న్యూఢిల్లీ: అధికార టీడీపీ అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష శాసనసభ్యులను కొనుగోలు చేస్తున్న తీరును నిరసిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని నినదిస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధానిలో సేవ్ డెమొక్రసీ ఉద్యమం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక రాజకీయాలను జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి, ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ప్రజా ప్రతినిధుల బృందం కార్యాచరణ ప్రారంభించింది.
మంగళవారం ఉదయం వైఎస్ జగన్ బృందం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కలిసింది. ఢిల్లీలో శరద్ పవార్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పి పార్టీలోకి తీసుకుంటున్న పరిస్థితులను పవార్ కు వివరించారు. ఈ రోజు హోం మంత్రి రాజ్నాథ్సింగ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీయూ నేత శరద్యాదవ్తో సమావేశంకానున్నారు.
0 comments:
Post a Comment