చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు తప్పా డైరెక్ట్ పాలిటిక్స్ చేతకాదని ఎద్దేవా చేశారు. చిదంబరం కాళ్ల మీద పడి జగన్ పై కేసులు బనాయించారని ఆరోపించారు. నీచులతో చేతులు కలిసి జగన్ ను జైలుకు పంపారన్నారు. అవినీతికి పెద్దపీట వేయడంలో చంద్రబాబు ముందున్నారని దుయ్యబట్టారు. కోట్లతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. గెలిచిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఫిరాయింపు ఎమ్మెల్యేలు మరో వెన్నుపోటుదారు వద్దకు వెళుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రజల మేలు కోసమే జగన్ ఆలోచిస్తున్నారని, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎన్నో దీక్షలు చేశారని గుర్తు చేశారు. జననేత ప్రజలతోనే ఉన్నారని, ప్రజలకు ఎప్పుడు దూరంగా లేరని చెప్పారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కొనాలా అని నారా లోకేశ్ ఆలోచిస్తున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు.
0 comments:
Post a Comment