పాస్ పుస్తకాలు ఉండి తీరాల్సిందే: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాస్ పుస్తకాలు ఉండి తీరాల్సిందే: వైఎస్ జగన్

పాస్ పుస్తకాలు ఉండి తీరాల్సిందే: వైఎస్ జగన్

Written By news on Wednesday, March 16, 2016 | 3/16/2016

పాస్ పుస్తకాలు ఉండి తీరాల్సిందే: వైఎస్ జగన్
హైదరాబాద్ :
రైతులకు పాస్‌ పుస్తకాలు పూర్తిగా తీసేయాలనుకోవడం సరికాదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. రైతులు కనీసం రుణాలు తీసుకోవడానికి, ఇతర అవసరాలకు చేతిలో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉండాలని ఆయన తెలిపారు. కావాలంటే కంప్యూటర్ రికార్డులను సెకండరీ చెక్‌గా పెట్టుకోవాలని, ప్రైమరీ చెక్‌గా పాస్ పుస్తకాలు ఉండాలని అన్నారు.

వైఎస్ జగన్ చేసినది చాలా మంచి సూచన అని, దాన్ని పాటించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. రైతుల చేతిలో ఫిజికల్ పాస్‌బుక్ తప్పనిసరిగా ఉండాలని ఆయన అన్నారు. కంప్యూటర్లలో మాత్రమే ఉంటాయంటే చాలా సమస్య అవుతుందని చెప్పారు.

దీనికి రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి సమాధానం ఇచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలను పూర్తిగా తీసేయడం లేదని, ఆప్షనల్‌గా చేస్తున్నామని ఆయన తెలిపారు.
Share this article :

0 comments: