ఎమ్మెల్యేలపై చర్యలతో ప్రజాస్వామ్యాన్ని స్పీకరే రక్షించాలని, ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని తాము భావిస్తున్నామన్నారు. అలా జరిగితే రాజకీయాల్లో నీతి, నిబద్ధత అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకునే చంద్రబాబుకు కనువిప్పు కలుగుతుందని తాము భావిస్తున్నామన్నారు. స్పీకర్ తగు నిర్ణయం తీసుకుంటే అది చంద్రబాబుకు చెంపపెట్టు అవుతుందని జ్యోతుల నెహ్రు అన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఉప ఎన్నికలు వస్తే ప్రజల మనోభావాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
కొందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి (వాయిస్, వీడియో రికార్డులు, ఫోటోలు) అన్ని ఆధారాలను స్పీకర్ కు అందచేశామన్నారు. వైఎస్ఆర్ సీపీకి స్పీకర్ న్యాయం చేస్తారని తాము భావిస్తున్నామన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యే బడ్జెట్ సమావేశాల్లో సమస్యలపై దేనికి ఇచ్చే ప్రాధాన్యత దానికి ఇచ్చుకుంటూ వెళతామన్నారు. ముందుగా ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం బట్టి ఆయనపై అవిశ్వాసం పెట్టాలా వద్దా అనే దానిపై ఆలోచిస్తామన్నారు.
0 comments:
Post a Comment