ఆ 62 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్సాప్‌! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ 62 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్సాప్‌!

ఆ 62 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్సాప్‌!

Written By news on Tuesday, February 23, 2016 | 2/23/2016


ఆ 62 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్సాప్‌!
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తమ ఎమ్మెల్యేలు నలుగురిని టీడీపీలోకి తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజస్వామ్యాన్ని అవహేళన చేశారని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు నిసిగ్గుగా పట్టపగలు ప్రలోభాలు పెట్టి.. కోట్ల డబ్బు ఎరగా వెదజల్లి, మంత్రి పదవులు ఆశజూపి నలుగురు ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసిన అనంతరం వైఎస్ జగన్  విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు నలుగురు టీడీపీలో చేరిన విషయంపై స్పందించారు.

తన కుటుంబానికి సన్నిహితులైన వ్యక్తులను ప్రలోభాలు పెట్టి, డబ్బులు, మంత్రి పదవులు ఎరచూపి తీసుకొనిపోవడం తనకు బాధ అనిపించిందని వైఎస్ జగన్ అన్నారు. 'నాగిరెడ్డి అన్న విషయంలో బాధ అనిపించింది.  బాగా దగ్గరగా ఉన్న మనుషులను, కుటుంబంలోని సభ్యులు అనుకున్నవారు అలా వెళ్లడం బాధ కలిగించింది.  శోభమ్మ చనిపోయినప్పుడు, అలాగే ఆమె మొదటి వర్ధంతి సందర్భంలో అమ్మ, నేను, నా భార్య భారతి, చెల్లెలు షర్మిల అందరం కలిసివెళ్లాం. అంతగా కుటుంబసభ్యుడిగా ఆయనను భావించాం. అలాంటి వ్యక్తిని కూడా ప్రలోభాలు పెట్టి తీసుకు వెళ్లారు.' అని జగన్ అన్నారు.
 
పార్టీ ఎమ్మెల్యేలందరినీ ప్రలోభపెట్టి, డబ్బు ఎరచూపి, మంత్రులతో మంతనాలు జరిపి.. కుదరకపోవడంతో చంద్రబాబు తానే స్వయంగా రంగంలోకి దిగి గట్టిగా కష్టపడినా కేవలం నలుగురు అంటే నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారారన్నారు. ఎన్ని ప్రలోభాలు, ఆశలు, బెదిరింపులకు పాల్పడినా ప్రజాపక్షం వహించి వైఎస్ఆర్‌సీపీతోనే ఉన్న 62 మంది ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ హ్యాట్సాప్ చెప్పారు.

ఇక ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఒక్క హామీనైనా నెరవేర్చలేదని, ఊరికి రెండు కొత్త ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వలేదని, అలాంటి వ్యక్తితో కలిసి వెళ్లినందుకు పార్టీ మారిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమను తాము మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని జగన్ సూచించారు.
Share this article :

0 comments: