణీత ఉల్ఫ్‌హాలు స్థలంలోనే జరిగి తీరుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంతో చీకటి ఒప్పందం చేసుకున్నందునే ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదన్నారు. అంతేకాకుండా జగన్ దీక్షపై పోలీసుల ఆంక్షలు చూస్తుంటే ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం నుంచి మరో గొంతు వినిపించకుండా చూస్తామని కూడా హామీ ఇచ్చినట్టుందని అన్నారు.

 గుంటూరులోని ఉల్ఫ్‌హాలు స్థలంలో జగన్ దీక్షకు వేదిక నిర్మాణం, సీలింగ్ ఏర్పాట్లు తుది దశకు చేరుకొంటున్న తరుణంలో బుధవారం పోలీసులు అడ్డుకుని పనులు నిలుపుదల చే యించటంపై పార్టీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షాస్థలానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసుల చర్యలను విమర్శిస్తూ, దీనివెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడారు..

► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడు తూ, ప్రభుత్వ స్థలాలపై అభ్యంతరం చెప్పిన పోలీసులు ఇప్పుడు ప్రైవేటు స్థలంలో దీక్షకు అభ్యంతరం చెప్పటం దుర్మార్గమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావటం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. శాంతియుత పోరాటం చేసే హక్కు రాజ్యాంగమే కల్పించిందనీ, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు.
► ఎమ్మెల్సీ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జగన్ మోహన్‌రెడ్డి దీక్షను అడ్డుకోవాలని చూడటం అప్రజాస్వామికమని అన్నా రు. రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దీక్షను అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ప్రజలపక్షాన నిలబడి ప్రత్యేక హోదా కోసం పాటుపడుతున్న దీక్షను ఆపటం ఎవరి తరమూ కాదన్నారు.
► పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నపుడు ఎక్కడబడితే అక్కడ దీక్షలు చేసిన తెలుగుదేశం పెద్దలు ఇప్పుడు జగన్ మోహన్‌రెడ్డి నిరవధిక దీక్షకు నియంతలా అభ్యంతరం చెప్పటం దుర్మార్గమన్నారు.
► మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ,  15 రోజుల క్రితమే రిప్రజెంటేషన్ ఇచ్చి, దీక్షకు ఏర్పాట్లు చేస్తుంటే తీరా రెండురోజుల ముందు వచ్చి అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నించారు. ముందు రోజు రాత్రి చంద్రబాబు సింగపూర్ నుంచి వ చ్చారనీ, తిరుపతి, విశాఖలో జగన్ యువభేరికి నీరాజనం పలకటంతో తన మోసాలు సాగవన్న దుర్బుద్ధితో ఆగమేఘాలపై ఆదేశాలు జారీచేసి దీక్షను అడ్డుకోవాలని చూస్తున్నట్టు ఆరోపించారు.
► పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఆపేది లేదనీ, కుట్రలు కొనసాగించాలనుకుంటే ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు.
► పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలకు లోబడి ప్రజల కోసం జగన్ చేపడుతున్న శాంతియుత దీక్షను శాంతిభద్రతల సమస్య సాకుగా చూపి, అడ్డుకోవాలని చూస్తే ఆగటానికి  ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. 26న అవసరమైతే నగరాన్ని దిగ్భందనం చేసి అయినా సరే, దీక్ష జరిగి తీరుతుందన్నారు.
► ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పిరికిపంద చర్యగా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.
► పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్టినేటర్ తలశిల రఘురాం,   రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ నేతలు జంగా కృష్ణమూర్తి, కావటి మనోహర్‌నాయుడు,ఆతుకూరి ఆంజనేయులు, రావి వెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర ెహ నీ క్రిస్టినా, ఎండీ నసీర్‌అహ్మద్, లాల్‌పురం రాము, కర్నుమా, నూనె ఉమామహేశ్వరరెడ్డి,  పోలూరి వెంకటరెడ్డి, శానంపూడి రఘురామిరెడ్డి, సుద్దపల్లి నాగరాజు, జలగం రామకృష్ణ, ఆవుల సుందరరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, కొత్త చిన్నపరెడ్డి, మొగిలి మధు, బండారు సాయిబాబు, నిమ్మరాజు శారదలక్ష్మి, కొట్టె కవిత, శ్రీకాంత్ యాదవ్, కోట పిచ్చిరెడ్డి, సయ్యద్ మాబు, అంగడి శ్రీనివాసరావు, ఉప్పుటూరి నర్సిరెడ్డి, పానుగంటి చైతన్య, పెదాల బాబు, రాచకొండ ముత్యాలరాజు, గనిక ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

 ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు..
► మాజీ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ, పోలీసులను అడ్డంపెట్టుకుని జగన్ దీక్షను అడ్డుకోవాలనే చంద్రబాబు నిరంకుశ చర్య అప్రజాస్వామ్యమన్నారు. తాము చేస్తున్న దీక్ష ప్రభుత్వానికి వ్యతిరేకం కాదనీ, ప్రజల న్యాయమైన హక్కుల కోసం, రాష్ట్రా న్ని ఆర్థికంగా పరిపుష్టి చేయటానికి తలపెట్టినట్టు గుర్తుచేశారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చీకటి ఒప్పందం చేసుకొని రాష్ట్రం నుంచి ప్రత్యేక హోదా డిమాండు రా కుండా చూస్తామని చెప్పినందునే ఇలా అడ్డుకుంటున్నారని భావిస్తున్నామని అన్నారు.

చంద్రబాబు నిజమైన ఊసరవెల్లి


చంద్రబాబు నిజమైన ఊసరవెల్లి
 వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్

 చిలకలూరిపేటటౌన్ : సీఎం చంద్రబాబునాయుడు నిజమైన ఊసరవెల్లి అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. ఈ నెల 26 న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతుగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, ముఖ్యకార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం చంద్రన్న యాత్ర అని చెప్పుకుంటూ రైతుల గురించి కాకుండా ప్రతిపక్ష నాయకుడు, పార్టీపై అనుచిత విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం ప్రారంభించి మామపై పోటీ చేస్తానని నాడు బీరాలు పలికిన చంద్రబాబునాయుడు టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి మారి రంగులు మార్చే ఊసరవెల్లిగా నిరూపించుకొన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో మతతత్వ బీజేపీ తో పొత్తు పెట్టుకోవటం పొరపాటని విమర్శించి అనేక సందర్బాల్లో చంద్రబాబునాయుడు ఊసరవెల్లి నైజం బయట పెట్టుకొన్న విషయం టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలని తెలిపారు.

 జిల్లా మంత్రులవి ప్రేలాపనలు ..
 ముఖ్యమంత్రి మెప్పు కోసం జిల్లా మంత్రులు  దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని  విమర్శించారు. కేసుల్లో నుంచి బయట పడేందుకే జగన్ ఉద్యమాలు చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వాఖ్యానించటం హేయమన్నారు. ఓటు కు నోటు కేసులో నుంచి బయట పడేందుకు ప్రధాన మంత్రి మోదీ కాళ్ల వద్ద సాగిలపడ్డారో, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ దేవెళ్ల రేవతి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం ప్రాణత్యాగానికి సైతం వెనుకాడక  దీక్షకు దిగుతున్న వైఎస్ జగన్‌మోహనరెడ్డిపై విమర్శలు టీడీపీ నాయకులు మానుకోవాలని చెప్పారు.

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమౌతుందని గుర్తించి అన్ని వర్గాల ప్రజలు దీక్షల్లో భాగస్వాములు కావాలని కోరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుభానీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్లోర్‌లీడర్ నాయుడు శ్రీనివాసు, డిప్యూటి ప్లోర్‌లీడర్ షేక్ అబ్దుల్ రౌఫ్, కౌన్సిలర్లు దారా అరుణకుమారి, నరసింహుల అన్నపూర్ణ, నాగూల్‌మీరా,షేక్ కాలేషావలి, పలువురు నాయకులు  పాల్గొన్నారు.

‘యువభేరి’ ప్రొఫెసర్ సస్పెన్షన్


‘యువభేరి’ ప్రొఫెసర్ సస్పెన్షన్
- ఇది భావప్రకటన స్వేచ్ఛపై దాడి అంటున్న విశ్లేషకులు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కాలన్న ఆకాంక్షను వినిపించే గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కేసేలా ప్రభుత్వం నిరంకుశ చర్యలకు దిగుతోంది. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం విశాఖపట్నంలో జరిగిన యువభేరి సదస్సులో పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను, దాని ఆవశ్యకతను వినిపించిన ఆంధ్రా వర్సిటీ  ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అతిథిగా పాల్గొని ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగించిన యువభేరి సదస్సుపై బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలో అధికారులతో చర్చించారు. సదస్సులో ప్రసంగించిన వర్సిటీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిని సస్పెండ్ చేయాలని సమావేశం నుంచే ఆంధ్రావర్సిటీ ఉన్నతాధికారులను ఫోన్లో ఆదేశించారు.
 
మంత్రి ఆదేశాలతో సర్వత్రా విస్మయం..
ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కాల్సిన ఆవశ్యకత గురించి చర్చించడానికి విద్యార్థులు నిర్వహించుకున్న సదస్సులో పాల్గొని తన భావనలను పంచుకున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇది అప్రజాస్వామ్యక ధోరణి అని అనేక మంది మండిపడుతున్నారు.
 
కోదండరాంపై ఏం చర్యలు తీసుకున్నారు?
ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై చర్యలపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. పైగా రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాల్సి ఉంది. ఆ ఆకాంక్షను వెలిబుచ్చడం నిబంధనలకు విరుద్ధమెలా అవుతుందన్న ప్రశ ్న ఉత్పన్నమవుతోంది. యూజీసీ నిబంధనల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్లు ప్రజాచైతన్య కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఎక్కడా లేదు. వారు సదస్సులు, చర్చాగోష్టులు, సమావేశాల్లో పాల్గొని తమ భావాలను వ్యక్తపరచవచ్చు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున సాగాయి.

ఆ సమయంలో వివిధ వర్సిటీల్లోని అధ్యాపకులే ఉద్యమాల్లో క్రియాశీల పాత్రను పోషించారు. ఓయూ ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రపోషించారు. అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వంటి వారు కూడా ప్రత్యేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం అలాంటి వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వారిపై కూడా చర్యలేమీ తీసుకోలేదు.

అయితే ఇప్పుడు ప్రత్యేకహోదా అంశం గురించి జరిగిన సదస్సులో పాల్గొన్న అధ్యాపకుడిపై మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ తీరుపై ఉపాధ్యాయ, విద్యార్థి లోకాలు మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణ చివేసే చర్యలకు ప్రతిఘటనను ఎదుర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.

గుంటూరులో జగన్ దీక్షకు అడుగడుగునా సర్కారు అడ్డంకులు


అదే కుట్ర!
 గుంటూరులో జగన్ దీక్షకు అడుగడుగునా సర్కారు అడ్డంకులు
⇒ అనుమతి నిరాకరించిన గుంటూరు పోలీసులు
 ఉల్ఫ్ హాల్ గ్రౌండ్ వద్ద బలవంతంగా ఏర్పాట్లు నిలిపివేత
⇒ పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు
⇒ పోలీసులతో వాగ్వివాదం.. ఉద్రిక్తంగా వాతావరణం
⇒ తెరవెనుక సీఎం చంద్రబాబు మంత్రాంగం
⇒ యువభేరి విజయవంతమవడంతో సర్కారులో వణుకు
⇒ జగన్ నిరవధిక దీక్ష చేపట్టకుండా కుట్రలు..
⇒ హోదాపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న భావన సర్వత్రా వ్యక్తం


సాక్షి, గుంటూరు, విజయవాడ బ్యూరో: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన చంద్రబాబు సర్కారు ఆ పని చేయకపోగా... ఉద్యమిస్తున్న ప్రతిపక్షానికి వరుసగా అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు కల్పిస్తోంది. ‘హోదా’పై ఎలుగెత్తే గొంతుకను కర్కశంగా నిలువరిస్తోంది. ప్రత్యేక హోదా వల్లనే ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కుతాయన్న అవగాహనకు వచ్చిన విద్యార్థులు, యువత చేపట్టిన యువభేరి సదస్సులకు వస్తున్న స్పందన చూసిన ప్రభుత్వం ఎక్కడాలేని విధంగా కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది. తిరుపతి, విశాఖల్లో యువభేరి సదస్సులను అడ్డుకోవాలని ప్రయత్నించి విఫలమైన సర్కారు... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ నెల 26న గుంటూరులో చేపట్టనున్న నిరవధిక దీక్షనూ ఎలాగైనా జరగనీయకుండా కుయుక్తులు పన్నుతోంది.

 అందులో భాగంగానే మరో అడుగు ముందుకేసి గుంటూరు ఉల్ఫ్ హాల్ గ్రౌండ్‌లో జరిగే దీక్షకు అనుమతి నిరాకరించింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందనే సాకుతో పోలీసు అధికారులు నిరవధిక దీక్షకు అనుమతి లేదని కొత్త పల్లవి అందుకున్నారు. బుధవారం సాయంత్రం అనుమతి నిరాకరించి దీక్షా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను బలవంతంగా నిలిపివేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆరునూరైనా వైఎస్ జగన్ దీక్ష చేస్తారని వైసీపీ నేతలు ప్రకటించారు.

 గతంలోనూ  బాబు సర్కారు విఫలయత్నం
 ప్రత్యేక హోదా సాధనకు బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండగా, ఆ పని చేస్తున్న వైఎస్ జగన్ హోదా సాధన కోసం గతంలో రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి అడ్డుకున్న తీరు తెలిసిందే. తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకొని పూర్తిస్థాయి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, రోజంతా పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా సూచనలు ఇస్తూ బంద్‌ను విఫలం చేయడానికి యత్నించిన విషయం విదితమే. బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయడంతో చంద్రబాబు సర్కారులో వణుకు మొదలైంది. దీంతో అక్కడితో ఆగక, తిరుపతి, విశాఖలో జరిగిన యువభేరి సదస్సులను అడ్డుకోవడం, విశాఖ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ విధించేందుకు ఉపక్రమించడం, దీక్షకు అనుమతి నిరాకరించడం వంటి చర్యలు చూస్తే ప్రత్యేక హోదా సాధించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

 ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే...
 జగన్ దీక్షను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలందడంతో బుధవారం ఉదయమే పోలీసులు భారీఎత్తున రంగంలోకి దిగారు. ఈస్ట్‌జోన్ డీఎస్పీ సంతోష్ ఆధ్వర్యంలో దీక్షాస్థలికి వచ్చిన పోలీసులు అక్కడ పనులను నిలిపివేయించారు. దీంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ ఛైర్మన్ తలశిల రఘురామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అక్కడకు చేరుకొని డీఎస్పీ, ఇతర పోలీసులను అడ్డుకుని పనులు ఎందుకు ఆపారని ప్రశ్నించారు.

 నిరవధిక దీక్షకు మొదట హిందూ కాలేజి దగ్గర, అంబేద్కర్ విగ్రహం, కలెక్టర్ కార్యాలయాలను  ఎంపిక చేసుకోగా, మూడింటినీ నిరాకరించి మరొక స్థలం ఎంపిక చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు కోరిన విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ గుర్తుచేశారు. చివరిగా ఏసీ కాలేజి ఎదుట ఉన్న ఉల్ఫ్ హాలు స్థలాన్ని సంబంధిత యాజమాన్యం నుంచి అద్దెకు తీసుకొని, తగిన రుసుం చెల్లించినట్టు చెప్పారు. ఆ పత్రాలతోపాటు జగన్ దీక్షకు భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కోరుతూ గతంలోనే జిల్లా ఎస్పీకి లేఖ ఇచ్చామని తెలిపారు. అయినా పోలీసు అధికారులు దీక్షా ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని చెప్పడంతో నాయకులు వారితో వాగ్వివాదానికి దిగారు.

 దీక్ష చట్ట వ్యతిరేకమన్న పోలీసులు...
 నిరవధిక దీక్షకు అనుమతిని తిరస్కరిస్తున్నామని పేర్కొంటూ ఈస్ట్‌జోన్ డీఎస్పీ జేవీ సంతోష్ బుధవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నేతలకు లేఖ ఇచ్చారు. ‘నిరవధిక దీక్ష చట్టవ్యతిరేకమైనందున అనుమతి తిరస్కరించటమైనది’ అని అందులో పేర్కొన్నారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి దీక్షాస్థలానికి చేరుకొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ముఖ్య నేతలు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠిని కలిశారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, సమీపంలోని ఆస్పత్రులు, విద్యాసంస్థలకు శబ్దకాలుష్యమనే అభ్యంతరాలను ఎస్పీ వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్య రాకుండా వాహనాలను దూరంగా నిలిపివేసి వస్తామని, నియమిత డెసిబుల్స్‌లోనే శబ్దం ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటామని పార్టీ తరఫున మరో లేఖను ఎస్పీకి అందించారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని ఎస్పీ కోరడంతో పార్టీ నేతలు తిరిగివచ్చారు.

చంద్రబాబు సూచనలతోనే...
 నిరవధిక దీక్ష వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని స్థానిక పోలీసులు భావిస్తున్నా సీఎం చంద్రబాబు సూచనలతోనే వారు అడ్డంకులు కల్పిస్తున్నారు. ఉల్ఫ్ హాల్ గ్రౌండ్‌లో దీక్ష వల్ల పెద్దగా ఇబ్బందులుండని అర్బన్ పోలీసు ఉన్నతాధికారులు ఇంటిలిజెన్స్ విభాగానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. కానీ ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగి అసలు అక్కడ దీక్షే జరక్కూడదని గుంటూరు అర్బన్ పోలీస్ బాస్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో బుధవారం ఉదయమే ఏర్పాట్లు జరుగుతున్న దీక్షా స్థలి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

 ఆది నుంచీ ఇదే తీరు...
 ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలపై చర్చించేందుకు, తద్వారా యువతలో అవగాహన కల్పించేందుకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు యువభేరీ సదస్సులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా సాధనపై మొదట్నుంచీ తన గళాన్ని గట్టిగా వినిపిస్తూ.. ఢిల్లీ వరకు పోరాటం నిర్వహించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. ఈనెల 15న ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో యువభేరి సదస్సుకు మొదట అనుమతిని ఇచ్చి, తర్వాత యూనివర్సిటీలు, కాలేజీల్లో సభలకు అనుమతి లేదని ప్రభుత్వం అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పీఎల్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో సదస్సు నిర్వహించారు. సదస్సు విజయవంతం కావడంతో.. ఆ తర్వాత ఈ నెల 22న జరిగిన విశాఖ యువభేరి సదస్సుకూ ప్రభుత్వం అడ్డంకులు కల్పించింది.

సెక్షన్ 30, 31ని అమల్లోకి తెచ్చి నగరంలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదని నోటీసులు జారీ చేసింది. సదస్సుకు వచ్చే ర్యాలీలను అడ్డుకుంది. అయినా, వైఎస్ జగన్ పాల్గొన్న సదస్సుకు యువత ఉవ్వెత్తున తరలివచ్చింది. దీంతో గంగవైలెత్తిన ప్రభుత్వం నిరవధిక దీక్ష జరక్కుండా ఆపడానికి కుట్రలు పన్నుతోంది. అయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ దీక్ష చేపడతారని వైసీపీ నాయకులు పోలీసులకు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం నుంచి దీక్షా స్థలి వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కొలుసు పార్థసారధి, మేరుగ నాగార్జున, జోగి రమేష్‌లున్నారు.
 నేడు హైకోర్టుకు..: దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు హైకోర్టును గురువారం ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

అనుమతి కోసం చూస్తున్నాం
 ప్రత్యేక హోదా కోసం 26న వైఎస్ జగన్ తలపెట్టిన నిరవధిక దీక్షకు సంబంధించి పోలీసు అధికారులు చెబుతున్న అభ్యం తరాలను పునరాలోచించుకోవాలని లేఖ ఇచ్చాం. ఏసీ కాలేజీకి చెందిన ఉల్ఫ్ హాలు దీక్షాస్థలికి ఎంపికచేసి సంబంధిత యజమాని నుంచి నిరభ్యంతర పత్రం తీసుకుని అద్దె కూడా చెల్లించాం. ఆ ప్రదేశంలో దీక్షను పోలీసులు బుధవారం తిరస్కరించటంతో సాయంత్రం అర్బన్ ఎస్పీని కలిశాం. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా వాహనాలను దూరంగా నిలిపివేస్తామన్నాం. శబ్దకాలుష్యానికి అవకాశం లేకుం డా తక్కువ డెసిబుల్స్ ఉండేలా చూస్తామని వివరించాం. దీనికి కొంత వ్యవధి కావాలని అధికారులు కోరినందున ఎదురుచూస్తున్నాం.   
 - విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ
 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


 అడ్డుకుంటే ఆహుతవుతారు..
 అధికారంలో ఉన్నపుడు ఎక్కడ పడితే అక్కడ దీక్షలు చేసిన తెలుగుదేశం పెద్దలు ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక దీక్షకు నియంతలా అభ్యంతరం చెప్పటం దుర్మార్గం. నవనిర్మాణ దీక్ష పేరుతో సాక్షాత్తూ సీఎం చంద్రబాబు అత్యంత రద్దీ గల విజయవాడ బెంజి సర్కిల్‌లో దీక్ష శిబిరం నిర్వహించింది మరిచారా? చంద్రబాబూ పునరాలోచన చెయ్యి.. నువ్వు సాధించాల్సిన ప్రత్యేక హోదాను ప్రజల హక్కుగా ప్రతిపక్ష నేత జగన్ చేస్తుంటే, అడ్డుకోవాలని చూడటం సమంజసం కాదు. నరరూప రాక్షసుడిలా బాబు జగన్ దీక్షను అడ్డుకోవాలని చూస్తున్నారు. ప్రత్యేకహోదా దీక్షాయజ్ఞ హోమగుండంలో పడి ఆహుతవక తప్పదు.   
- అంబటి రాంబాబు

Popular Posts

Topics :