గిరిజనుల మనోభావాలను తాకట్టు పెట్టారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గిరిజనుల మనోభావాలను తాకట్టు పెట్టారు

గిరిజనుల మనోభావాలను తాకట్టు పెట్టారు

Written By news on Friday, April 29, 2016 | 4/29/2016

విశాఖ : గిరిజనుల మనోభావాలను అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 20 కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే అమ్ముడుపోయి 50 ఎకరాలు లీజుకు ఇచ్చారని ఆరోపించారు. గిరిజనుల హక్కులను తాకట్టు పెట్టి ఎమ్మెల్యే సొమ్ము చేసుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. లక్షలు ఎర చూపి ఎంపీపీ, జడ్పీటీసీలను కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేర్పించారని ఆమె అన్నారు. కిడారి సర్వేశ్వరరావు వైఎస్సార్ సీపీకి నమ్మకద్రోహం చేశారని,  వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి వెన్నుపోటుపొడిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: