శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం శ్రీకాకుళంలో నిప్పులు చెరిగారు. రాజకీయాలను చంద్రబాబు వ్యాపారంగా మార్చేశారని ఆరోపించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ పోతే మళ్లీ రాచరిక కాలంనాటి వ్యవస్థ పునరావృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ ప్రతిది న్యాయ వ్యవస్థకు లోబడే ఉంటుందన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా అందుకు మినహయింపు కాదని ధర్మన ప్రసాదరావు స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై రాజ్యాంగ సవరణ చేయాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment