నిప్పు అన్నావుగా... ఇప్పుడు నోరు విప్పు:రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిప్పు అన్నావుగా... ఇప్పుడు నోరు విప్పు:రోజా

నిప్పు అన్నావుగా... ఇప్పుడు నోరు విప్పు:రోజా

Written By news on Thursday, March 3, 2016 | 3/03/2016

హైదరాబాద్ : ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహాచరులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. నేను నిప్పు అంటూ గప్పాలు కొట్టుకుంటున్న నీవు ... ఇప్పుడు నోరు విప్పు అంటూ చంద్రబాబుపై రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని అమరావతి ప్రాంతంలో అక్రమాలు జరిగాయనే తాము తొలి నుంచి ఆరోపిస్తున్నామని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇన్ని రోజులు తమపై బురద జల్లుతూ తప్పించుకుని తిరిగారని రోజా విమర్శించారు. ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యాక నోరు మెదపడం లేదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు రోజా పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్స్ భూమి సీఆర్ డీఏ పరిధిలోకి ఎందుకు రాలేదన్నారు. అలాగే చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వియ్యంకుడి భూమి వద్ద అలైన్ మెంట్ ఎందుకు మారిందని నిలదీశారు. రెవెన్యూ మంత్రి ప్రమేయం లేకుండానే ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేశారని ప్రశ్నించారు. దోచుకునేందుకే మంత్రి నారాయణ, పుల్లారావుకు రాజధాని బాధ్యతలు అప్పగించారని విమర్శించారు.  
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు 5 లక్షల ఎకరాల భూమి ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నా... ఎందుకు విచారణ జరపడం లేదంటూ అధికార పార్టీ నేతలను రోజా ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పు చేయకుంటే సిట్టింగ్ జడ్జి లేదా... సీబీఐతో విచారణకు ఎందుకు సిద్ధపడటం లేదు అని ఆమె నిలదీశారు. అలాగే అకస్మాత్తుగా ఐజీఆర్‌ఎస్ వెబ్ సైట్ ను ఎందుకు బ్లాక్ చేశారన్నారు. మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయనే భయమా ? అని ప్రశ్నించారు. మాదంతా సక్రమమేనంటున్న చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లెందుకు పట్టుకున్నారని ప్రశ్నించారు. రెండెకరాల భూమి ఉన్న ఏ రైతు కూడా చంద్రబాబులా వేల కోట్ల హెరిటేజ్ లాంటి సంస్థలకు అధిపతులు ఎందుకు కాలేకపోయారూ అంటు సందేహం వ్యక్తం చేశారు. కేవలం రెండెకరాలు భూమి ఉన్న చంద్రబాబు తల్లి అమ్మణమ్మ రూ. కోట్లు వెచ్చించి జూబ్లీహిల్స్ లో మనవడు లోకేష్ కు భూమి ఎలా కొనిచ్చారని ప్రశ్నించారు.


తనకు వాచీ కూడా లేదంటున్న చంద్రబాబు... రైతులకు గోచీ కూడా లేకుండా దోచుకున్నారని రోజా ఎద్దేవా చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే మంత్రి నారాయణతో కమిటీ వేసి... విజయవాడ వద్ద రాజధాని అని ఎందుకు నిర్ణయించారన్నారు. బినామీలు కొనుగోలు చేసిన భూమి ల్యాండ్ పూలింగ్ లోకి ఎందుకు రాలేదని అడిగారు. ఓ కుట్ర ప్రకారమే సీఆర్ డీఏ పరిధిని నిర్ణయించి రైతులను రోడ్డున పడేశారని రోజా ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధానిలో ఎలాంటి పనులు జరగడం లేదని... అందువల్లే ఉద్యోగులను విజయవాడ రమ్మంటున్నారని ఆరోపించారు. అలాగైనా రియల్ ఎస్టేట్ పెరిగి భూముల ధరలు ఇంకా పెరుగుతాయని ఆశ పడుతున్నారు. నేను ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఓ మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని రోజా గుర్తు చేశారు. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని మంత్రిని ఎలా చేశారన్నారు. ఇద్దరు కలిసి క్విడ్ ప్రోకోకు పాల్పడి రూ. వేల కోట్లు సంపాదించారన్నారు. రాజధానిలో భూములు కోల్పోయిన పేద రైతుల విద్యార్థుల్లో ఒక్కరికైనా నారాయణ కాలేజీలో సీటు ఇచ్చారా ? అన్ని ప్రశ్నించారు.  ఒక్క నారాయణ కాలేజీలో పని చేసిన సిబ్బంది మాత్రమే వేల కోట్లు విక్రయించి భూములు ఎలా కొన్నారన్నారు. రూ. 6 వేల జీతం తీసుకుంటూ ఉద్యోగం చేసే ప్రమీలా15 ఎకరాలు ఎలా కొన్నారన్నారు.
అలాగే మంత్రి నారాయణ బావమరిదికి 29 ఎకరాల భూమి ఎలా వచ్చిందని...రాజధానికి రూ. 10 విరాళం ఇవ్వాలని విద్యార్థులను కోరిన ఆయన ఒక్క రూపాయి అయినా విరాళంగా ఇచ్చారా అని అడిగారు. టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ నాలుగు ఎకరాలు ఎందుకు కొన్నారు... ఆయన కొడుక్కి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. దళితుల అసైన్డ్ భూములను పథకం ప్రకారం దోచుకున్నారన్నారు. రకరకాలుగా వారిని భయపట్టి ఎకరా రూ. 5 లక్షలకు కొట్టేశారన్నారు. ఇప్పుడు ఆ భూముల ధరలు రూ. కోట్లకు చేరిందన్నారు.
సాక్షి మీడియాపై చర్యలు తీసుకుంటామని ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారని... కానీ సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని ఎందుకు ప్రకటించడం లేదంటూ రోజా సూటిగా ప్రశ్నించారు. దళితుల్లో పుట్టాలని ఎవరూ కోరుకోరన్న అసలైన అహంకారి చంద్రబాబు అని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడవటమే కాకుండా స్పీకర్ కోడెల తనయుడు పీఏ పేరుతో 17 ఎకరాలు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఆయనకు అంత డబ్బు ఎక్కడిదన్నారు.  పత్తి రైతుల కడుపుకొట్టి రూ. 600 కోట్లు దోచుకున్న మంత్రి పుల్లారావు.. నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను భార్య వెంకాయమ్మ పేరుతో మార్చుకున్న పుల్లారావు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే తుళ్లూరు ప్రాంతంలోనే భూములెందుకు కొన్నారని సందేహం వ్యక్తం చేశారు.
నారాయణ, రావెల కిశోర్, సుజనా చౌదరి రాజకీయాలతో సంబంధం లేకపోయినా మంత్రలెలా అయ్యారని, అప్పుడు చంద్రబాబుకు వేల కోట్లు ఇచ్చిన వారు రాజధానిలో దోచుకుంటున్నారన్నారు. టీడీపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా భూ దందాపై సిట్టింగ్ జడ్జి, సీబీఐతో విచారణ జరిపించాలని చంద్రబాబు ప్రభుత్వానికి రోజా సవాల్ విసిరారు.
Share this article :

0 comments: