రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్

రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్

Written By news on Thursday, January 21, 2016 | 1/21/2016


నేడు నెల్లూరుకు జగన్
నెల్లూరు లో మిథున్‌రెడ్డి, చెవిరెడ్డిలకు పరామర్శ

 టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కేసుల్లో ఇరికించిన ఫలితంగా నెల్లూరు జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పరామర్శించనున్నారు. గత నవంబర్ 26వ తేదీన రేణిగుంట విమానాశ్రయ అధికారిని ప్రయాణికుల తరపున ప్రశ్నించినందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంపీ మిథున్‌రెడ్డిపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని  సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదైన కేసులో రైల్వే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

వీరిద్దరినీ కలుసుకుని పరామర్శించేందుకు జగన్  హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతికి  చేరుకుని అక్కడినుంచి రోడ్డు మార్గాన నేరుగా నెల్లూరు కేంద్ర జైలుకు వెళ్లి ఈ ఇద్దరు నాయకులను కలుస్తారని నెల్లూరు పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. పరామర్శించిన అనంతరం తిరిగి రేణిగుంటకు చేరుకుని విమానంలో హైదరాబాద్ పయనమవుతారని వారు చెప్పారు.
Share this article :

0 comments: