కాకినాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. రేపు (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ధర్నాలు చేపట్టనుంది. ఈ సందర్భంగా కాకినాడ వైఎస్ఆర్సీపీ ధర్నాలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. సోమవారం విశాఖలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
హోదాపై టీడీపీ-బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసు కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదని కన్నబాబు విమర్శించారు.
0 comments:
Post a Comment