ప్రత్యేక హోదాపై ప్రణబ్ ను కలిశాం: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదాపై ప్రణబ్ ను కలిశాం: వైఎస్ జగన్

ప్రత్యేక హోదాపై ప్రణబ్ ను కలిశాం: వైఎస్ జగన్

Written By news on Tuesday, February 23, 2016 | 2/23/2016


ప్రత్యేక హోదాపై ప్రణబ్ ను కలిశాం: వైఎస్ జగన్ఫైల్ ఫోటో
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేలా చూడాలని ఆయన ప్రణబ్ కు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి ప్రణబ్ తో భేటీ అనంతరం వైఎస్ జగన్ మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ' ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశాం. మా విజ్ఞప్తులకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు ఏనాడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. నాడు అధికార, విపక్షాలన్నీ కలిసి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చాయి. ఇప్పుడు ఆ హామీ గురించి పట్టించుకునేవారు లేరు.
ప్రత్యేక హోదా అంశాన్ని ఒకసారి గుర్తు చేయడం కోసమే రాష్ట్రపతిని కలిశాం. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అపాయింట్ మెంట్ కోరాం. జాట్ ల సమస్య కారణంగా అపాయింట్ మెంట్ ఇవ్వలేకపోయారు'. అన్నారు. వైఎస్ జగన్ తో  పాటు పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, పెదిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, వరప్రసాద్ లు రాష్ట్రపతిని కలిసినవారిలో ఉన్నారు.
Share this article :

0 comments: