నేడు 'తూర్పు'న వైఎస్ జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు 'తూర్పు'న వైఎస్ జగన్ పర్యటన

నేడు 'తూర్పు'న వైఎస్ జగన్ పర్యటన

Written By news on Wednesday, January 27, 2016 | 1/27/2016


నేడు 'తూర్పు'న వైఎస్ జగన్ పర్యటన
కాకినాడ : ప్రత్యేక హోదాపై విద్యార్థులను సమాయత్తపరిచేందుకు ఉద్దేశించిన యువభేరి, అనంతరం బహిరంగ సభ కార్యక్రమాల నిమిత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను రాష్ట్ర ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలసిల రఘురామ్ మంగళవారం రాత్రి తెలిపారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ బయలుదేరుతారు.
10.30 గంటలకు కాకినాడలోని అంబేద్కర్ భవన్‌కు చేరుకుంటారు.
 అక్కడ యువభేరి కార్యక్రమంలో విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
 మధ్యాహ్నం 3 గంటలకు జేఎన్‌టీయూ సమీపంలోని బిల్డింగ్ సొసైటీ స్థలంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, యువ నాయకుడు ముత్తా శశిధర్‌లను పార్టీలోకి ఆహ్వానిస్తారు.
Share this article :

0 comments: