మంత్రులే అసైన్డు భూములు కొంటారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రులే అసైన్డు భూములు కొంటారా?

మంత్రులే అసైన్డు భూములు కొంటారా?

Written By news on Saturday, March 5, 2016 | 3/05/2016


రాజధాని ప్రకటనకు ముందే ఆ భూములెలా కొన్నారు?
♦ రాజ్యాంగంపై ప్రమాణం చేసి రహస్యాలు బయటపెడతారా?
♦ దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందా? లేదా?
♦ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించిన బొత్స
 సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రభుత్వ విషయాలు ఎవరికీ తెలియజేయనని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. దాన్ని తుంగలో తొక్కారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చెప్పకపోయి ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు రాజధాని ప్రాంతం ప్రకటించడానికి మూడు నెలల ముందే అక్కడ భూములు ఎలా కొనగలిగారని ప్రశ్నించారు. భూములు కొన్న నేతల పేర్లు, రిజిస్ట్రేషన్ తేదీలతో సహా బహిర్గతమవుతుంటే.. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా? లేదా? అంటూ బొత్స ధ్వజమెత్తారు. ‘‘మీ తాబేదారులకు, మంత్రులకు, అనుకూలురకు చెప్పి వారితో వేల ఎకరాలు సామాన్య రైతుల నుంచి కొనిపించి ఆ భూముల ధరలు పెంచుకోవడం ద్వారా రూ.లక్షల కోట్ల దోపిడీ చేయడం లేదా? దానిపై సీబీఐ విచారణ కోరుతున్నాం. మీ నిజాయితీ నిరూపించుకోవాలంటున్నాం. సాధారణంగా భూములు కొన్న వారి గురించి మేం మాట్లాడటం లేదు. ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్లు అనంతపురం నుంచో.. నెల్లూరు నుంచో.. హైదరాబాద్ నుంచో వెళ్లి అక్కడ భూములు కొనడాన్నే ప్రశ్నిస్తున్నాం’’ అని అన్నారు.
 మంత్రులే అసైన్డు భూములు కొంటారా?
నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డు భూములను కొనడమే పెద్ద నేరమని బొత్స అన్నారు. అందులోనూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఒక మంత్రి.. భార్య పేరుమీద కొనడం ఇంకా తప్పు అన్న ఆయన.. అసైన్డు భూములు కొన్న వారిపై చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. తన సంస్థలో ఉద్యోగుల పేరుతో భూములు కొన్న మరో మంత్రి తాను రూ. 200 కోట్లు ట్యాక్స్ కడుతున్నానని, దోపిడీకి ఇంకా అవకాశమిస్తే వెయ్యి కోట్లు కూడా కడతామని ఆ మంత్రి చెబుతారని ఎద్దేవా చేశారు. భూ లూటీపై న్యాయ విచారణకు ఆదేశిస్తారా లేదా అని బాబును మరోసారి డిమాండ్ చేశారు.
 బీజేపీ స్వచ్ఛమైన పార్టీ అయితే..
స్థానిక బీజేపీ నాయకులు తమది స్వచ్ఛమైన పార్టీ అని ప్రజలకు చెప్పుకోవాలంటే.. ఈ భూ లూటీపై విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని బొత్స అన్నారు. కనీసం ఇక్కడి ప్రభుత్వాన్నైనా విచారణ జరిపించుకోనెలా కోరాలన్నారు. ఇప్పటి వరకు ఇసుకను దోచుకున్నారని.. ఇప్పుడు విధివిధానాలు లేకుండా ఉచితమంటూ డ్రామా మొదలు పెట్టారన్నారు. ఉచితం వెనుక ఉద్దేశం కొద్దిరోజుల్లో తెలిసిపోతుందన్నారు
Share this article :

0 comments: