
ఈస్టిండియా కంపెనీకి చంద్రబాబుకు తేడా లేదని తమ్మినేని విమర్శించారు. రాజధాని పేరుతో తాబేదారులకు భూములు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల పొట్టకొట్టి రాజకీయ నాయకుల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు, వారి బంధువులకు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను చౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
0 comments:
Post a Comment