జలదీక్ష శిబిరం వద్దకు తరలివచ్చిన వేలాదిమంది ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. మనకు రావాల్సిన నీళ్ల కోసం మనమందరం కలసి కట్టుగా పోరాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి కలసి కట్టుగా పోరాడాలని, ఇందుకు మీ అందరి దీవెనలు కావాలని కోరారు. ఇంకా నెల, రెండు నెలలు చూసి ఎలాంటి మార్పు రాకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈసారి గోదావరి నీళ్ల కోసం పోరాటం చేస్తామని, పోలవరం వేదికగా మరో దీక్ష చేపడుతామని చెప్పారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..
- ఎండలు తీవ్రంగా ఉన్నా, మండుతున్న ఎండలను ఖాతరు చేయకుండా, ముఖంలో చిరునవ్వు చూపిస్తూ ఇంతటి ఆత్మీయతను, ప్రేమానురాగాలు చూపిస్తున్న ఇక్కడున్న ప్రతి అక్కచెల్లెమ్మలకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, అవ్వతాతలకు, ఇక్కడికి వచ్చిన వారికే గాక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చేతులెత్తి, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
- మూడురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నాం. మన బాధలు, గోడు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన గోడు విని వారిలో మార్పు వస్తుందేమోని పోరాడుతున్నాం
- అన్యాయం జరుగుతోంది కాబట్టి ఇవాళ మనమందరం ఇక్కడికి వచ్చి గళం విప్పుతున్నాం
- కేసీఆర్ ను ఒక్క మాట అడుగుతున్నా. మొన్నటి వరకు మనం కలసి ఉన్నాం, తెలుగే మాట్లాడుతున్నాం, ఒకే రాష్ట్రంగా ఉన్నాం. ఆ రోజు మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు కడుతున్నప్పుడు మనమందరం కలసి పోరాడిన విషయం గుర్తురాలేదా?
- కేసీఆర్ గారూ మీ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఇవాళ మీరు కూడా పై రాష్ట్రాల మాదిరే చేస్తున్నారు.
- మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రాజెక్టులు నిండితే గానీ కిందకు నీళ్లు రాని పరిస్థితి. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ఎక్కడకక్కడ ప్రాజెక్టులు కడుతుంటే కింద ఉండే రైతులకు నీళ్లు ఎలా వస్తాయి?
- కేసీఆర్ గారూ మా రాష్ట్రం తెలంగాణపైన ఉండి మేం నీళ్లు ఆపుంటే మీకు నచ్చేదా?
- ఇవాళ కావాల్సింది అందరూ కలసికట్టుగా ఉండటం. మనంమనం తన్నుకుని గొడవలు పడటం కాదు
- వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, అన్యాయం జరగకుండా చూడాలి
- పైరాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక పాలకులు కూడా ఆలోచించాలి
- పైన వర్షాలు పడినప్పుడు మా నీళ్లు మేమే తీసుకుంటామంటే కిందివారి పరిస్థితి ఏమిటో ఆలోచించాలి
- మహారాష్ట్ర, కర్ణాటక నీళ్లు కిందకు ఇవ్వకుంటే తెలంగాణ పరిస్థితి ఏంటి?
- ప్రతి వర్షం చుక్కలో దామాషా పద్ధతి ప్రకారం ఎవరివాటా ఎంత అని లెక్కలు కట్టి, ఎవరి వాటా నీళ్లు వాళ్లు వాడుకుని మిగిలిన నీళ్లను కిందకు వదలాలి
- కృష్ణా నది మహబూబ్ నగర్ జిల్లాను దాటుకుని కర్నూలు జిల్లాకు రావాలి
- మహబూబ్ నగర్ జిల్లాలో 800 అడుగుల ఎత్తున రోజుకు 30 వేల క్యూసెక్కుల నీళ్లను తోడుకుంటే కిందకు నీళ్లు ఎలా వస్తాయి?
- గోదావరి నీళ్లు కిందకు రాకుండా తెలంగాణలో ఎడాపెడా ప్రాజెక్టులు కడుతున్నారు
- కేసీఆర్ గారూ అధికారం చేతిలో ఉందని పేదవాళ్లమైన మాపై ప్రతాపం చూపడం భావ్యమేనా?
- ఈ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా అని అడుగుతున్నా?
- శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రాకుంటే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగడానికి నీళ్లు కూడా ఉండవు
- గోదావరిలో రోజుకు 70 వేల క్యూసెక్కులు నీరు వాడుకుంటే కింద ఉన్న ఆయకట్టు పరిస్థతి ఏంటి?
- ఈ అన్యాయంపై చంద్రబాబు పోరాడుతాడని అనుకుంటే ఆయన నోట ఏ మాటా రాదు. ఎటువంటి పోరాటం చేయడం లేదు
- కేసీఆర్ ను గట్టిగా అడిగితే ఓటుకు నోటు కేసు బయటకు తీసి, జైల్లో పెట్టిస్తాడని చంద్రబాబుకు భయం
- పోనీ ఢిల్లీ వారినైనా, ప్రధాని మోదీనైనా అడుగుతారా అంటే అదీలేదు
- మోదీకి అల్టిమేటమ్ ఇచ్చే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు
- ఎందుకంటే చంద్రబాబు 24 నెలల్లో చేసిన అవినీతిపై సీబీఐ విచారణ వేయిస్తారని భయం
- చంద్రబాబుకు కేసీఆర్ ను అడిగే ధైర్యం లేదు, మోదీని అడిగే ధైర్యం లేదు
- అడిగే ధైర్యం లేనపుడు ఢిల్లీకి ఎందుకు వెళ్లావని చంద్రబాబును అడుగుతున్నా
- మోదీతో సమావేశమయ్యాక ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం అని ఆయనే అంటారు
- కేసీఆర్ అడ్డుగోలుగా కడుతున్న ప్రాజెక్టులపై మోదీకి ఫిర్యాదు చేస్తారని ఆశించాం
- తీరా చూస్తే ఫిర్యాదు కథ దేవుడెరుగు.. తెలంగాణ ప్రాజెక్టులపై ఓ విలేకరి చంద్రబాబును అడిగితే.. అన్ని అనుమతులు తీసుకుని కట్టాలి, కేంద్రం పరిష్కరించాలి అని అన్నారు
- ఇవన్నీ మాకు తెలీవా అని చంద్రబాబును అడుగుతున్నా
- వాళ్లు ప్రాజెక్టులు కడుతుంటే నువ్వేమి చేస్తున్నావని అడుగుతున్నా
- ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటు
- చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక అడ్డుగోలుగా ప్రాజెక్టులు కట్టినా ఏమీ చేయలేకపోయాడు
- ఇవాళ తెలంగాణ అదే పనిచేస్తుంటే చంద్రబాబు నోరుమెదపడం లేదు
- తాగడానికి నీళ్లు దొరకవని ప్రజలు ఆందోళన చెందుతుంటే చంద్రబాబు నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నారు
- మనకు జరుగుతున్న అన్యాయంపై మనమందరం కలసి కట్టుగా పోరాడాలి
- వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి కలసి కట్టుగా పోరాడాలి. ఇందుకు మీ అందరి దీవెనలు కావాలి
- ఇంకా నెల, రెండు నెలలు చూసి ఎలాంటి మార్పు రాకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తాం
- ఈసారి గోదావరి నీళ్ల కోసం పోరాటం చేస్తాం, పోలవరం వేదికగా మరో దీక్ష చేపడుతాం
- ఎండను లెక్కచేయకుండా ఇంతటి ఆప్యాయతను చూపిన అందరికీ చేతులు జోడించి, శిరస్సు వహించి నమస్కరిస్తున్నా
0 comments:
Post a Comment