వైఎస్సార్ కుటుంబాన్ని చూసే ఓట్లేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కుటుంబాన్ని చూసే ఓట్లేశారు

వైఎస్సార్ కుటుంబాన్ని చూసే ఓట్లేశారు

Written By news on Saturday, February 27, 2016 | 2/27/2016


‘వైఎస్సార్ కుటుంబాన్ని చూసే ఓట్లేశారు’
తిరుపతి మంగళం: పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేసి వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తండ్రి ఆశయ సాధన కోసం శ్రమిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాన్ని చూసే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులు ఆశ చూపించి టీడీపీలోకి లాక్కోలేదని ప్రమాణం చేస్తారా? అని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. టీడీపీలోకి వెళ్లినవారికి ఎలాంటి పదవులు ఇవ్వకుంటే, అప్పుడు వారు తమ పార్టీ నుంచి స్వచ్ఛందంగా వెళ్లారని నమ్ముతామన్నారు.

రెండేళ్లలో చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ముఖ్యమంత్రి సత్తా బయటపడుతుందని అన్నారు. ఇసుక, మద్యం, భూదందా, పట్టిసీమ, గోదావరి పుష్కరాలు, కొత్త రాజధాని వంటి వాటిలో రూ.వేల కోట్లు దండుకున్నారని, ఆ డబ్బుతో సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీని అడ్డం పెట్టుకుని గెలిచిన వారు దమ్ముంటే పదవులకు రాజీనామాలు చేసి, టీడీపీ తరపున గెలవాలని చెవిరెడ్డి సవాల్ విసిరారు. ఆదరించి పిల్లనిచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కున్న దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. తమ పార్టీని వదిలి వెళ్లిన వారికి భవిష్యత్తులో రాజకీయ సన్యాసం తప్పదని హెచ్చరించారు. కొనుగోలు చేయడం కోసం మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు డబ్బుతో వస్తే ఓటుకు నోటు’ కేసులో లాగా ఏసీబీకి పట్టించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: