ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇప్పటివరకు గిరిజన సలహా సంఘాన్ని ఏర్పాటు చేయలేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిలదీశారు. రాష్ట్రంలో ఏడు గిరిజన నియోజకవర్గాల ఉండగా, వాటిలో ఆరు చోట్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారని ఆయన అన్నారు. కేవలం తమ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టే ట్రైబ్స్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.
గిరిజనులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే గిరిజన సలహా సంఘం తప్పనిసరిగా ఉండాలని, అయినా ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా గురువారం నాడు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై చర్చ వచ్చినప్పుడు వైఎస్ జగన్ స్పందించారు.
గిరిజనులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే గిరిజన సలహా సంఘం తప్పనిసరిగా ఉండాలని, అయినా ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా గురువారం నాడు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై చర్చ వచ్చినప్పుడు వైఎస్ జగన్ స్పందించారు.
0 comments:
Post a Comment