ఆయన కీచకులకు మెంటార్
మహిళా దినోత్సవం జరుపుకొనే అర్హత బాబుకు లేదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మహిళలంటే చులకనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళలను వేధించేవారికి ఆయన అండగా ఉంటున్నారని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లోటస్పాండ్లో మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ.. మహిళలంటే చంద్రబాబుకు ఎంత చులకనో అందరికీ తెలుసన్నారు. ఢిల్లీలో మాట్లాడినప్పుడు.. కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా అన్నారని, ఆడపిల్లలంటే ఆయనకు అంత అలుసని దుయ్యబట్టారు. ‘‘ఎన్నికల ముందు చంద్రబాబు హామీలు చూసి.. మహిళలకు భద్రత ఉంటుందని ఆయనకు ఓట్లేశారు.
కానీ రాష్ట్రంలో కీచకపాలన నడుస్తోంది. కీచకులందరికీ మెంటార్ చంద్రబాబు, ఆయన వారసుడు లోకేశ్. మొన్న భూ స్కాముల విషయంలో చూస్తే, డబ్బులున్నాయి, కొనుక్కున్నారన్నారు. అమ్మాయిల విషయంలో కూడా వాళ్ల మాటలు అలాగే ఉంటాయి. లోకేశ్ తప్పతాగి అమ్మాయిలతో తిరిగారు. వాళ్ల మామగారు బాలకృష్ణ అమ్మాయిల గురించి దారుణంగా మాట్లాడారు. వాళ్లిద్దరూ చేయగా లేనిది తాము చేస్తే తప్పేంటని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. తహశీల్దార్ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేనికి చంద్రబాబు అండ ఉంది. బుద్ధా వెంకన్న, బోడే ప్రసాద్, బోండా ఉమా అనుచరులు మహిళలను వేధించారు. మంత్రి రావెల కిశోర్ కొడుకు సుశీల్ చిత్తకార్తె కుక్కలా ఓ వివాహితను కారులోకి లాగి అఘాయిత్యం చేయాలనుకున్నాడు.
మంత్రి ప్రెస్మీట్ పెట్టి జగన్ కుట్ర ఉందంటున్నారు. అంటే జగన్ అక్కడ సీసీ కెమెరా పెట్టారా? లేక బురఖాలో జగన్ వెళ్లారా? లేక చేయి పట్టుకుని లాగమని సుశీల్కు చెప్పారా? ఈ వార్త మొదట వచ్చింది టీవీ 9, ఎన్టీవీ చానళ్లలో. తెలంగాణ కాబట్టి రావెల సుశీల్ను స్థానికులు పట్టుకొని కేసు పెట్టించారు. అదే ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉంటే కుక్క మీద కేసు పెట్టి ఉండేవాళ్లు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఉంటుందా? ఇలాంటి మంత్రిని సస్పెండ్ చేయకుండా మహిళా దినోత్సవం జరుపుకొనే నైతిక అర్హత ఉందా చంద్రబాబూ అని ప్రశ్నిస్తున్నా. రావెల కిషోర్ పదవి తీసేయాలి, చింతమనేనిని సస్పెండ్ చేయాలి, బోండా ఉమా లాంటివాళ్లను ఎమ్మెల్యేగా తప్పించాలి అవేవీ చేయకుండా మహిళా దినోత్సవం చేసుకునే అర్హత మీకు లేదు’’ అని విమర్శించారు.
మహిళా దినోత్సవం జరుపుకొనే అర్హత బాబుకు లేదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మహిళలంటే చులకనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళలను వేధించేవారికి ఆయన అండగా ఉంటున్నారని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లోటస్పాండ్లో మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ.. మహిళలంటే చంద్రబాబుకు ఎంత చులకనో అందరికీ తెలుసన్నారు. ఢిల్లీలో మాట్లాడినప్పుడు.. కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా అన్నారని, ఆడపిల్లలంటే ఆయనకు అంత అలుసని దుయ్యబట్టారు. ‘‘ఎన్నికల ముందు చంద్రబాబు హామీలు చూసి.. మహిళలకు భద్రత ఉంటుందని ఆయనకు ఓట్లేశారు.
కానీ రాష్ట్రంలో కీచకపాలన నడుస్తోంది. కీచకులందరికీ మెంటార్ చంద్రబాబు, ఆయన వారసుడు లోకేశ్. మొన్న భూ స్కాముల విషయంలో చూస్తే, డబ్బులున్నాయి, కొనుక్కున్నారన్నారు. అమ్మాయిల విషయంలో కూడా వాళ్ల మాటలు అలాగే ఉంటాయి. లోకేశ్ తప్పతాగి అమ్మాయిలతో తిరిగారు. వాళ్ల మామగారు బాలకృష్ణ అమ్మాయిల గురించి దారుణంగా మాట్లాడారు. వాళ్లిద్దరూ చేయగా లేనిది తాము చేస్తే తప్పేంటని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. తహశీల్దార్ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేనికి చంద్రబాబు అండ ఉంది. బుద్ధా వెంకన్న, బోడే ప్రసాద్, బోండా ఉమా అనుచరులు మహిళలను వేధించారు. మంత్రి రావెల కిశోర్ కొడుకు సుశీల్ చిత్తకార్తె కుక్కలా ఓ వివాహితను కారులోకి లాగి అఘాయిత్యం చేయాలనుకున్నాడు.
మంత్రి ప్రెస్మీట్ పెట్టి జగన్ కుట్ర ఉందంటున్నారు. అంటే జగన్ అక్కడ సీసీ కెమెరా పెట్టారా? లేక బురఖాలో జగన్ వెళ్లారా? లేక చేయి పట్టుకుని లాగమని సుశీల్కు చెప్పారా? ఈ వార్త మొదట వచ్చింది టీవీ 9, ఎన్టీవీ చానళ్లలో. తెలంగాణ కాబట్టి రావెల సుశీల్ను స్థానికులు పట్టుకొని కేసు పెట్టించారు. అదే ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉంటే కుక్క మీద కేసు పెట్టి ఉండేవాళ్లు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఉంటుందా? ఇలాంటి మంత్రిని సస్పెండ్ చేయకుండా మహిళా దినోత్సవం జరుపుకొనే నైతిక అర్హత ఉందా చంద్రబాబూ అని ప్రశ్నిస్తున్నా. రావెల కిషోర్ పదవి తీసేయాలి, చింతమనేనిని సస్పెండ్ చేయాలి, బోండా ఉమా లాంటివాళ్లను ఎమ్మెల్యేగా తప్పించాలి అవేవీ చేయకుండా మహిళా దినోత్సవం చేసుకునే అర్హత మీకు లేదు’’ అని విమర్శించారు.
0 comments:
Post a Comment