కృష్ణారావు, నాయని కృష్ణకుమారి మృతికి జగన్ సంతాపం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కృష్ణారావు, నాయని కృష్ణకుమారి మృతికి జగన్ సంతాపం

కృష్ణారావు, నాయని కృష్ణకుమారి మృతికి జగన్ సంతాపం

Written By news on Saturday, January 30, 2016 | 1/30/2016


సాక్షి, హైదరాబాద్ : భారత ఆర్మీ మాజీ చీఫ్,  మాజీ గవర్నర్ జనరల్ కేవీ కృష్ణారావు(93), ప్రఖ్యాత రచయిత్రి, కవయిత్రి  నాయని కృష్ణకుమారి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. భారతమాత ఒక గొప్ప ముద్దుబిడ్డను కోల్పోయిందని, కృష్ణారావు మరణం తనను ఎంతగానో బాధించిందని జగన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత సైన్యాధిపతిగా కృష్ణారావు ఎనలేని సేవలందించారని, పదవీ విరమణ తరువాత గవర్నర్‌గా మెప్పించారని జగన్ కొనియాడారు. 1942లో భారత సైన్యంలో చేరిన కృష్ణారావు రెండో ప్రపంచ యుద్ధంలోనూ, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలలోనూ మన దేశానికి ఎన్నో సేవలందించారని, 1971 యుద్ధంలో చిరస్మరణీయ విజయాలు సాధించి, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌ను విముక్తం చేయడంలో ఆయన పాత్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచి పోతుందన్నారు. కృష్ణారావు అందించిన సేవలు, ఆయన జీవితం తెలుగువారికి, భారతదేశానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమనని జగన్ పేర్కొన్నారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సాహితీ రంగానికి తీరని లోటు

సాహితీవేత్త నాయని కృష్ణకుమారి మృతి సాహితీరంగానికి తీరని లోటని జగన్ సంతాపం తెలిపారు. జానపద సాహిత్యంలోనూ, మహిళా సాహిత్యంలోనూ ఆమె విశేషంగా కృషి చేశారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా ఆమె తెలుగు సాహితీరంగ అభివృద్ధికి ఎంతో సేవ చేశారన్నారు. ఆమె కృషికి గుర్తింపుగా సాహితీ అకాడమీతో పాటు అనేక అవార్డులు ఆమెను వరించాయని జగన్ గుర్తు చేసుకుంటూ కృష్ణకుమారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సా
Share this article :

0 comments: