హైదరాబాద్: మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను గెలుచుకున్న తెలుగు తేజం పీవీ సింధును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. బ్యాడ్మింటన్ ఆటలో పీవీ సింధు మరిన్ని విజయాలు సాధించాలని, మున్ముందు మరిన్ని టోర్నమెంట్లలో విజయాలు సొంతం చేసుకోవాలని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో ఆకాంక్షించారు.
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం జరిగిన తుదిపోరులో 21-15, 21-9 తేడాతో క్రిస్టీ గిల్మౌర్(స్కాట్లాండ్)ను ఓడించి.. మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకుంది. గతంలో 2013 లో కూడా సింధు ఈ టైటిల్ను గెలిచింది
0 comments:
Post a Comment