
అప్పటి నుంచి ప్రతి ఏటా డైరీని రూపొందిస్తున్నామని, నేటి వరకు ఒక్క ఏడాది మినహా ప్రతి సంవత్సరం జగన్ చేతుల మీదుగా ఈ డైరీ ఆవిష్కరణ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్ జీవిత విశేషాలు, జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను ప్రధానాంశంగా తీసుకుని డైరీని రూపొందించామని, కాని ఈ 2016 డైరీలో మహానేత జీవిత విశేషాలతో పాటు యువనేత జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర, రైతు భరోసా యాత్ర, రైతు పరామర్శ యాత్ర, ప్రజా సమస్యలపై చేసిన ధర్నాలు, దీక్షలు, వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేసిన దీక్షలు, మహానేత తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర, పరామర్శ యాత్ర తదితర విశేషాలన్నింటినీ ఫొటోలతో సహా పొందుపరిచామని తెలిపారు. మహానేత జీవిత విశేషాలు, ఆయన కుటుంబ సభ్యులు చేపట్టిన దీక్షలు, యాత్రలతో డైరీని రూపొందించడం తనకు లభించిన ఒక అదృష్టమైతే, ఆ డైరీని యువనేత చేతుల మీదుగా ఆవిష్కరింపజేయగలగడం మరో అదృష్టమని నిరంజన్రెడ్డి అన్నారు. ఎయిమ్ వ్యాప్తి సంస్థ క్రియేటివ్ డెరైక్టర్ నాగార్జున, ఉద్యోగులు బాషా, ఆలీ, రాజేష్లు ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 comments:
Post a Comment