రైతు కూలీలతో రాప్తాడు వెళుతున్న ఆటో రామునేపల్లిలో బోల్తా పడింది. దీంతో ఆరుగురు మహిళలతో సహా 10 మంది గాయపడ్డారు. పోలీసులు, అంబులెన్స్ కు సమాచారం అందించినా స్పందన రాలేదు. రామునేపల్లి మీదుగా రాప్తాడు వెళుతున్న వైఎస్ జగన్ ప్రమాదం గురించి తెలుసుకుని వెంటనే స్పందించారు. బాధితులను దగ్గరుండి అంబులెన్స్ లోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించడంలో సహాయపడ్డారు. అధికారులను అప్రమత్తం చేసి బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందే ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను రాప్తాడులోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు.
కాగా, రామునేపల్లిలో ఆందోళన చేస్తున్న గోపాలమిత్రుల సమస్యలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జననేతను గోపాలమిత్రులు కోరారు.
0 comments:
Post a Comment